Covid: కరోనానా? గుండె భద్రం
కరోనా వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు ఆ ప్రభావం గుండె కండరాలపై తీవ్రంగా కనిపిస్తుండడంతో పలువురు గుండెపోటుతో చనిపోతున్నారు... అందుకే కొవిడ్ సోకిన వారికి హృదయ సంబంధమైన పరీక్షలు, పర్యవేక్షణ చాలా ముఖ్యమని అంటున్నారు ప్రముఖ కార్డియాలజిస్టు, స్టార్ ఆస్పత్రి అధినేత డాక్టర్ మన్నం గోపీచంద్.
రక్తంలో ఆక్సిజన్ తగ్గితే గుండె కండరాలపై తీవ్ర ప్రభావం
సడన్ హార్ట్ఎటాక్లకు అదే కారణం
వైద్యులు సూచించిన పరీక్షలు తప్పనిసరి
వ్యాధి తగ్గినా వైద్యుల పర్యవేక్షణ అవసరం
‘ఈనాడు’తో ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ మన్నం గోపీచంద్
ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
కరోనా వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు ఆ ప్రభావం గుండె కండరాలపై తీవ్రంగా కనిపిస్తుండడంతో పలువురు గుండెపోటుతో చనిపోతున్నారు... అందుకే కొవిడ్ సోకిన వారికి హృదయ సంబంధమైన పరీక్షలు, పర్యవేక్షణ చాలా ముఖ్యమని అంటున్నారు ప్రముఖ కార్డియాలజిస్టు, స్టార్ ఆస్పత్రి అధినేత డాక్టర్ మన్నం గోపీచంద్. ముఖ్యంగా ఇప్పటికే గుండె ఆపరేషన్లు, ఇతరత్రా వ్యాధులకు చికిత్స పొందుతున్న రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేని పక్షంలో నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కరోనా వైరస్ ఊపిరితిత్తుల తర్వాత తీవ్ర ప్రభావం చూపించేది గుండెపైనే అని విశ్లేషిస్తున్నారాయన. డాక్టర్ గోపిచంద్ ఈనాడుకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో అనేక విషయాలను వెల్లడించారు. వివరాలు ఇవీ..
* కొవిడ్ రోగుల్లో చాలా మంది వైరస్ తగ్గిన తరువాత కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది?
సాధారణంగా కొవిడ్ వ్యాధిగ్రస్తులు కొంతమందిలో ఊపిరితిత్తులు సక్రమంగా పని చేయకపోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఆ ప్రభావం గుండె పనితీరుపై తీవ్రంగా పడుతోంది. కడరాల్లోని కణజాలం దెబ్బతిన్న పరిస్థితుల్లో గుండె పనితీరు మందగిస్తోంది. శరీరానికి రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. ఈ సమయంలో వైద్యపరంగా జాగ్రత్తలు తీసుకోకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కొవిడ్ వ్యాధిగ్రస్తుల్లో ఆక్సిజన్ శాతం తగ్గడం మొదలైన వెంటనే గుండెకు సంబంధించి వైద్యుల పర్యవేక్షణ కూడా అత్యవసరమని గుర్తుంచుకోవాలి. వ్యాధి తీవ్రంగా ఉన్న సమయంలో గుండె పనితీరులో మార్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్నాళ్లు దీని ప్రభావం ఉంటుంది. అందువల్ల వ్యాధి తగ్గిన తరువాతా సంబంధిత రోగులు వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి.
*ఈ ముప్పు తప్పించుకోవాలంటే కొవిడ్ వచ్చిన వారు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి?
రక్తంలో డీ డైమర్, సీరం ఫెరిటన్, సీఆర్పీ పెరిగితే రక్తం గడ్డకడుతుంది. దీనివల్ల రక్త నాళాల్లో గడ్డలు ఏర్పడి బ్లాక్లు తయారవుతాయి. ఇది హఠాత్తుగా గుండె పోటుకు కారణమవుతుంది. కరోనా తీవ్రమవుతున్న దశలో ఉన్నవారు ఈ పరీక్షలు చేయించుకోవాలి. వీటిలో తేడా ఉంటే వెంటనే వైద్యుల పర్యవేక్షణలో ఉండి, మందులు వాడాలి. అవసరమైతే రక్తం పలుచన చేసే ఔషధాలు వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
*ఇప్పటికే గుండె జబ్బులున్నవారు కరోనా వైరస్ బారినపడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
స్టెంట్ వేయించుకున్నవారు, బైపాస్ సర్జరీ చేయించుకున్న వారు ఇతరత్రా గుండె సమస్యలున్నవారిలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. వీరికి ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. కరోనా లక్షణాలున్నాయని ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లాలి. పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా లక్షణాలున్నవారు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
*కరోనా రోగులు వైద్యులను సంప్రదించకుండానే స్టిరాయిడ్స్ వాడేస్తున్నారు. దీనివల్ల గుండెకు కలిగే ముప్పు ఎలా ఉంటుంది?
ఇటువంటి సొంత వైద్యాలు చివరికి ప్రాణాల మీదకు తెస్తాయి. పల్మనాలజిస్టు సూచనల మేరకే స్టిరాయిడ్స్ వాడాలి. ఇష్టానుసారం వాడితే అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. తోచినట్లు స్టిరాయిడ్స్ వాడడం వల్ల వ్యాధినిరోధక శక్తి తగ్గి భవిష్యత్తులో బ్లాక్ ఫంగస్ బారినపడే ప్రమాదముంది.
*హోం ఐసొలేషన్లో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఐసొలేషన్లో ఉన్న ప్రతి రోగి తప్పనిసరిగా శ్వాస సంబంధ ఎక్సర్సైజు చేయాలి. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయులు కొంతవరకు నిలకడగా ఉండే అవకాశం ఉంది. వైద్యుల సూచించిన మందులతోపాటు పోషకాహారం తీసుకోవాలి. దీనికితోడు రోగి ఉన్న గదిని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేటట్లు చూసుకోవాలి. వీటన్నింటితో పాటు రోగికి సానుకూల దృక్పథం చాలా ముఖ్యం. ఆక్సిజన్ స్థాయిని నిరంతరం పరీక్షిస్తూ ఉండాలి. చాలామంది చేతిని చాపి పల్స్ ఆక్సీమీటర్తో పరీక్షిస్తున్నారు. పడక, లేదా పరుపు మీద చేతిని ఆనించి వేలికి ఆక్సీమీటర్ పెడితే ఆక్సిజన్ శాతం ఎంతుందో కచ్చితంగా తెలుస్తుంది. ఆక్సిజన్ స్థాయి 95 శాతం కంటే తగ్గుతుంటే సంబంధిత రోగులు ఆస్పత్రిలో చేరడమే మంచిది.
* వ్యాధి నుంచి కోలుకున్న తరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
స్టిరాయిడ్స్ వాడడం వల్ల శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం అధికంగా పడుతోంది. ఆ మందులు వాడిన రోగుల్లో రక్తపోటు హఠాత్తుగా పెరిగిపోతోంది. రక్తంలో ఫెరిటిన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. కొందరిలో మరికొన్ని దుష్ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి. కరోనా నెగెటివ్ వచ్చిందన్న ఉద్దేశంతో వ్యాధిగ్రస్తులు అంతకుముందు వాడిన మందులను ఒక్కసారిగా ఆపేయకూడదు. క్రమానుగుణంగా, వైద్యులు సూచించినట్లు మందులను వాడాలి. కరోనా తీవ్రంగా వచ్చిన వారు ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉండడం చాలా ముఖ్యం. వ్యాధి నుంచి బయటపడిన చాలామంది బలహీనంగా మారుతున్నారు. వారు బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలి. కొవిడ్ తగ్గిందని ఇష్టానుసారంగా తిరిగితే కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం సీఎం జగన్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడి అవసరాల కోసం రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
ఈసీ అనుమతి లేదు
ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఆ దేవతే లేకపోతే..
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు, అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రుకాల్చి వాతపెట్టిన సందర్భాలు అనేకం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి. -
బీరాలు పలికి.. బేరానికొచ్చి!
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా’పై జగన్ చెలరేగిపోయారు. కేంద్రంపై రంకెలు వేశారు. ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఊగిపోయారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి బంద్లు చేయించారు. -
ఆ‘పైవాడూ’ కాపాడలేడు!
..కానీ ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022’ దేవుళ్ల భూములకే ఎసరు పెట్టనుంది! వైకాపా సర్కారు రూపొందించిన అనాలోచిత చట్టంతో దేవాదాయ, వక్ఫ్, క్రైస్తవ మిషనరీలకు చెందిన భూములు ప్రమాదంలో పడుతున్నాయి. -
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
గతంలో ఏ ఎన్నికల్లోనూ కనిపించనంత కసి, ఉత్సాహం రాష్ట్ర ఓటర్లలో కనిపిస్తోంది. విదేశాలు, ఇతర నగరాల్లో ఉండే ఓటర్లు భారీ సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. -
‘భూ’చాళ్ల చట్టానికి బలయ్యేది బడుగులే
జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బారిన పడేవారిలో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. బడుగు బలహీనవర్గాలే. కొత్త చట్టంతో బలయ్యేది సెంటు, అరసెంటు స్థలాలు.. అరెకరా, ఎకరా భూమినే నమ్ముకున్నవారే. వారికి పలుకుబడి ఉండదు. -
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైకాపా ప్రభుత్వం రూపొందించిందని హైకోర్టు న్యాయవాది పదిరి రవితేజ విమర్శించారు. -
పన్నుల భారం రూ.1.38 లక్షల కోట్లు
‘అల్లమంటే నాకు తెలీదా! బెల్లంలా పుల్లగా ఉంటుంది’ అన్నాడంట వెనకటికొకడు! మంచి పాలన అంటే దౌర్జాన్యాలు, దోపీడీలు, అక్రమాలు, దమనకాండలు అనుకునే ముఖ్యమంత్రి జగన్ తీరు ఇప్పుడు అలానే ఉంది. -
భయాలను పెంచేలా.. ‘నోరు నొక్కేసేలా..!’
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై సీఎం జగన్, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలే రైతులు, వివిధ వర్గాల ప్రజల్లో భయాలను మరింత పెంచేలా ఉంటున్నాయి. -
విచారణ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయి
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ప్రకియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా వింటామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. -
ఈసీ తీరును నిరసిస్తున్నాం: బొత్స సత్యనారాయణ
కేంద్ర ఎన్నికల సంఘం తీరును వైకాపా నిరసిస్తోందని, ఆక్షేపిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో ఆర్యవైశ్యులకు అన్యాయం
జగన్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఎటువంటి న్యాయమూ జరగలేదని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
మేం వైకాపాకు మద్దతు ఇవ్వలేదు
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్... వైకాపాకు మద్దతు ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
తల్లితో కలిసి నేడు పిఠాపురానికి రామ్చరణ్
అగ్ర నటుడు చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. -
‘మూడు కోట్ల ఎకరాలకు’ బీమా ఎగ్గొట్టారు
పంట వేస్తే చాలు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని నమ్మిన రైతుల్ని జగన్ నిలువెల్లా మోసం చేశారు. -
ఆసుపత్రులు ఆగం.. తగ్గేదెలా రోగం?
పదే పదే ప్రచారం చేసి లేనిది ఉన్నట్లు నమ్మించే గోబెల్స్ ప్రచారంలో జగన్ ముందుంటారు. ఏమీ చేయకున్నా చేసినట్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట.