CUET-PG: సీయూఈటీ (పీజీ) 2023 దరఖాస్తుల గడువు పొడిగింపు

CUET(PG) 2023: సీఈయూటీ (పీజీ) పరీక్షకు దరఖాస్తులకు నేటితో గడువు ముగిసింది. దీంతో ఆ గడువును మే 5వరకు పొడిగిస్తున్నట్టు ఎన్‌టీఏ వెల్లడించింది.

Published : 19 Apr 2023 22:48 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే  కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (CUET-PG) దరఖాస్తుల గడువును NTA పొడిగించింది.  ఏప్రిల్‌ 19(నేటితో) దరఖాస్తుల గడువు ముగియడంతో ఆ గడువును మే 5వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు మే 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. సమర్పించిన దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించేందుకు మే 6, 7, 8 తేదీల్లో అవకాశం కల్పించారు. పరీక్ష తేదీలు, అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌, ఫలితాల ప్రకటన తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు ఎన్‌టీఏ తెలిపింది.

రిజిస్ట్రేషన్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని