వింధ్య పర్వతాల్లో జన్మించి.. కర్కట రేఖను ఖండించి..
భారతదేశంలో జీవనదులు, ద్వీపకల్ప నదులు ప్రవహిస్తున్నాయి. కొన్ని నదులు మన దేశ సరిహద్దులు దాటి పొరుగు దేశాల్లోకి ప్రవేశిస్తుంటాయి. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు.
ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
జాగ్రఫీ
భారతదేశంలో జీవనదులు, ద్వీపకల్ప నదులు ప్రవహిస్తున్నాయి. కొన్ని నదులు మన దేశ సరిహద్దులు దాటి పొరుగు దేశాల్లోకి ప్రవేశిస్తుంటాయి. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. ఈ నదులన్నీ అనేక రాష్ట్రాలు, పలు దేశాల్లో ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలిసిపోతాయి. వీటన్నింటిపై పోటీ పరీక్షల అభ్యర్థులు సరైన అవగాహన ఏర్పర్చుకోవడం అవసరం.
భారతదేశ నదీ వ్యవస్థ
సింధూ నది
సింధూ నదిని ఆంగ్లంలో ఇండస్ (Indus) అంటారు. ఇండస్ నది పేరు మీదుగానే మనదేశానికి ఇండియా అనే పేరు వచ్చింది.
- టిబెట్లోని కైలాస పర్వతాల తూర్పు భాగాన ఉన్న మానస సరోవరం వద్దనున్న బొఖార్చు వద్ద ఈ నది జన్మిస్తుంది.
- ఇది టిబెట్, భారతదేశం, పాకిస్తాన్ దేశాల్లో ప్రవహిస్తుంది.
- లద్దాఖ్లోని థాంచోక్ ప్రాంతం వద్ద ఈ నది భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. మొత్తం పొడవు 2880 కి.మీ. భారతదేశంలో దీని పొడవు 709 కి.మీ. మొత్తం పరీవాహక ప్రాంతం 11,65,000 చ.కి.మీ. కాగా మనదేశంలో దీని పరీవాహక ప్రాంతం 3,21,000 చ.కి.మీ.
- లద్దాఖ్ పర్వతాలు, జస్కర్ పర్వతాల మధ్య ప్రవహించి పాకిస్తాన్లోని తర్బలా వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.
- పాకిస్తాన్లోని ఎడారి మీదుగా ప్రవహించి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.
ఇతర పేర్లు: సంస్కృతం - సింధు లాటిన్ - సింధూస్ పర్షియన్ - హైందవి గ్రీక్ - సింథోస్ టిబెట్ - సింగి ఖంబన్ (Lion's Mouth)
పరీవాహక ప్రాంతం: భారతదేశంలో మూడు కేంద్రపాలిత ప్రాంతాలు, 5 రాష్ట్రాలు సింధూనది పరీవాహక ప్రాంత పరిధిలో ఉన్నాయి.
అవి: 1. లద్దాఖ్ 2. జమ్మూకశ్మీర్ 3. చండీగఢ్ 4. ఉత్తరాఖండ్ 5. పంజాబ్ 6. హరియాణా 7. హిమాచల్ప్రదేశ్ 8. రాజస్థాన్
- ఈ నది భారతదేశంలో 39% పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది.
- నంగపర్బత్ ప్రాంతాన్ని తాకుతూ ప్రవహించే సింధూనది ఉత్తరాన బుంజి వద్ద అత్యంత లోతైన ‘సింధూగార్జ్’ను ఏర్పరుస్తుంది.
- పాకిస్తాన్ జాతీయ నది సింధు.
సింధూనది ఉపనదులు:
కుడివైపు నుంచి కలిసేవి/పర్వత ప్రాంత ఉపనదులు: సోనక్, శిగర్, గిల్గిట్, హంజ, విబోవ, గోమల్, తోచి, కాబూల్. కాబూల్ నది ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చి అటోక్ వద్ద సింధూనదితో కలుస్తుంది.
ఎడమ వైపు నుంచి కలిసేవి/మైదాన ప్రాంత ఉపనదులు: జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, జస్కర్, ద్రాస్.
జీలం: ఈ నదిని సంస్కృతంలో వితస్థ అని పిలుస్తారు. దీని పొడవు 725 కి.మీ.
- శ్రీనగర్ లోయ మీదుగా ప్రవహిస్తుంది. ఈ నదిపై ఉలార్ సరస్సు ఉంది.
చీనాబ్: సంస్కృతంలో చంద్రభాగ అంటారు. పొడవు 1180 కి.మీ.
రావి: సంస్కృతంలో పరూషిని అంటారు. పొడవు 720 కి.మీ.
- పాకిస్తాన్లోని లాహోర్ పట్టణం ఈ నది ఒడ్డునే ఉంది. అందుకే దీనికి లాహోర్ నది అని పేరు.
బియాస్: సంస్కృతంలో విపస అని పిలుస్తారు. పొడవు 460 కి.మీ.
- భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు ఉపనది ఇది.
సట్లెజ్: సంస్కృతంలో శతద్రీ అంటారు. దీని పొడవు 1400 కి.మీ.
- సింధూ నదికి సమాంతరంగా ప్రవహించేది, దాని ఉపనదుల్లో పొడవైంది. భాక్రానంగల్ ప్రాజెక్ట్ ఈ నదిపై ఉంది.
గంగానది
అలకనంద: ఉత్తరాఖండ్లోని కుమయూన్ హిమాలయాల్లో ఉన్న ఘర్వాల్ జిల్లాలోని బద్రీనాథ్ సమీపంలో సంతోవత్ అనే హిమనీ నదంలో జన్మిస్తుంది.
భగీరథ: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో గంగోత్రి హిమనీ నదం వద్ద జన్మిస్తుంది.
- భగీరథ, అలకనందలు ఉత్తరాఖండ్లోని శివాలిక్ పాదాల వద్దనున్న దేవప్రయాగ్ వద్ద ఒకటిగా కలవడంతో గంగా నది ఏర్పడుతుంది.
- భారతదేశంలో అతి పొడవైన నది గంగా.
- గంగా నది హరిద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది. ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, పశ్చిమ్బంగాల మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. మొత్తం పొడవు 2525 కి.మీ. పరీవాహక ప్రాంతం 861000 చ.కి.మీ.
- దీన్ని బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారు.
- గంగను జాహ్నవి, అతితరుణ నది అని కూడా పిలుస్తారు.
- దీన్ని 2008 నవంబరులో జాతీయ నదిగా గుర్తించారు.
ఉపనదులు: గంగా నది ఉపనదులు మూడు రకాలు.
1. హిమాలయాల్లో జన్మించి, దక్షిణ దిశగా ప్రవహించి ఎడమ వైపు నుంచి గంగా నదిలో కలిసేవి. రామ్గంగ, గోమతి, ఘాగ్ర, గండక్, కోసి, మహానంద, బుర్హి.
2. హిమాలయాల్లో పుట్టి దక్షిణ దిశలో ప్రవహించి కుడివైపు నుంచి గంగా నదితో కలిసేవి. గంగ ఉపనదుల్లో పొడవైంది యమున.
3. ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టి కుడివైపు నుంచి గంగానదిలో కలిసే ఉపనదులు - సోన్నది, దామోదర్, చంబల్, బెట్వా, థమ్సా నది.
- కోసి నదిని బిహార్ దుఃఖదాయని అంటారు.
- దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయని అంటారు. ఈ నది చోటానాగపూర్ పీఠభూమిలోని పలమూరు కొండల్లో జన్మిస్తుంది.
- చోటానాగపూర్ పీఠభూమిని రెండుగా విభజించేది దామోదర్ నది.
- బంగ్లాదేశ్లో పద్మ నదిగా పేరొందిన గంగ గులందో ప్రాంతం వద్ద బ్రహ్మపుత్రతో కలిసి మేఘనగా మారి సాగరదీవుల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
అరేబియా సముద్రంలో కలిసే ద్వీపకల్ప నదులు
దేశంలో పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే ద్వీపకల్ప నదులు ఉన్నాయి. అవి..
నర్మద: మధ్యప్రదేశ్లోని మైకాల్ శ్రేణిలోని అమరకంఠక్ పీఠభూమిలో జన్మిస్తుంది. మొత్తం పొడవు 1312 కి.మీ. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది.
- ఈ నది వింధ్య, సాత్పూరా పర్వతాలకు మధ్య ఉన్న పగులు లోయ (Rift Valley) మీదుగా ప్రవహిస్తుంది.
- భారతదేశ భూభాగానికి మధ్యలో ప్రవహించే నది నర్మద.
నదిపై ఉన్న జలపాతాలు: కపిలధార, ధూద్ధర్, మార్బుల్, మంతర్, దర్ది. ఇవన్నీ మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి.
( పశ్చిమంగా ప్రవహించే నదుల్లో అతిపెద్ద నది నర్మద. ఈ నది డెల్టాను ఏర్పరచదు.
ఉపనదులు: కుడివైపు: హిరాన్, బార్న, కోలర్, బర్సాంగ్.
ఎడమవైపు: షక్కర్, తవ, బంజర్. తవ అతిపెద్ద ఉపనది. బంజర్ పొడవైంది.
తపతి: మధ్యప్రదేశ్లోని భేతుల్ పీఠభూమిలోని ముల్తాయి వద్ద జన్మిస్తుంది. ఈ నదిని సూర్యపుత్రి లేదా నర్మదకు కవల ్బగ్తి’ గి్రi- ్న÷ వ్చి౯్ఝ్చ్ట్చ్శ అంటారు. మొత్తం పొడవు 724 కి.మీ.
- ఉత్తరాన సాత్పూరా, దక్షిణాన అజంతా, సాత్మల కొండలు సరిహద్దుగా ఉన్నాయి. ఈ నదికి వ్యతిరేక దిశలో ప్రవహించేది వార్దానది. తపతి ఖాందేష్ మైదానాన్ని ఏర్పరుస్తుంది. ఈ నది ఒడ్డున ఉన్న నగరం సూరత్. ఈ నదిపై కాక్రపార, ఉకాయ్ డ్యామ్లు ఉన్నాయి.
ఉపనదులు: వాఘర్, గోమయ్, పూర్ణ, గిర్నా, పంజ్రా, అరుణవతి, నేసు.
మహీనది: మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వతాల్లో భోపవర్ వద్ద జన్మిస్తుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రవహించి కాంబే సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.
- భారతదేశం మధ్య మీదుగా వెళ్లే అక్షాంశరేఖ అయిన కర్కట రేఖను రెండుసార్లు ఖండిస్తూ ప్రవహిస్తుంది. ఈ నది వాల్వోడ్, గజాన అనే నదీ ఆధారిత దీవులను ఏర్పరుస్తుంది.
ఉపనదులు: సోమ్, అనాస్, మోరన్, భదర్.
సబర్మతి: ఆరావళి పర్వతాల్లో మేవార్ వద్ద ఉన్న దేబార్ సరస్సు వద్ద జన్మిస్తుంది. దీన్ని గిరికర్ణిక అని పిలుస్తారు. మొత్తం పొడవు 371 కి.మీ. అధిక పరీవాహక ప్రదేశం గుజరాత్లో ఉంది.
- గరుడ పురాణాల్లో ప్రస్తావించిన నది సబర్మతి.
- సర్దార్ సరోవర్ కెనాల్ ద్వారా అరేబియా సముద్రంలో కలుస్తుంది.
- అహ్మదాబాద్, గాంధీనగర్ పట్టణాలు ఈ నది ఒడ్డున ఉన్నాయి.
ఉపనదులు: హర్నవ్, వాకల్, హత్మతి, నేష్వా, సెయ్.
బ్రహ్మపుత్ర నది
ఈ నది టిబెట్లోని కైలాస పర్వత శ్రేణిలో ఉన్న ‘చెమయాంగ్ డంగ్’ అనే హిమనీ నదం వద్ద జన్మిస్తుంది.
- ఈ నది మొత్తం పొడవు 2900 కి.మీ. మనదేశంలో 916 కి.మీ.
- టిబెట్ (చైనా) మీదుగా తూర్పునకు ప్రవహించి అరుణాచల్ప్రదేశ్లోని సిడియా వద్ద భారత్లోకి ప్రవేశించి అసోం మీదుగా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది.
ప్రాంతీయ పేర్లు: టిబెట్ - సాంగ్పో (అంటే స్వచ్ఛమైన అని అర్థం)
అరుణాచల్ప్రదేశ్ - దిహాంగ్, సియాంగ్.
అసోం - సైడాంగ్, ఎరుపునది, బ్రహ్మపుత్ర, అసోం దుఃఖదాయని.
ఉత్తర బంగ్లాదేశ్ - జమున, దక్షిణ బంగ్లాదేశ్ - మేఘన.
- ఈ నది అబోర్ కొండలు, మిష్మి కొండల మధ్యగా ప్రవహిస్తూ, ఫసిఘాట్ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.
- భారతదేశంలో దీని పరీవాహక ప్రాంతం 2,40,000 చ.కి.మీ.
- దిహాంగ్ నది అసోం లోయలోకి ప్రవేశించే తరుణంలో దిబాంగ్, లోహిత అనే నదులు కలిసి బ్రహ్మపుత్రగా ఏర్పడతాయి.
- టిబెట్లోని లోడ్సేత్సాంగ్ వద్ద జల ప్రయాణానికి అనువుగా ఉండే వెడల్పైన నదిగా మారి 640 కి.మీ. ప్రవహిస్తుంది.
మజూలీ దీవి: బ్రహ్మపుత్ర నది అసోంలో రెండు శాఖలుగా విడిపోయి 90 కి.మీ. తర్వాత మళ్లీ కలిసే ప్రాంతం పేరు జోర్హాట్. ఈ రెండు శాఖల మధ్యనున్న ప్రాంతాన్ని మజూలీ దీవి అంటారు.
- మజూలీ దీవి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత దీవి. ఇక్కడ నివసించే తెగ మిషింగ్ తెగ.
- మజూలీ దీవి పొడవు 90 కి.మీ., వెడల్పు 20 కి.మీ., వైశాల్యం 1250 చ.కి.మీ.
- బ్రహ్మపుత్ర నది అసోం రాష్ట్రంలోని ఎర్రనేలలో ప్రవహిస్తూ మియాండర్స్, ఆక్స్బౌ సరస్సులను ఏర్పరుస్తుంది.
- జమున పేరుతో పిలిచే బ్రహ్మపుత్ర, పద్మ పేరుతో పిలిచే గంగా నదులు బంగ్లాదేశ్లోని ‘గులందో’ వద్ద ఒకటిగా కలుస్తాయి.
- జమున, పద్మ నదుల కలయికతో మేఘన నది ఏర్పడుతుంది.
- ఈ నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం దాకిన్ షాహాద్పూర్.
జాంగ్ ము డ్యాం: భారత్, భూటాన్ సరిహద్దులో బ్రహ్మపుత్ర నదిపై చైనా దీన్ని నిర్మించింది. ఇండియా ఈ డ్యామ్ను వ్యతిరేకిస్తోంది.
ఉపనదులు: దిబాంగ్, లోహిత, దిహాంగ్, ధన్సిరి, కోపిలి, బాక్ ఎడమవైపు నుంచి కలుస్తాయి. సుబన్సిరి, కామెంగ్, మానస్, సంకోష్, తీస్తా కుడివైపు నుంచి కలుస్తాయి.
- హిమాలయాల్లో పుట్టి ప్రవహించే నదుల్లో పొడవైంది బ్రహ్మపుత్ర.
- బ్రహ్మపుత్ర ఉపనదుల్లో అతి పొడవైంది బరాక్నది (902 కి.మీ.)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
-
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతి
-
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
-
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
-
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
-
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం