BJP: భాజపా వ్యూహాత్మక నిర్ణయం.. బరిలో కసబ్ కేసు న్యాయవాది

ముంబయిలో సిట్టింగ్ ఎంపీలను మార్చి భాజపా అందరికీ షాక్ ఇచ్చింది. ముంబయి బాంబు పేలుళ్ల కేసు ఉగ్రవాది కసబ్ కేసు సహా ఎన్నో సంచలనాత్మక కేసులను వాదించిన సీనియర్ లాయర్ ఉజ్వల్ నికమ్ పేరును ప్రకటించి సంచలనం రేపింది.

Published : 29 Apr 2024 12:48 IST

సార్వత్రిక ఎన్నికల్లో 400 స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భాజపా.. ముంబయిలో సిట్టింగ్ ఎంపీలను మార్చి అందరికీ షాక్ ఇచ్చింది. ముంబయి నార్త్ సెంట్రల్ స్థానంలో వరుసగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పూనమ్ మహాజన్ స్థానంలో ప్రముఖ సీనియర్ లాయర్ ఉజ్వల్ నికమ్ పేరును ప్రకటించి సంచలనం రేపింది. ముంబయి బాంబు పేలుళ్ల కేసు ఉగ్రవాది కసబ్ కేసు సహా ఎన్నో సంచలనాత్మక కేసులను వాదించి దేశ వ్యాప్తంగా పేరు గడించిన నికమ్‌ను ఎన్నికల బరిలో దింపి కమలం పార్టీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.

Tags :

మరిన్ని