AP PGECET Results: ఏపీ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

Eenadu icon
By Features Desk Updated : 24 Jun 2025 19:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఏపీ పీజీఈసెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఇంటర్నెట్ డెస్క్‌: ఏపీలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్‌-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఏపీ మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) ‘ఎక్స్‌’ వేదికగా మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీకి సంబంధించి 13 సబ్జెక్టుల్లో నిర్వహించిన ఈ పరీక్షలో 93.55శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. మొత్తంగా 14,231 మంది ఈ పరీక్షకు రిజిస్టర్‌ చేసుకోగా.. 11,244 మంది అర్హత సాధించారన్నారు. వీరిలో 5491  మంది విద్యార్థులు కాగా.. 5,753మంది విద్యార్థినులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు.

ర్యాంక్ కార్డు కోసం క్లిక్‌ చేయండి


Published : 24 Jun 2025 18:30 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని