Andhra Pradesh post poll violence: విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం.
పల్నాడు జిల్లాలోని అధికార పార్టీ నేతల ఇళ్లలో పెట్రో బాంబులు, మారణాయుధాల గుర్తింపు
పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి
మాచవరం, దాచేపల్లి, న్యూస్టుడే: పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. తాజాగా పలువురు వైకాపా నాయకుల ఇళ్లలో పెట్రో బాంబులు, మారణాయుధాలు బయటపడటంతో భయాందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పల్నాడు వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎన్నికల రోజు, అనంతరం జరిగిన గొడవల నేపథ్యంలో పల్నాడు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం మాచవరం మండలంలోని సమస్యాత్మక గ్రామం పిన్నెల్లిలో సోదాలు చేయగా.. గ్రామానికి చెందిన వైకాపా నేత, మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు చింతపల్లి చిన మస్తాన్వలి అలియాస్ నన్నే, ఆ పార్టీ నాయకులు చింతపల్లి పెదసైదా, అల్లాభక్షు ఇళ్లల్లో 51 పెట్రో బాంబులు, వేట కొడవళ్లు, గొడ్డళ్లు దొరికాయి. అలాగే తెదేపా సానుభూతిపరులు చింతపల్లి జానీ బాషా, జానీ బాషా, తండా పెద్ద నన్నే ఇళ్లపైన బీరు సీసాలు, రాళ్లు గుర్తించారు.
పోలింగ్ అనంతరం గొడవలు
ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి గ్రామంలో గొడవలు జరుగుతాయని భావించి, కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినా.. మరుసటిరోజు నుంచి గ్రామం నివురుగప్పిన నిప్పులా మారింది. వైకాపా శ్రేణుల కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. తెదేపా శ్రేణులపై దాడులకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే పెట్రో బాంబులు నిల్వ చేసినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. వైకాపా దాడులను అడ్డుకునేందుకు తెదేపా శ్రేణులు సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎస్పీ బిందుమాధవ్ గురువారం దాచేపల్లిలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పెట్రో బాంబులు ఎవరు తయారు చేశారు.. ఎక్కడి నుంచి తెచ్చారో సమాచారం ఉందని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
మాదలలో 29 పెట్రో బాంబుల స్వాధీనం
ముప్పాళ్ల, న్యూస్టుడే: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలోని వైకాపా నాయకుడి ఇంట్లో పెట్రో బాంబులు పట్టుబడటం కలకలం రేపింది. గ్రామంలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా తెదేపా కార్యకర్తలు, మద్దతుదారులపై వైకాపా శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. పోలింగ్ ముగిసిన తర్వాత వైకాపా, తెదేపా శ్రేణులు పరస్పరం రాళ్లు, గాజు గ్లాసులు, సోడాబుడ్లు విసురుకున్నాయి. దీంతో మూడు రోజులుగా గ్రామంలో పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది. మళ్లీ గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో గురువారం సత్తెనపల్లి గ్రామీణ సీఐ రాంబాబు, ఏఆర్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ఈక్రమంలో గ్రామంలోని వైకాపా నాయకుడు షేక్ గుంటూరు సైదా ఇంట్లోని బాత్రూమ్లో 29 పెట్రో బాంబులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సైదా అందుబాటులో లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హజరతయ్య తెలిపారు.
ఎమ్మెల్యే పిన్నెల్లి ఇంటివద్ద రాళ్లు, ఖాళీ బీరు సీసాలు
మాచర్లగ్రామీణ, న్యూస్టుడే: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో పెద్దఎత్తున దాడులకు వైకాపా కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. భారీస్థాయిలో రాళ్లు, ఖాళీ బీరు సీసాలను సిద్ధం చేసుకోవడం ఇందుకు బలాన్నిస్తోంది. గురువారం మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి సమీపంలోని ఓ వాహనంలో రాళ్లు, ఖాళీ బీరు సీసాల బస్తాలను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కారంపూడిలో జరిగిన అల్లర్లలో సైతం ఇదే వాహనాన్ని తీసుకెళ్లి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. కారంపూడిలో విధ్వంసం సృష్టించినా పోలీసులు వైకాపా వర్గీయుల ఇళ్ల వద్ద తనిఖీలు చేయడం లేదు. వైకాపా శ్రేణులు పది కార్లలో కత్తులు, కర్రలు, రాడ్లు పోగేసుకుని తిరుగుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ఇంటివద్ద రాళ్లు, బీరు సీసాలు వెలుగు చూడటంతో ఎప్పుడు ఎలాంటి దాడులు జరుగుతాయో అన్న భయాందోళనలో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. దీనిపై పట్టణ సీఐ బ్రహ్మయ్యను వివరణ కోరగా ఓ చోట రాళ్లు బస్తాల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో వెళ్లి స్వాధీనం చేసుకున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ