AP SSC Advanced Supplementary results: ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

Eenadu icon
By Features Desk Updated : 12 Jun 2025 17:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: ఏపీలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను అధికారులు గురువారం సాయంత్రం విడుదల చేశారు. మొత్తంగా 1,23,477మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 76.14శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రకటించారు. బాలురలో 73.55 శాతం, బాలికల్లో 80.10శాతం  ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. (AP SSC Advanced Supplementary results)

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

విద్యార్థులు జూన్‌ 13 నుంచి 19వ తేదీ వరకు రీకౌంటింగ్‌/ రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500; రీవెరిఫికేషన్‌కు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.


Published : 12 Jun 2025 17:16 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని