bill payments: బిల్లుల గోస!
బిల్లులు... బకాయిలు... పెండింగు... నిధుల కొరత... రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో వివిధ పనులు చేస్తున్న వారిని కొన్ని నెలలుగా వెంటాడుతున్న మాటలివి. సకాలంలో డబ్బులు చేతికందక బాధితులు అప్పుల పాలవుతున్నారు. వాటిలో మచ్చుకు మూడింటిని పరిశీలిస్తే.... కరోనా సమయంలోనూ అధికారుల ఒత్తిడితో ‘నవరత్నాలు... పేదలందరికీ ఇళ్ల’ను నిర్మించుకుంటున్న
ఇల్లు కట్టుకుంటున్నా బిల్లు ఇవ్వరేం!
* గృహ నిర్మాణ బకాయిలు రూ.500 కోట్లు
* 5.90 లక్షల నరేగా పనిదినాల బిల్లూ పెండింగే
అప్పులతో వడ్డింపు
* మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులకు వెతలు
* రాష్ట్రవ్యాప్తంగా రూ.55 కోట్ల బకాయిలు
పాత బకాయిల ఊసేలేదు
* ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు చుట్టూ చీకట్లు
* పంచాయతీలకు పూర్తిగా బాధ్యత అప్పగించే యత్నం
బిల్లులు... బకాయిలు... పెండింగు... నిధుల కొరత... రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో వివిధ పనులు చేస్తున్న వారిని కొన్ని నెలలుగా వెంటాడుతున్న మాటలివి. సకాలంలో డబ్బులు చేతికందక బాధితులు అప్పుల పాలవుతున్నారు. వాటిలో మచ్చుకు మూడింటిని పరిశీలిస్తే.... కరోనా సమయంలోనూ అధికారుల ఒత్తిడితో ‘నవరత్నాలు... పేదలందరికీ ఇళ్ల’ను నిర్మించుకుంటున్న వారికి రూ.500 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. చేతిలో డబ్బు లేకపోవడంతో ఆపై పనులు చేపట్టేందుకు లబ్ధిదారులు ససేమిరా అంటున్నారు. ఈ పథకంలో భాగంగా ఉపాధి హామీ పథకం(నరేగా) కింద చెల్లించాల్సిన రూ.14 కోట్లూ విడుదలవడంలేదు. తక్కువ విద్యుత్తు వినియోగంతో గ్రామాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన ఎల్ఈడీ వీధి దీపాల పథకానిదీ అదే దారి. పథకాన్ని నిర్వహిస్తున్న ఇంధన సంస్థలకు ప్రభుత్వం రూ.28 కోట్లకుపైగా బకాయి పడింది. చెల్లింపుల్లో తీవ్ర జాప్యంపై మొరపెట్టుకుంటున్నా సరైన స్పందన లేదని బాధితులు వాపోతున్నారు. ఇక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట చేస్తున్న
మహిళలకూ బకాయిల బెడద తప్పడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా 41.60 లక్షల మంది విద్యార్థులకు వండిపెడుతున్న ఏజెన్సీల బాధ్యులకు రూ.55 కోట్ల వరకు రావాల్సి ఉంది. పిల్లలకు భోజనం ఆపకూడదనే ఉద్దేశంతో మహిళలు ప్రైవేటుగా వడ్డీలకు అప్పులు తెస్తూ పథకాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం.
ఇల్లు కట్టుకుంటున్నా బిల్లు ఇవ్వరేం!
ఈనాడు డిజిటల్, అమరావతి: లబ్ధిదారులు తక్షణమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ఒత్తిడి చేస్తున్న ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో మాత్రం జాప్యం చేస్తోంది. కరోనా కష్టకాలంలోనూ అధికారుల సూచన మేరకు అప్పోసప్పో చేసి పనులు ప్రారంభిస్తున్న పేదలు... సకాలంలో డబ్బుల రాక ఇబ్బందులు పడుతున్నారు. మొదటి విడతగా చేపట్టిన ఇళ్లన్నీ సెప్టెంబరు నెలాఖరుకు బేస్మెంట్ స్థాయికి చేరే గడువు నిర్దేశించిన ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని చేరిన వాటికి బకాయిలు చెల్లించడంలో ఆలస్యం చేస్తోంది.
బేస్మెంట్ స్థాయి దాటినవి 1.70 లక్షలు
పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో మొదటి విడతగా చేపట్టిన 15.60 లక్షల ఇళ్ల నిర్మాణంలో 1.70 లక్షల గృహాల నిర్మాణాలు బేస్మెంట్, ఆపై స్థాయికి చేరాయి. వీటికిగాను ఇప్పటివరకు రూ.400 కోట్ల వరకు బిల్లులను చెల్లించగా.... ఇంకా దాదాపుగా రూ.500 కోట్ల మేర పెండింగ్ ఉన్నాయి. ప్రస్తుతం ఆగస్టు 15 వరకు ఉన్న బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత అప్లోడ్ చేసిన వాటికి చెల్లింపులు లేవు. రాష్ట్రంలో రోజుకు రూ.15-20 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి.
పునాది దశలోనే 8 లక్షల గృహాలు
జులైలో చేపట్టిన సామూహిక శంకుస్థాపనలో దాదాపు 10 లక్షల గృహాలకు భూమిపూజ చేయగా... వాటిలో ఇప్పటికీ 8 లక్షల గృహాలు పునాది స్థాయిలోనే ఉన్నాయి. చేతిలో డబ్బు లేక ఆపై పనులు చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందేమోనని ఎదురుచూస్తున్న వారూ ఉన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించి, బిల్లులందని వారు మాత్రం... తాము ఖర్చు చేసిన మొత్తం చేతికందితే తప్ప ఇక ముందుకెళ్లే పరిస్థితి లేదని క్షేత్రస్థాయిలో అధికారులకు తెగేసి చెబుతున్నారు.
ఉపాధి హామీ పనిదినాల డబ్బులకూ ఎదురుచూపులే
పట్టణాభివృద్ధి సంస్థల్లో చేపట్టే ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ రూ.1.50 లక్షలతోపాటు ఉపాధి హామీ పథకం(నరేగా) కింద రూ.30 వేలు వినియోగించుకోవచ్చు. ఈ మొత్తాన్ని నిర్మాణం పూర్తయ్యేలోపు నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయాలి. బేస్మెంట్ స్థాయికి 28 పనిదినాలు, ప్లింత్స్థాయికి 24, లింటెల్స్థాయికి 10, రూఫ్స్థాయికి 28 పనిదినాలకు కూలి ఇవ్వాలి. వీటి చెల్లింపు గడువు 15 రోజులకు మించకూడదు. ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9.21 లక్షల పనిదినాలు జరిగాయి. వీటిలో 3.30 లక్షల దినాలకు చెల్లింపులు జరిగాయి. ఇంకా 5.90 లక్షల పనిదినాల కూలి పెండింగ్లో ఉంది. ఒక పనిదినానికి రూ.245 చొప్పున మొత్తం రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంది.
బిల్లుల చెల్లింపు కేంద్ర పరిశీలనలోనే..
కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే పథకాలకు సంబంధించి చెల్లింపులను తప్పనిసరిగా పబ్లిక్ ఫైనాన్స్ మానిటరింగ్ సిస్టమ్(పీఎఫ్ఎమ్ఎస్)లో నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది. గృహనిర్మాణానికి ఇచ్చే రాయితీ దాదాపు కేంద్రమే భరిస్తున్న నేపథ్యంలో ప్రతి వ్యవహారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. సిమెంటు, ఇనుము సరఫరాకు గుత్తేదారులకు, లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) విధానంలో జరిగే చెల్లింపులను సవివరంగా పొందుపరుస్తున్నారు. ఈ వివరాలు నమోదు చేయని పక్షంలో కేంద్రం నుంచి రాయితీ విడుదల కాదు. అందుకే లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఆధార్ కార్డు వివరాలను పీఎఫ్ఎమ్ఎస్లో అప్లోడ్ చేశారు.
అప్పులతో వడ్డింపు
*అనంతపురం జిల్లా కల్లూరు జిల్లాపరిషత్తు పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీకి మార్చి, ఏప్రిల్లో వంట చేసిన బిల్లులు రూ.66,138 ఇంతవరకు విడుదల కాలేదు. ఇక్కడ పనిచేస్తున్న నలుగురు వర్కర్లకు రూ.48 వేల వరకు జీతం బకాయి ఉంది.
* నెల్లూరు గ్రామీణ మండలం కోడూరుపాడు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఏజెన్సీకి రూ.3లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. - విశాఖపట్నం జిలవరం ప్రాథమిక పాఠశాల మెయిన్, జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలల వంట ఏజెన్సీకి రూ.3లక్షల వరకు బిల్లు రావాల్సి ఉంది.
రాష్ట్రంలో పాఠశాలల మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు చాలామంది వంట నిర్వాహకులు కిరాణ దుకాణాలలో అప్పులు పెట్టి సరకులు తెస్తుండగా... మరికొందరు వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా గతేడాది నవంబరు 2నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు పాఠశాలలు కొనసాగాయి. ఈ సమయంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు వంట చేసి, పిల్లలకు వడ్డించాయి. ఆ తర్వాత కొవిడ్ రెండోవేవ్ రావడంతో పాఠశాలలు మూతపడ్డాయి. తాజాగా ఆగస్టు 16 నుంచి పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలలు కొనసాగిన సమయంలో వడ్డించిన భోజనాలకు చాలామందికి బిల్లులు విడుదల కాలేదు. రాష్ట్రంలో వంట ఏజెన్సీలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.80 కోట్ల వరకు ఉండగా... ఇటీవల రూ.25 కోట్లే విడుదల చేశారు. ఇంకా రూ.55 కోట్లు రావాల్సి ఉంది.
పెరిగిన ధరలతోనూ సమస్యలు
పప్పులు, వంటనూనెలు, గ్యాస్ ధరలు పెరిగాయి. విద్యార్థులు అధికంగా ఉన్నచోట ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రోజుకు రూ.4.97, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థికి రోజుకు రూ.7.45 చొప్పున చెల్లిస్తున్నారు. 1-8 తరగతుల వ్యయాన్ని కేంద్రం, 9, 10 తరగతుల వ్యయాన్ని రాష్ట్రం భరిస్తున్నాయి. వంట కార్మికులకు నెలకు రూ.3వేల చొప్పున చెల్లిస్తున్నారు. ఈ వేతనాలూ చాలా జిల్లాల్లో పెండింగ్లో ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి మాట్లాడుతూ... ‘బిల్లులు, వేతనాలను సకాలంలో చెల్లించకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వమే గ్యాస్ను ఉచితంగా అందించడంతోపాటు గౌరవవేతనాన్ని పెంచాలి. తమిళనాడులో మాదిరి సరకులన్నీ సరఫరా చేసి, వంట ఏజెన్సీలకు రూ.6-8వేలు వేతనాలు ఇవ్వాలి’ అని కోరారు.
ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు చుట్టూ చీకట్లు
గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాల కథ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుని పంచాయతీలకే మళ్లీ పూర్తిగా అప్పగించేందుకు అడుగులు పడుతున్నాయి. ఎల్ఈడీల నిర్వహణ సరిగా లేదంటూ ఇంధన సామర్ధ్య సేవల సంస్థ, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థలకు పంచాయతీరాజ్శాఖ తాజాగా తాఖీదులు జారీ చేసింది.
పాక్షికంగా మొదట బాధ్యతల తగ్గింపు
కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎల్ఈడీ ప్రాజెక్టుపై దృష్టి పెంచింది. ఒప్పందంపైనా ఒకటికి రెండు సార్లు సమీక్షించారు. ఎల్ఈడీల నిర్వహణ సరిగా లేదంటూ ఈ ఏడాది మార్చి 3న జీవో విడుదల చేసి, నిర్వహణ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. విడి భాగాలను సరఫరా చేసేందుకే ఈఈఎస్ఎల్, ఎన్ఆర్ఈడీసీని పరిమితం చేశారు. ప్రాజెక్టు నిర్వహణతో వచ్చే ఆదాయంలో నుంచి పంచాయతీలకు ఒక్కో ఎల్ఈడీ నిర్వహణకు నెలకు రూ.9.65 చొప్పున ఇంధన సంస్థలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.
పాత బకాయిల ఊసేలేదు
ఎల్ఈడీ దీపాల ప్రాజెక్టు నిర్వహిస్తున్న ఇంధన సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.28 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాలి. ఒప్పందం ప్రకారం ఈ మొత్తాలను గ్రామ పంచాయతీల నుంచి వసూలు చేసి ఇంధన సంస్థలకు ప్రతి మూడు నెలలకోసారి జమ చేసే బాధ్యత ప్రభుత్వానిది. ఈ చెల్లింపుల్లో జాప్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇంధన సంస్థలు పలుసార్లు పంచాయతీరాజ్శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటి ఊసెత్తకుండా ఎల్ఈడీలకు కంప్యూటరైజ్డ్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టం (సీసీఎంఎస్) బాక్సులు ఏర్పాటు చేయని కారణంగా వీధి దీపాలు పగులు, రాత్రి వెలుగుతున్నాయని, చాలాచోట్ల రాత్రుల్లో వెలగడం లేదంటూ ఇంధన సంస్థలకు పంచాయతీరాజ్శాఖ తాఖీదులు జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం సీఎం జగన్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడి అవసరాల కోసం రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
ఈసీ అనుమతి లేదు
ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఆ దేవతే లేకపోతే..
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు, అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రుకాల్చి వాతపెట్టిన సందర్భాలు అనేకం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి. -
బీరాలు పలికి.. బేరానికొచ్చి!
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా’పై జగన్ చెలరేగిపోయారు. కేంద్రంపై రంకెలు వేశారు. ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఊగిపోయారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి బంద్లు చేయించారు. -
ఆ‘పైవాడూ’ కాపాడలేడు!
..కానీ ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022’ దేవుళ్ల భూములకే ఎసరు పెట్టనుంది! వైకాపా సర్కారు రూపొందించిన అనాలోచిత చట్టంతో దేవాదాయ, వక్ఫ్, క్రైస్తవ మిషనరీలకు చెందిన భూములు ప్రమాదంలో పడుతున్నాయి. -
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
గతంలో ఏ ఎన్నికల్లోనూ కనిపించనంత కసి, ఉత్సాహం రాష్ట్ర ఓటర్లలో కనిపిస్తోంది. విదేశాలు, ఇతర నగరాల్లో ఉండే ఓటర్లు భారీ సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. -
‘భూ’చాళ్ల చట్టానికి బలయ్యేది బడుగులే
జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బారిన పడేవారిలో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. బడుగు బలహీనవర్గాలే. కొత్త చట్టంతో బలయ్యేది సెంటు, అరసెంటు స్థలాలు.. అరెకరా, ఎకరా భూమినే నమ్ముకున్నవారే. వారికి పలుకుబడి ఉండదు. -
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైకాపా ప్రభుత్వం రూపొందించిందని హైకోర్టు న్యాయవాది పదిరి రవితేజ విమర్శించారు. -
పన్నుల భారం రూ.1.38 లక్షల కోట్లు
‘అల్లమంటే నాకు తెలీదా! బెల్లంలా పుల్లగా ఉంటుంది’ అన్నాడంట వెనకటికొకడు! మంచి పాలన అంటే దౌర్జాన్యాలు, దోపీడీలు, అక్రమాలు, దమనకాండలు అనుకునే ముఖ్యమంత్రి జగన్ తీరు ఇప్పుడు అలానే ఉంది. -
భయాలను పెంచేలా.. ‘నోరు నొక్కేసేలా..!’
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై సీఎం జగన్, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలే రైతులు, వివిధ వర్గాల ప్రజల్లో భయాలను మరింత పెంచేలా ఉంటున్నాయి. -
విచారణ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయి
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ప్రకియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా వింటామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. -
ఈసీ తీరును నిరసిస్తున్నాం: బొత్స సత్యనారాయణ
కేంద్ర ఎన్నికల సంఘం తీరును వైకాపా నిరసిస్తోందని, ఆక్షేపిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో ఆర్యవైశ్యులకు అన్యాయం
జగన్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఎటువంటి న్యాయమూ జరగలేదని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
మేం వైకాపాకు మద్దతు ఇవ్వలేదు
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్... వైకాపాకు మద్దతు ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
తల్లితో కలిసి నేడు పిఠాపురానికి రామ్చరణ్
అగ్ర నటుడు చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. -
‘మూడు కోట్ల ఎకరాలకు’ బీమా ఎగ్గొట్టారు
పంట వేస్తే చాలు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని నమ్మిన రైతుల్ని జగన్ నిలువెల్లా మోసం చేశారు. -
ఆసుపత్రులు ఆగం.. తగ్గేదెలా రోగం?
పదే పదే ప్రచారం చేసి లేనిది ఉన్నట్లు నమ్మించే గోబెల్స్ ప్రచారంలో జగన్ ముందుంటారు. ఏమీ చేయకున్నా చేసినట్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట.