West Godavari: గణతంత్ర వేడుకల్లో జగన్‌ భజన

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొందరు అధికారులు అత్యుత్సాహం చూపి గణతంత్ర వేడుకల్లోనూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భజనకు ప్రాధాన్యమిచ్చారు.

Updated : 27 Jan 2024 06:52 IST

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొందరు అధికారులు అత్యుత్సాహం చూపి గణతంత్ర వేడుకల్లోనూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భజనకు ప్రాధాన్యమిచ్చారు. భీమవరంలోని కలెక్టరేట్‌ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో విద్యార్థుల బృందం సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చింది. జగన్‌ను పొగుడుతూ రూపొందించిన పాటకు అనుగుణంగా ఆ బృందంతో వివిధ విన్యాసాలు చేయించారు. జగన్‌ చిత్రం ఉన్న మాస్కు ధరించిన ఓ విద్యార్థి జాతీయ జెండా పట్టుకుని మిగిలిన వారికి దారి చూపుతున్నట్లుగా అభినయించాడు.

న్యూస్‌టుడే, భీమవరం అర్బన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు