CTET 2023: సీటెట్‌ (జులై)కు దరఖాస్తుల ఆహ్వానం

కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET july- 2023)పరీక్షకు సీబీఎస్‌ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Published : 27 Apr 2023 20:42 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ(CBSE) ఏటా నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET Exam-july 2023) నోటిఫికేషన్‌ విడుదలైంది. జులై నుంచి ఆగస్టు మధ్య కాలంలో కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్‌ఈ వెల్లడించింది. పరీక్షలకు సంబంధించిన కచ్చితమైన తేదీలను అడ్మిట్‌ కార్డుల్లో పొందుపరచనున్నట్టు తెలిపింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు నేటి నుంచి (ఏప్రిల్‌ 27) నుంచి మే 26 అర్ధరాత్రి 11.59గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే రూ.500ల చొప్పున;  రెండు పేపర్లకైతే రూ.1200, రూ.600ల చొప్పున పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది.  ఈ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

కొన్ని ముఖ్యమైన పాయింట్లు..

  • సీటెట్‌ ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. ప్రస్తుతం 17వ ఎడిషన్‌ సీటెట్‌కు రిజిస్ట్రేషన్లు ఆహ్వానిస్తున్నారు.
  • ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. పేపర్-1ను​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునేవారు; పేపర్-2ను​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారు రాయొచ్చు.
  • సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది.
  • పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు.
  • సీటెట్​ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. 

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని