సంక్షిప్త వార్తలు(3)
నెల్లూరు నగరంలో మూడు రోజులుగా జరిగిన ఐద్వా రాష్ట్ర మహాసభల్లో భాగంగా సోమవారం స్థానిక జెట్టిశేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఐద్వా రాష్ట్ర కమిటీని ఎంపిక చేశారు. నూతన రాష్ట్ర అధ్యక్షురాలిగా బి.ప్రభావతి, కోశాధికారిగా సావిత్రి, తదితర 50 మందితో ఈ కమిటీ ఎంపికైంది.
ఐద్వా రాష్ట్ర కమిటీ ఎంపిక
నెల్లూరు (విద్య), న్యూస్టుడే: నెల్లూరు నగరంలో మూడు రోజులుగా జరిగిన ఐద్వా రాష్ట్ర మహాసభల్లో భాగంగా సోమవారం స్థానిక జెట్టిశేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఐద్వా రాష్ట్ర కమిటీని ఎంపిక చేశారు. నూతన రాష్ట్ర అధ్యక్షురాలిగా బి.ప్రభావతి, కోశాధికారిగా సావిత్రి, తదితర 50 మందితో ఈ కమిటీ ఎంపికైంది. ఈ సందర్భంగా ఆ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధవాలె మాట్లాడుతూ మహిళా సమస్యలపై చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎంపికైన రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ మహిళా హక్కుల పరిరక్షణ, బాలికల విద్యకు విఘాతం కలిగించే నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని కోరారు. జిల్లా కార్యదర్శి మస్తాన్బీ, తదితర నాయకులు పాల్గొన్నారు.
జర్మన్ వర్సిటీతో ఉన్నత విద్యామండలి ఒప్పందం
ఈనాడు, అమరావతి: జర్మనీలోని స్టెయిన్బీస్ విశ్వవిద్యాలయంలో ఏపీ విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల తరఫున ఉన్నత విద్యామండలి ఈ ఒప్పందం చేసింది. కంప్యూటర్ సైన్సులో మాస్టర్ ఆఫ్ సైన్సెస్ను స్టెయిన్బీస్ అందిస్తుంది. విద్యార్థులను ఎంపిక చేసేందుకు జర్మనీ వర్సిటీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రాక్టికల్ లెర్నింగ్ కోసం ఈ కోర్సు ఉపయోగపడుతుందని వెల్లడించారు. స్టెయిన్బీస్ వర్సిటీ డైరెక్టర్ బెట్రామ్ లోహ్ముల్లర్ మాట్లాడుతూ.. బాష్ లాంటి కంపెనీలకు రాబోయే ఐదేళ్లల్లో ఐదు లక్షల మంది వరకు ఇంజినీర్లు అవసరమవుతారని తెలిపారు. హైడ్రోజన్ టెక్నాలజీపై జర్మనీ దృష్టిసారించిందని, దీనికి భవిష్యత్తులో 10వేల మంది వరకు ఇంజినీరింగ్ నిపుణులు అవసరమవుతారని, విద్యార్థులు పని చేస్తూ నేర్చుకోవచ్చని సూచించారు.
24 రెవెన్యూ డివిజన్లకు 456 పోస్టుల మంజూరు
ఈనాడు, అమరావతి: కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు తగ్గట్లుగా 456 పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది. 24 రెవెన్యూ డివిజన్ల అవసరాలకు 19 చొప్పున పోస్టులను కేటాయించింది. ఆర్డీఓ, డీఏఓ (తహసీల్దార్ కేడర్), మూడు తహసీల్దార్ (కేఆర్సీసీ), ఇతర పోస్టులు ఉన్నాయి. వీటి మంజూరుతో పాటు రెవెన్యూ శాఖలో అవసరంలేని 655 పోస్టులను శాంక్షన్డ్ జాబితా నుంచి తొలగించారు. వీటిలో 400 టైపిస్టు, వంద డ్రైవర్ల పోస్టులు వంటివి ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం సీఎం జగన్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడి అవసరాల కోసం రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
ఈసీ అనుమతి లేదు
ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఆ దేవతే లేకపోతే..
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు, అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రుకాల్చి వాతపెట్టిన సందర్భాలు అనేకం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి. -
బీరాలు పలికి.. బేరానికొచ్చి!
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా’పై జగన్ చెలరేగిపోయారు. కేంద్రంపై రంకెలు వేశారు. ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఊగిపోయారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి బంద్లు చేయించారు. -
ఆ‘పైవాడూ’ కాపాడలేడు!
..కానీ ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022’ దేవుళ్ల భూములకే ఎసరు పెట్టనుంది! వైకాపా సర్కారు రూపొందించిన అనాలోచిత చట్టంతో దేవాదాయ, వక్ఫ్, క్రైస్తవ మిషనరీలకు చెందిన భూములు ప్రమాదంలో పడుతున్నాయి. -
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
గతంలో ఏ ఎన్నికల్లోనూ కనిపించనంత కసి, ఉత్సాహం రాష్ట్ర ఓటర్లలో కనిపిస్తోంది. విదేశాలు, ఇతర నగరాల్లో ఉండే ఓటర్లు భారీ సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. -
‘భూ’చాళ్ల చట్టానికి బలయ్యేది బడుగులే
జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బారిన పడేవారిలో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. బడుగు బలహీనవర్గాలే. కొత్త చట్టంతో బలయ్యేది సెంటు, అరసెంటు స్థలాలు.. అరెకరా, ఎకరా భూమినే నమ్ముకున్నవారే. వారికి పలుకుబడి ఉండదు. -
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైకాపా ప్రభుత్వం రూపొందించిందని హైకోర్టు న్యాయవాది పదిరి రవితేజ విమర్శించారు. -
పన్నుల భారం రూ.1.38 లక్షల కోట్లు
‘అల్లమంటే నాకు తెలీదా! బెల్లంలా పుల్లగా ఉంటుంది’ అన్నాడంట వెనకటికొకడు! మంచి పాలన అంటే దౌర్జాన్యాలు, దోపీడీలు, అక్రమాలు, దమనకాండలు అనుకునే ముఖ్యమంత్రి జగన్ తీరు ఇప్పుడు అలానే ఉంది. -
భయాలను పెంచేలా.. ‘నోరు నొక్కేసేలా..!’
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై సీఎం జగన్, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలే రైతులు, వివిధ వర్గాల ప్రజల్లో భయాలను మరింత పెంచేలా ఉంటున్నాయి. -
విచారణ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయి
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ప్రకియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా వింటామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. -
ఈసీ తీరును నిరసిస్తున్నాం: బొత్స సత్యనారాయణ
కేంద్ర ఎన్నికల సంఘం తీరును వైకాపా నిరసిస్తోందని, ఆక్షేపిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో ఆర్యవైశ్యులకు అన్యాయం
జగన్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఎటువంటి న్యాయమూ జరగలేదని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
మేం వైకాపాకు మద్దతు ఇవ్వలేదు
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్... వైకాపాకు మద్దతు ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
తల్లితో కలిసి నేడు పిఠాపురానికి రామ్చరణ్
అగ్ర నటుడు చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. -
‘మూడు కోట్ల ఎకరాలకు’ బీమా ఎగ్గొట్టారు
పంట వేస్తే చాలు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని నమ్మిన రైతుల్ని జగన్ నిలువెల్లా మోసం చేశారు. -
ఆసుపత్రులు ఆగం.. తగ్గేదెలా రోగం?
పదే పదే ప్రచారం చేసి లేనిది ఉన్నట్లు నమ్మించే గోబెల్స్ ప్రచారంలో జగన్ ముందుంటారు. ఏమీ చేయకున్నా చేసినట్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం