Andhra news: నిద్రిస్తున్న బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడికి దేహశుద్ధి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరుసగా అత్యాచార ఘటనలు, మహిళలపై వేధింపులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో మద్యం మత్తులో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలోని...

Updated : 03 May 2022 22:06 IST

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరుసగా అత్యాచార ఘటనలు, మహిళలపై వేధింపులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో మద్యం మత్తులో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి నిద్రిస్తున్న బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించే క్రమంలో బాలిక కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, చుట్టు పక్కల వారు చేరుకొని నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. నాగరాజుకు దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే బాలిక తల్లిదండ్రులు ఇవాళ సాయంత్రం ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని