Bapatla: వాన నీటిలో బడి.. చదువులెలా జగన్‌ మామయ్యా?

బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధర్మవరం ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను వరద నీరు ముంచెత్తింది. తరగతి గదులు, వరండాలు ఇలా బడి ప్రాంగణమంతా వర్షపు నీరు చేరి బురదమయమైంది. వాన నీటితో విద్యార్థులు, టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా పాఠశాల దుస్థితి ఇలానే ఉన్నా.. కనీసం మరమ్మతులు చేయట్లేదని స్థానికులు చెబుతున్నారు. నాడు- నేడు అంటూ ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రికి కష్టాలు కనపడవా? అని ప్రశ్నిస్తున్నారు.

Updated : 08 Nov 2023 19:39 IST

బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధర్మవరం ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను వరద నీరు ముంచెత్తింది. తరగతి గదులు, వరండాలు ఇలా బడి ప్రాంగణమంతా వర్షపు నీరు చేరి బురదమయమైంది. వాన నీటితో విద్యార్థులు, టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా పాఠశాల దుస్థితి ఇలానే ఉన్నా.. కనీసం మరమ్మతులు చేయట్లేదని స్థానికులు చెబుతున్నారు. నాడు- నేడు అంటూ ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రికి కష్టాలు కనపడవా? అని ప్రశ్నిస్తున్నారు.

Tags :

మరిన్ని