Gaddar: మూగబోయిన ప్రజాఉద్యమ గొంతుక
బండెనక బండి కట్టి.. ఏ బండ్లె వస్తవ్ కొడుకో నైజాము సర్కరోడా అంటూ దాష్టీకాలను ఎదిరించిన గళం... నిండు అమాస నాడు ఓ లచ్చగుమ్మడీ.. ఆడ బిడ్డా పుట్టినాదో... అత్తా తొంగి చూడలేదంటూ లింగ వివక్షను కడిగేసిన కలం..
అనారోగ్యంతో చికిత్స పొందుతూ గద్దర్ అస్తమయం
నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలు
బండెనక బండి కట్టి.. ఏ బండ్లె వస్తవ్ కొడుకో నైజాము సర్కరోడా అంటూ దాష్టీకాలను ఎదిరించిన గళం... నిండు అమాస నాడు ఓ లచ్చగుమ్మడీ.. ఆడ బిడ్డా పుట్టినాదో... అత్తా తొంగి చూడలేదంటూ లింగ వివక్షను కడిగేసిన కలం... పాటనై వస్తున్నానమ్మో అంటూ మాటలనే పాటలుగా మలిచి ప్రజా ఉద్యమాలను పేర్చిన దృఢస్వరం... సిరిమల్లెచెట్టు కిందా లచ్చుమమ్మో... లచ్చుమమ్మా అంటూ అమ్మకు గుండెల్లో గుడి కట్టిన పదం... నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా అంటూ రక్తసంబంధాన్ని రంగరించిన గొంతుక... పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు పతాకమై నిలిచిన గీతిక... జనం గుండెల్లో నిత్యం నాట్యమాడే పాటమ్మను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. బుర్రకథ విఠల్, తెలంగాణ ఉద్యమానికి వన్నెలద్దిన గద్దర్... అరుణ వర్ణంలో ఒదిగిపోయారు.
ఈనాడు, హైదరాబాద్-న్యూస్టుడే, అమీర్పేట: ఉద్యమ గళం మూగబోయింది. తన పాటతో.. ఆటతో చైతన్యం నింపిన ప్రజాయుద్ధ నౌక నింగికేగింది. ప్రజాగాయకుడు గద్దర్(76) తీవ్ర అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అమీర్పేట అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అల్వాల్లోని ఇంటివద్ద జులై 20న గద్దర్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అమీర్పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేర్పించారు. నాటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. గుండెలో సమస్య ఉండటంతో ఈ నెల 3న వైద్యులు ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో హుషారుగా పాటలు కూడా పాడిన ఆయన... త్వరగా కోలుకుని తిరిగి వస్తానని కుటుంబ సభ్యులతో శనివారం రాత్రి కూడా మాట్లాడారు. అనూహ్యంగా ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆదివారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించింది. చాన్నాళ్లుగా రక్తపోటు, మధుమేహంతో బాధపడుతుండటం, వృద్ధాప్య సమస్యలు చుట్టుముట్టడంతో కోలుకోలేకపోయారు. అత్యవసర వైద్యం అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. ‘‘ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు వస్తారని భావించాం... కోలుకున్నట్లే కన్పించి ఆరోగ్యం విషమించడంతో మృతిచెందారు. చివరి క్షణాల్లోనూ గద్దర్ పాటను వదల్లేదు’’ అని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఐసీయూలో చేర్చినప్పుడు కూడా పాటలు పాడారని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్ను ఇటీవల జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రత్యేకంగా కలిశారు. ఆ సమయంలో ఆయన కొంత ఆరోగ్యంగా, చలాకీగా కనిపించారు. ఇంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. నిన్ననే కలిశానని.. మంచిగనే ఉన్నానని చెప్పారని, ఇంతలోనే సీరియస్ అయిందని గద్దర్ భార్య విమల భోరున విలపించారు. కోలుకుని ఇంటికి తిరిగి వస్తాడనుకుంటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
పుట్టినూరు తూప్రాన్
గద్దర్ 1947 ఆగస్టు 4న మెదక్ జిల్లా తూప్రాన్లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్రావ్. నిజామాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్లలో ప్రాథమిక, ఉన్నత, ఇంజినీరింగ్ విద్య పూర్తి చేశారు. 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. తర్వాత ఆ ఉద్యోగం వదులుకున్నారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు పిల్లలు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. రెండో కుమారుడు చంద్రుడు 2003లో అనారోగ్యంతో మృతి చెందారు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ కూడా ఒకరు. ఎన్నో ప్రజా ఉద్యమాలను ఆయన ముందుండి నడిపించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన తన ఆట, పాటతో ప్రజలను ఉత్తేజపరిచారు. పలు సినిమాల్లో పాటలు రాయడంతో పాటు నటించి మెప్పించారు. పీపుల్స్వార్ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో నకిలీ ఎన్కౌంటర్లను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో 1997 ఏప్రిల్ 6న గద్దర్పై హత్యాయత్నం జరిగింది. ఆ రోజు తగిలిన తూటా ఇంకా ఆయన శరీరంలోనే ఉంది. గద్దర్ మృతి వార్తను తెలుసుకొని అమీర్పేట ఆసుపత్రి వద్దకు ఆయన అభిమానులు, రాజకీయ నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున చేరుకున్నారు. గద్దర్ అమర్రహే అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, మధుయాసీˆ్కగౌడ్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సీతక్క, విమలక్క, అద్దంకి దయాకర్, మల్లురవి, నారదాసు లక్ష్మణ్రావు, తెదేపా నేత కాట్రగడ్డ ప్రసూన, భాజపా నేత శ్యాంసుందర్, మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తదితరులు ఆసుపత్రికి వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియానికి తరలించారు. అక్కడికి ప్రజలు, అభిమానులు, రాజకీయ నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం సోమవారం మధ్యాహ్నం వరకు పార్థివదేహాన్ని ఇక్కడే ఉంచనున్నారు.
నేడు అంత్యక్రియలు
గద్దర్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవితాంతం సమాజానికి ఆయన చేసిన త్యాగాలకు, ప్రజాసేవకు సూచికగా ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, సంబంధిత చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారిని ఆదేశించారు. ఈమేరకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఎల్బీ స్టేడియం నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్లోని భూదేవినగర్లోని గద్దర్ నివాసం వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ మీదుగా అంతిమయాత్ర సాగనుంది. ఇంటి వద్ద ప్రజల కోసం కొద్దిసేపు పార్థివదేహాన్ని ఉంచనున్నారు.అల్వాల్లోనే గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు చేయనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
అది ఉద్యమాన్ని శివాలెత్తించిన పాట
గద్దర్ రాసిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా...’ పాట తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే పాటల్లో ఒకటి. ఉద్యమం ఉవ్వెత్తున ఎదిగేందుకు దోహదం చేసింది. తెలంగాణ ప్రకటించి, వెనక్కి తీసుకున్న తర్వాత ఉద్యమం ఎగిసిపడుతున్న తరుణంలో ‘జైబోలో తెలంగాణ’ సినిమా నిర్మాణం చేపట్టా. దానికోసం ఒక పాట రాయాలని కోరగా రెండు గంటల్లోనే ట్యూన్ కట్టారు. ఆ పాటను పాడేందుకు గద్దర్ స్టుడియోకు వచ్చిన రోజు ఆయన తీవ్ర జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. అయినా నేను, సంగీత దర్శకుడు చక్రి పాడేందుకు ఒప్పించాం. పాటనూ ఆయనపైనే చిత్రీకరించాం. పాట రాసినందుకు, నటించినందుకు పారితోషికం ఇస్తానని చెబితే.. ‘ఇదంతా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం... దానికి డబ్బులిస్తావా?’ అని తిరస్కరించారు. మేము ఊహించినట్లే పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాట చరిత్ర సృష్టించింది.
ఎన్.శంకర్, సినీ దర్శకులు
ప్రముఖుల సంతాపాలు
గద్దర్ పార్థివదేహానికి ఆయన అభిమానులు, బంధువులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు ఘన నివాళి అర్పించారు. ప్రజల సందర్శనార్థం గద్దర్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉంచారు. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తదితరులు అంబులెన్స్లో గద్దర్ భౌతికకాయాన్ని స్టేడియానికి తీసుకొచ్చారు. రాత్రి 9గంటల సమయంలో మంత్రి కేటీఆర్ గద్దర్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. సోమవారం ఉదయం 10:30కు స్టేడియం నుంచి అంతిమయాత్ర మొదలవుతుందని ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు.
తెలంగాణ ప్రజలకు తీరనిలోటు
గద్దర్ మృతి తెలంగాణ ప్రజలకు తీరని లోటు. తెలంగాణ గొప్ప కవిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
గవర్నర్ తమిళిసై
కళలు వర్ధిల్లినంతకాలం ఆయన పేరు అజరామరం
తెలుగు పాటకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన వాగ్గేయకారుడు గద్దర్. రాష్ట్ర సాధనకు తన పాట ద్వారా పల్లెపల్లెలో భావజాలాన్ని వ్యాప్తిచేసి ప్రజాయుద్ధనౌకగా ప్రజల హృదయాల్లో నిలిచారు. తెలంగాణ కోసం ఆయన చేసిన సాంస్కృతిక పోరాటం, ఆయనతో అనుబంధాన్ని ఎప్పటికీ మరవలేను. కళలు వర్ధిల్లినంతకాలం గద్దర్ పేరు అజరామరంగా నిలిచి ఉంటుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్
తెలుగుజాతి సెల్యూట్
ప్రజాకవి గద్దర్ పాటలు ఎప్పటికీ సమాజానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెలుగుజాతి ఆయనకు సెల్యూట్ చేస్తోంది. గద్దర్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
జగన్మోహన్రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి
ఎన్నో అంశాలను పంచుకున్నాం
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో గద్దర్తో వేదికను పంచుకునే అవకాశం నాకు లభించింది. రాష్ట్ర సాధనకు ఎన్నో అంశాలను పరస్పరం పంచుకున్నాం. గద్దర్ మృతి రాష్ట్రానికి తీరనిలోటు.
కిషన్రెడ్డి, కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
గద్దర్ అలుపెరగని పోరాటం మనందరికీ స్ఫూర్తి
తెలంగాణ ప్రజలపై ప్రేమతో గద్దర్ చేసిన అలుపెరగని పోరాటం మనందరికీ స్ఫూర్తి. (గత నెల 2న ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన గద్దర్ను ఆలింగనం చేసుకున్న ఫొటోను ఈ సందర్భంగా ట్విటర్లో రాహుల్, ప్రియాంకగాంధీలు పోస్ట్ చేశారు.)
రాహుల్గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసింది
తన పాటలతో ప్రజాచైతన్యానికి ఎనలేని కృషి చేసిన ‘ప్రజా యుద్ధనౌక’ గద్దర్ మృతితో పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసినట్లయింది.
చంద్రబాబునాయుడు, తెదేపా అధినేత
అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా; పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. అంటూ తెలంగాణ ఉద్యమంలో తన గళంతో కోట్ల మందిని గద్దర్ ఉత్తేజపరిచారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
రాష్ట్ర మంత్రి హరీశ్రావు
దశాబ్దాలుగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న గద్దర్ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరనిలోటు. గద్దర్ మృతికి సంతాప సూచకంగా కాంగ్రెస్ శ్రేణులు అన్ని మండలాల్లో గద్దర్ చిత్ర పటాలు పెట్టి నివాళులు అర్పించాలి.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత భట్టి
గద్దర్ చివరి వరకు పీడితప్రజలపక్షాన నిలిచారు. ఆయన పాట కలకాలం ఉంటుంది. అన్యాయం, దోపిడీ జరిగినంత కాలం దానిని ఎదిరిస్తూనే ఉంటుంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాంస్కృతిక సంస్థల ఐకాస ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలపై ప్రదర్శనలిచ్చాం. ఇటీవల నిమ్స్కు వెళ్లి పరామర్శించగా.. మమ్మల్ని చూసి తనమీద ఒక పాటరాయమని అడిగారు. ఎన్కౌంటర్లలో ఎందరో చనిపోతే.. వారి మృతదేహాలను తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.జ
విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య
గద్దర్ నన్నెంతో ప్రభావితం చేశారు. పార్టీ పెట్టడానికి కూడా ఆయనే స్ఫూర్తి. తెలుగుజాతి ఉన్నంత వరకు గద్దర్ సజీవంగా ఉంటారు. చివరిసారిగా ఆయణ్ని కలిశా. రాజకీయం పద్మవ్యూహమని, లోపలికి రావడమే కాదు.. బయట ఎలా నెగ్గుకురావాలో చెప్పిన గొప్ప మేధావి గద్దర్.
జనసేన అధినేత పవన్ కల్యాణ్
గద్దర్ మృతి తీరనిలోటు పలువురు ప్రముఖుల నివాళి
ఈనాడు, హైదరాబాద్: గద్దర్ మృతికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఉప ఛైర్మన్ బండా ప్రకాశ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం తెలిపారు. తెలంగాణపై ఆయన పాడిన పాటలు ఉద్యమకారులను ఎంతో ఉత్సాహపరిచాయని, ఆయన మృతి నమ్మలేకపోతున్నానని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు చెప్పారు. కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, మధుయాస్కీ, మహేశ్కుమార్గౌడ్, మల్లు రవి, అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే సీతక్క సంతాపం తెలిపారు.
- గద్దర్ మృతి పట్ల సినీనటుడు నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్రెడ్డి, కంభంపాటి రామ్మోహన్రావు, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన సంతాపం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపరన్న అభిప్రాయాన్ని ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తప్పని నిరూపించారు. -
నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం సందర్శించనున్నారు. -
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. -
అసలేం జరుగుతోంది?.. ఏఎన్యూ స్ట్రాంగ్రూం సమీపంలో నిఘా వర్గాల సమావేశం
పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్రూంల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. తిరుపతిలో స్ట్రాంగ్రూంను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే అధికారి అయిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. -
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
సుప్రీం చెప్పినా.. మేమెందుకు వింటాం!
‘‘ప్రతివాది సమర్పించిన ఫొటోల్లో తేదీలు, సమయం, అక్షాంశాలు, రేఖాంశాలు చూస్తే.. యంత్రాలతో ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించినప్పటికీ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయనేది ప్రాథమికంగా తెలుస్తోంది. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
జెన్కో థర్మల్ కేంద్రాలకు ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ బొగ్గు
పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) నుంచి హైగ్రేడ్ బొగ్గును జెన్కో తీసుకుంటోంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుకు ప్రత్యామ్నాయంగా కృష్ణపట్నం థర్మల్ యూనిట్లో వినియోగించనుంది. -
పర్యాటక సేవలు మరింత ఖరీదు!
పర్యాటకుల కోసం కొత్తగా అనేక అదనపు సౌకర్యాలు కల్పించి ఆకట్టుకోవాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. -
రాష్ట్ర పునర్విభజన అంశాలపై నివేదికలు రూపొందించండి
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. -
అసలైన ప్రజాసేవకుడు కాటన్
నాటి బ్రిటిష్ ప్రభుత్వం సహకరించకపోయినా.. పట్టుబట్టి గోదావరి డెల్టాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు అనువుగా ధవళేశ్వరం ఆనకట్ట, కాలువలు నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. -
పోలీసు వలయంలో పల్నాడు
రెండురోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న పల్నాడు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. -
ఆ నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక బలగాలు
పోలింగ్ తర్వాత హింస చెలరేగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
పోలింగ్ తర్వాత.. నిప్పు రాజేస్తోందెవరు?
పోలింగ్ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండను నియంత్రించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
సంక్షిప్త వార్తలు (8)
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ వెబ్ అప్లికేషన్ సామర్థ్యం పెంచడానికి ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) షెడ్యూల్ ప్రకటించిందని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
117 నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే పోస్టల్ బ్యాలట్లతో కలిపి 2.09% పెరిగింది. మొత్తం 3.33 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయింది. -
15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
రాష్ట్రంలో 15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఒంగోలు లోక్సభ పరిధిలో 87.06% మంది ఓటర్లు కదం తొక్కారు. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
-
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
-
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
-
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?