Nara Lokesh: బెంగళూరు ప్యాలెస్‌లో సేదతీరుతూ జగన్‌ ఫేక్‌ ప్రచారాలు: మంత్రి నారా లోకేశ్‌

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 29 Oct 2025 12:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: విపత్తుల సమయంలో మానవత్వం ఉన్న ఎవరైనా ప్రజలకు సాయం చేస్తారని.. వైకాపా అధ్యక్షుడు జగన్‌ మాత్రం ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చేస్తూ విష రాజకీయాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఆగ్రహం వ్యక్తంచేశారు. బెంగళూరు ప్యాలెస్‌లో సేదతీరుతూ దొంగ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు లోకేశ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.   

‘‘కాకినాడ జిల్లా కొత్తపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లోని పునరావాస కేంద్రంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడ ఉన్నవారికి ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకున్నాం. వదంతులు నమ్మొద్దు.. ఇది ప్రజల ప్రభుత్వం. అత్యవసర సాయానికి టోల్‌ఫ్రీ నంబర్‌ 18004250101 ఏర్పాటు చేశాం’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని