శుక్రవారం, డిసెంబర్ 13, 2019
రెంజల్లో పోషకాహార ప్రదర్శన
రెంజల్(ఎడపల్లి), న్యూస్టుడే: పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఐసీడీఎస్ బోధన్ సీడీపీవో లలితా కుమారి పేర్కొన్నారు. రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పోషణ్ అభియాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాహారాల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోతే రోగాల బారిన పడతారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అసదుల్లా ఖాన్, ఎంపీడీవో గోపాలకృష్ణ, ఎంఈవో గణేశ్, మండల పర్యవేక్షకురాలు ప్రమీలారాణి, ఏపీఎం చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు