ICAI CA Results 225: సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్.. టాపర్లు వీరే!

ఇంటర్నెట్ డెస్క్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్. మే నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు, మెరిట్ లిస్ట్లను ICAI ఆదివారం విడుదల చేసింది. విద్యార్థులు https://icai.nic.in/ వెబ్సైట్లో తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ తదితర వివరాలను ఎంటర్ చేయడం ద్వారా స్కోరు కార్డులతో పాటు మెరిట్ జాబితాలను పొందొచ్చు.
ఉత్తీర్ణత శాతం.. టాపర్ల వివరాలివే..
- సీఏ ఫౌండేషన్ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 551 కేంద్రాల్లో 82,662 మంది హాజరయ్యారు. వీరిలో కేవలం 12,472 మంది (15.09శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో వ్రిందా అగర్వాల్ (గజియాబాద్) జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకుతో సత్తా చాటగా.. యద్నేష్ రాజేశ్ నర్కర్ (ముంబయి), శార్దుల్ శేఖర్ విచారే (ఠానే) రెండు, మూడు ర్యాంకుల్లో మెరిశారు.
 - సీఏ ఇంటర్లో గ్రూప్- 1 పరీక్షలకు 97,034మంది హాజరు కాగా.. కేవలం 14,232 మంది మాత్రమే (14.67శాతం) పాస్ అయ్యారు. గ్రూప్-2లో 72,069మంది హాజరు కాగా.. 15,502 మంది (21.51శాతం) మంది; రెండు గ్రూపులనూ 38,029మంది రాయగా, 5,028మంది (13.22శాతం) మంది మాత్రమే పాస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. సీఏ ఇంటర్ పరీక్షల్లో దిశ ఆశీష్ (ముంబయి) తొలి ర్యాంకుతో సత్తా చాటగా.. దేవిదాన్ యశ్ సందీప్ (ఔరంగాబాద్) రెండో ర్యాంకు; యామిష్ జైన్ (జైపుర్), నిలయ్ డంగీ (ఉదయ్పుర్) మూడో ర్యాంకులో నిలిచారు.
 - సీఏ ఫైనల్లో గ్రూప్ 1 పరీక్షలకు 66,943 మంది హాజరు కాగా.. కేవలం 14,979 మంది (22.38%) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. గ్రూప్ 2 పరీక్షల్లో 46,173 మంది హాజరవ్వగా.. కేవలం 12,204మంది (26.43%) మంది మాత్రమే పాసయ్యారు. రెండు గ్రూపుల్లో 29,286మంది పరీక్షలు రాయగా.. 5,490 మంది (18.75శాతం) మాత్రమే పాసయ్యారు. సీఏ ఫైనల్ పరీక్షల్లో రాజన్ కబ్రా(ముంబయి) జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకుతో సత్తా చాటగా.. నిషిత బోత్రా (కోల్కతా), మానవ్ రాకేశ్ షా (ముంబయి) మూడో ర్యాంకులో నిలిచి సత్తా చాటారు.
 
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


