అయిదేళ్ల జాప్యం.. రూ.273 కోట్ల మూల్యం
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం పెట్రోలియం యూనివర్సిటీ శాశ్వత ప్రాంగణ నిర్మాణంలో అయిదేళ్లు జాప్యం జరగడంతో నిర్మాణ వ్యయం రూ.273 కోట్లు పెరిగినట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం గురువారం సభకు వెల్లడించింది.
భారీగా పెరిగిన విశాఖ పెట్రోలియం యూనివర్సిటీ నిర్మాణ వ్యయం
పార్లమెంటరీ స్థాయీసంఘం వెల్లడి
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం పెట్రోలియం యూనివర్సిటీ శాశ్వత ప్రాంగణ నిర్మాణంలో అయిదేళ్లు జాప్యం జరగడంతో నిర్మాణ వ్యయం రూ.273 కోట్లు పెరిగినట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం గురువారం సభకు వెల్లడించింది. ఈ ప్రాజెక్టు తొలి దశ 2017-18 నాటికి, రెండో దశ 2020-21 నాటికి పూర్తి కావాల్సి ఉందని పేర్కొంది. న్యాయపరమైన సమస్యలు, భూమి అప్పగింతలో జాప్యంతో తొలి దశ గడువు 2024-25 నాటికి, రెండో దశ గడువును 2026-27 నాటికి సవరించినట్లు నివేదికలో తెలిపింది. దీనివల్ల నిర్మాణ అంచనాలు రూ.655.47 కోట్ల నుంచి రూ.928.66 కోట్లకు పెరిగినట్లు చెప్పింది. ‘ఈ సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రధాన భవనం రెండో అంతస్తులో తాత్కాలికంగా నడుస్తోంది. శాశ్వత ప్రాంగణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో సబ్బవరం మండలం వంగలి గ్రామంలో సర్వే నంబర్ 135, 241ల్లో ఉన్న 201.80 ఎకరాల భూమిని అప్పగించింది. ఇందులో 157.36 ఎకరాల టైటిల్ను 2022 జనవరిలో పెట్రో యూనివర్సిటీ పేరు మీద చేసి ఇచ్చింది. ఇప్పటికీ 22.96 ఎకరాల మ్యుటేషన్ పెండింగ్లో ఉంది. రైతులు కోర్టులో కేసులు వేయడంతో మరో 21.48 ఎకరాల మ్యుటేషన్ పెండింగ్లో పడింది. ఈ భూమి చుట్టూ ప్రహరీ నిర్మిస్తుండగా రైతులు అడ్డుపడటంతో 2022 ఫిబ్రవరిలో ఈ సంస్థ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. కేసును విచారించిన హైకోర్టు అర్హులైన రైతులకు చెల్లించాల్సిన సహాయ, పునరావాస ప్యాకేజీ గురించి 45 రోజుల్లోపు పరిశీలన జరిపి ఆ మొత్తాన్ని తమ వద్ద డిపాజిట్ చేయాలని, దానివల్ల నిర్మాణ పనులకు ఎవరూ అడ్డుతగలకుండా ఉంటుందని చెప్పింది. ‘రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన మిగిలిన మొత్తం డిపాజిట్ చేసిన తర్వాతే నిర్మాణ పనులు కొనసాగించాలి’ అన్న వాక్యాన్ని మధ్యంతర ఉత్తర్వుల నుంచి తొలగించాలంటూ పెట్రో యూనివర్సిటీ 2022లో హైకోర్టులో మరో కేసు దాఖలు చేసింది. దాని వల్ల రాష్ట్ర ప్రభుత్వం పరిహారం మొత్తం డిపాజిట్ చేయక ముందే నిర్మాణ పనులు కొనసాగించడానికి వీలవుతుందని పేర్కొంది. దీంతో ఈ సంస్థకు కేటాయించిన 201.80 ఎకరాల్లో చేపట్టే ఏ నిర్మాణానికీ అడ్డంకులు కల్పించకూడదంటూ హైకోర్టు డిసెంబర్ 15న మరో ఉత్తర్వు జారీ చేసింది. అడ్డంకులు సృష్టించేవారిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీఐఐసీ ఆ భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణం ప్రారంభించింది. ప్రాంగణానికి సంబంధించిన ప్రాథమిక డ్రాయింగ్స్ను ఖరారు చేసి, సీపీడబ్ల్యూడీకి అప్పగించింది. జీఎస్టీ, ద్రవ్యోల్బణం కారణంగానే ప్రాజెక్టు వ్యయం రూ.273 కోట్ల మేర పెరిగింది. 2022-23 బడ్జెట్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.150 కోట్లు కేటాయించినప్పటికీ నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడం వల్ల సవరించిన అంచనాల్లో దాన్ని రూ.100 కోట్లకు తగ్గించారు. 2023-24లో పనులు వేగం పుంజుకొనే అవకాశం ఉన్నందున బడ్జెట్ను రూ.168 కోట్లకు పెంచారు’ అని స్థాయీ సంఘం నివేదికలో వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ‘పైవాడూ’ కాపాడలేడు!
..కానీ ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022’ దేవుళ్ల భూములకే ఎసరు పెట్టనుంది! వైకాపా సర్కారు రూపొందించిన అనాలోచిత చట్టంతో దేవాదాయ, వక్ఫ్, క్రైస్తవ మిషనరీలకు చెందిన భూములు ప్రమాదంలో పడుతున్నాయి. -
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
గతంలో ఏ ఎన్నికల్లోనూ కనిపించనంత కసి, ఉత్సాహం రాష్ట్ర ఓటర్లలో కనిపిస్తోంది. విదేశాలు, ఇతర నగరాల్లో ఉండే ఓటర్లు భారీ సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. -
‘భూ’చాళ్ల చట్టానికి బలయ్యేది బడుగులే
జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బారిన పడేవారిలో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. బడుగు బలహీనవర్గాలే. కొత్త చట్టంతో బలయ్యేది సెంటు, అరసెంటు స్థలాలు.. అరెకరా, ఎకరా భూమినే నమ్ముకున్నవారే. వారికి పలుకుబడి ఉండదు. -
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైకాపా ప్రభుత్వం రూపొందించిందని హైకోర్టు న్యాయవాది పదిరి రవితేజ విమర్శించారు. -
పన్నుల భారం రూ.1.38 లక్షల కోట్లు
‘అల్లమంటే నాకు తెలీదా! బెల్లంలా పుల్లగా ఉంటుంది’ అన్నాడంట వెనకటికొకడు! మంచి పాలన అంటే దౌర్జాన్యాలు, దోపీడీలు, అక్రమాలు, దమనకాండలు అనుకునే ముఖ్యమంత్రి జగన్ తీరు ఇప్పుడు అలానే ఉంది. -
భయాలను పెంచేలా.. ‘నోరు నొక్కేసేలా..!’
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై సీఎం జగన్, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలే రైతులు, వివిధ వర్గాల ప్రజల్లో భయాలను మరింత పెంచేలా ఉంటున్నాయి. -
విచారణ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయి
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ప్రకియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా వింటామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. -
ఈసీ తీరును నిరసిస్తున్నాం: బొత్స సత్యనారాయణ
కేంద్ర ఎన్నికల సంఘం తీరును వైకాపా నిరసిస్తోందని, ఆక్షేపిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో ఆర్యవైశ్యులకు అన్యాయం
జగన్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఎటువంటి న్యాయమూ జరగలేదని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
మేం వైకాపాకు మద్దతు ఇవ్వలేదు
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్... వైకాపాకు మద్దతు ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
తల్లితో కలిసి నేడు పిఠాపురానికి రామ్చరణ్
అగ్ర నటుడు చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. -
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం సీఎం జగన్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడి అవసరాల కోసం రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. -
‘మూడు కోట్ల ఎకరాలకు’ బీమా ఎగ్గొట్టారు
పంట వేస్తే చాలు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని నమ్మిన రైతుల్ని జగన్ నిలువెల్లా మోసం చేశారు. -
ఆసుపత్రులు ఆగం.. తగ్గేదెలా రోగం?
పదే పదే ప్రచారం చేసి లేనిది ఉన్నట్లు నమ్మించే గోబెల్స్ ప్రచారంలో జగన్ ముందుంటారు. ఏమీ చేయకున్నా చేసినట్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట. -
చివరి రోజు సభకూ చెట్లు కొట్టారు
ఎన్నికల ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా శనివారంతో ముగియనుంది. -
విద్యుత్ ఛార్జీల భారం కావాలా.. ఇంటింటా వెలుగులు కావాలా?
తెదేపా హయాంలో ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీల భారం పడింది. మేము అధికారంలోకి వచ్చాక ఆ భారాన్ని తగ్గిస్తాం’ అంటూ మైకు పట్టుకుని కొడుతూ డబ్ డబ్ (గుండె చప్పుడును తలపించేలా శబ్దం).. చెప్పిన వ్యక్తి గుర్తుకు వచ్చారా? రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో సామాన్య విద్యుత్ వినియోగదారుడిపై శ్లాబ్ వారీగా గరిష్ఠంగా 40శాతం ఛార్జీలు పెరిగాయి. దీంతో పేదలే కాదు.. ధనికులూ విద్యుత్ వాడాలంటే భయపడే పరిస్థితిని కల్పించారు. -
అరాచకపాలనలో అందరూ బాధితులే..!
అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో వేధింపులు.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే ఇళ్లపై అర్ధరాత్రి బందిపోటుల్లా దాడులు.. వైకాపా రాజ్యాంగం అమలు చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి జైల్లో పడేయడం.. ఈ ఐదేళ్లల్లో జగన్ సాగించిన దమనకాండను ‘టీం స్వేచ్ఛ’ కళ్లకు కట్టినట్లు గణాంకాలతో వెల్లడించింది. -
ఏసీఏలో కోట్ల రూపాయల దుర్వినియోగం
‘ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ).. క్రీడాకారుల జీవితాలను నాశనం చేస్తోంది. కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తోంది. -
వివేకా కుమార్తె సునీత, అల్లుడు, సీబీఐ ఎస్పీ వ్యాజ్యాల కొట్టివేత
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్