French Newspaper: ఇది ‘లీప్’ న్యూస్పేపర్.. నాలుగేళ్లకోసారి వచ్చే పత్రిక తెలుసా..?
ప్రపంచంలోనే నాలుగేళ్లకోసారి వచ్చే న్యూస్పేపర్ గురించి తెలుసా..? అలాంటి ఓ వార్తపత్రికను ఫ్రాన్స్ వాసులు బుధవారం అందుకున్నారు. ఇంతకీ ఏంటా పేపర్? దాని కథేంటీ?
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా వార్తాపత్రికలు (News Paper) ప్రతి రోజు వస్తుంటాయి. లేదా కొన్ని ప్రత్యేక వీక్లీ, మంత్లీ, ఇయర్లీ మ్యాగజైన్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. కానీ, ఫ్రాన్స్ (France)లో ఓ న్యూస్పేపర్ మాత్రం నాలుగేళ్ల కోసారి మాత్రమే వస్తుంది. ప్రతి లీప్ సంవత్సరంలో దాన్ని ప్రచురిస్తుంటారు. ఈ రోజు ఫిబ్రవరి 29 కావడంతో ఫ్రాన్స్ వాసులు ఆ పత్రికను అందుకున్నారు.
‘లా బౌగీ డు సప్పర్ (ది సప్పర్స్ క్యాండిల్)’ అనేది వ్యంగ్యాస్త్రాలు విసిరే వార్తాపత్రిక. రోజువారీ జీవితంలో జరిగే విచిత్రాలపై సెటైర్లను ఇందులో ప్రచురిస్తుంటారు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే అని చెప్పే నిర్వాహకులు మొదటిసారిగా దీన్ని 1980లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఫిబ్రవరి 29న విడుదల చేస్తున్నారు. చివరిసారిగా 2020లో రాగా.. మళ్లీ నేడు 12వ ఎడిషన్ను అందుబాటులోకి తెచ్చారు.
లీపు సంవత్సరం వస్తే వారికి పండగే
20 పేజీలుండే ఈ పత్రిక (La Bougie du Sapeur)లో జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, క్రీడలు, సినిమాల వంటి వాటిపై సెటైరికల్ కథనాలు, ఫన్నీ జోక్స్తో పాటు క్రాస్వర్డ్స్ను కూడా ఇస్తారు. అయితే వాటి సమాధానాలు మాత్రం తదుపరి ఎడిషన్లో చెబుతారు. అంటే జవాబుల కోసం నాలుగేళ్లు ఆగాల్సిందే..! ప్రతిసారీ 2 లక్షల కాపీలను ముద్రిస్తారు. ఒక్కో పత్రిక ధర 4.9 యూరోలు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.440.
ఫ్రాన్స్కు చెందిన తొలితరం కార్టూనిస్ట్ లీ సప్పర్ కామెంబెర్ట్ గుర్తుగా ఈ పత్రికకు పేరు పెట్టారు. ఇది ఆన్లైన్లో అందుబాటులో లేదు. న్యూస్ ఏజెంట్లు, దుకాణాల నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్