ఏంట్రా నువ్వు చెప్పేది.. పదరా స్టేషన్కు..
‘ఏయ్ ఏంట్రా నువ్వు చెప్పేది.. పదరా స్టేషన్కు’ అంటూ పోలీసులు రైతును మెడ పట్టుకుని నెట్టివేసి.. కొట్టారు. ఆ అవమాన భారాన్ని భరించలేక ఆ అన్నదాత పోలీస్ స్టేషన్కు సమీపంలోనే గురువారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
చిత్తూరు జిల్లాలో రైతుపై చేయి చేసుకున్న పోలీసులు
అవమాన భారంతో బలవన్మరణానికి పాల్పడ్డ అన్నదాత
వెదురుకుప్పం, న్యూస్టుడే: ‘ఏయ్ ఏంట్రా నువ్వు చెప్పేది.. పదరా స్టేషన్కు’ అంటూ పోలీసులు రైతును మెడ పట్టుకుని నెట్టివేసి.. కొట్టారు. ఆ అవమాన భారాన్ని భరించలేక ఆ అన్నదాత పోలీస్ స్టేషన్కు సమీపంలోనే గురువారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతి చెందారు. రైతు భార్య సంపూర్ణమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మర్రిమాకుల కండ్రిగకు చెందిన చెంగయ్య, పాపమ్మలకు ముగ్గురు సంతానం. రెండో కుమారుడు చనిపోగా పెద్ద కుమారుడు దేశయ్య, చిన్న కుమారుడు చంద్రశేఖర్(56)కు భూమి పంపకాల విషయంలో విభేదాలున్నాయి. దేశయ్య తన భార్య శారద పేరుతో భూమిని రెవెన్యూ దస్త్రాల్లో నమోదు చేయించారు. తనకూ వాటా ఉందని చంద్రశేఖర్, ఆయన భార్య సంపూర్ణమ్మ చెబుతూ వస్తున్నారు. ఈక్రమంలోనే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తమకు కోర్టు స్టే ఇచ్చిందని పేర్కొంటూ శారద గురువారం ఉదయం ముళ్లకంప తొలగింపు పనులు చేపట్టారు. చంద్రశేఖర్, సంపూర్ణమ్మ నిలువరించే ప్రయత్నం చేయగా, శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుళ్లు ఆశీర్వాదం, వేలు వచ్చి వెదురుకుప్పం పోలీస్ స్టేషన్కు రావాలని చంద్రశేఖర్ను హెచ్చరించారు. సివిల్ వివాదంలో మీరెందుకు జోక్యం చేసుకుంటారు.. మేం మాట్లాడుకుంటామని ఆయన బదులివ్వగా.. ఏయ్ ఏంట్రా నువ్వు చెప్పేది.. పదరా స్టేషన్కు అంటూ దుర్భాషలాడారు. చొక్కా పట్టుకుని నెట్టడంతోపాటు గొంతు పట్టుకొని తోసేశారు. సంపూర్ణమ్మ అడ్డుకోవాలని చూసినా పోలీసులు లెక్క చేయలేదు. కానిస్టేబుళ్లు ఆయన్ను ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని స్టేషన్కు తీసుకెళ్లారు.
ఊళ్లో అడుగు పెట్టలేనని కుమార్తెకు చెప్పి..
మధ్యాహ్నం వరకు ఠాణాలో కూర్చోపెట్టగా ఆకలిగా ఉందని చంద్రశేఖర్ బయటకు వెళ్లి, తిరుపతి గ్రామీణ మండలం కేసీపేటలో ఉంటున్న కుమార్తెకు ఫోన్ చేశారు. తనను పోలీసులు అవమానించారని, ఇక ఊళ్లో అడుగు పెట్టలేనని.. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ విషయాన్ని అల్లుడు అత్త సంపూర్ణమ్మకు చెప్పడంతో ఆమె స్టేషన్తో పాటు చుట్టుపక్కల గాలించారు. ఠాణాకు సమీపంలోని భారతంమిట్ట వద్ద అపస్మారక స్థితిలో కనిపించారు. పచ్చికాపల్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం తిరుపతికి తరలిస్తుండగా, మధ్యలోనే ఆయన మరణించారు. దీంతో సంపూర్ణమ్మ, బంధువులు చంద్రశేఖర్ మృతదేహంతో స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు ఆశీర్వాదం, వేలు కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని ఆమె ఆరోపించారు.
తన భర్తను శవంగా మార్చిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అమ్ముడు పోయారని ధ్వజమెత్తారు. నగరి డీఎస్పీ కేఎన్ మూర్తి, శిక్షణ డీఎస్పీ ప్రవీణ్కుమార్, సీఐ సత్యబాబు ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రాత్రి వరకు మృతుడి కుటుంబీకులు స్టేషన్ ఎదుటే బైఠాయించారు. ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు డీఎస్పీ కేఎన్ మూర్తి విచారణ చేపట్టారు. ఎస్సై వెంకటేశ్వర్లు విధి నిర్వహణలో విఫలమయ్యారని పేర్కొంటూ నివేదిక ఇవ్వడంతో ఆయన్ను వీఆర్కు పంపారు. సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం సీఎం జగన్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడి అవసరాల కోసం రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
ఈసీ అనుమతి లేదు
ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఆ దేవతే లేకపోతే..
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు, అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రుకాల్చి వాతపెట్టిన సందర్భాలు అనేకం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి. -
బీరాలు పలికి.. బేరానికొచ్చి!
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా’పై జగన్ చెలరేగిపోయారు. కేంద్రంపై రంకెలు వేశారు. ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఊగిపోయారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి బంద్లు చేయించారు. -
ఆ‘పైవాడూ’ కాపాడలేడు!
..కానీ ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022’ దేవుళ్ల భూములకే ఎసరు పెట్టనుంది! వైకాపా సర్కారు రూపొందించిన అనాలోచిత చట్టంతో దేవాదాయ, వక్ఫ్, క్రైస్తవ మిషనరీలకు చెందిన భూములు ప్రమాదంలో పడుతున్నాయి. -
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
గతంలో ఏ ఎన్నికల్లోనూ కనిపించనంత కసి, ఉత్సాహం రాష్ట్ర ఓటర్లలో కనిపిస్తోంది. విదేశాలు, ఇతర నగరాల్లో ఉండే ఓటర్లు భారీ సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. -
‘భూ’చాళ్ల చట్టానికి బలయ్యేది బడుగులే
జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బారిన పడేవారిలో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. బడుగు బలహీనవర్గాలే. కొత్త చట్టంతో బలయ్యేది సెంటు, అరసెంటు స్థలాలు.. అరెకరా, ఎకరా భూమినే నమ్ముకున్నవారే. వారికి పలుకుబడి ఉండదు. -
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైకాపా ప్రభుత్వం రూపొందించిందని హైకోర్టు న్యాయవాది పదిరి రవితేజ విమర్శించారు. -
పన్నుల భారం రూ.1.38 లక్షల కోట్లు
‘అల్లమంటే నాకు తెలీదా! బెల్లంలా పుల్లగా ఉంటుంది’ అన్నాడంట వెనకటికొకడు! మంచి పాలన అంటే దౌర్జాన్యాలు, దోపీడీలు, అక్రమాలు, దమనకాండలు అనుకునే ముఖ్యమంత్రి జగన్ తీరు ఇప్పుడు అలానే ఉంది. -
భయాలను పెంచేలా.. ‘నోరు నొక్కేసేలా..!’
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై సీఎం జగన్, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలే రైతులు, వివిధ వర్గాల ప్రజల్లో భయాలను మరింత పెంచేలా ఉంటున్నాయి. -
విచారణ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయి
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ప్రకియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా వింటామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. -
ఈసీ తీరును నిరసిస్తున్నాం: బొత్స సత్యనారాయణ
కేంద్ర ఎన్నికల సంఘం తీరును వైకాపా నిరసిస్తోందని, ఆక్షేపిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో ఆర్యవైశ్యులకు అన్యాయం
జగన్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఎటువంటి న్యాయమూ జరగలేదని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
మేం వైకాపాకు మద్దతు ఇవ్వలేదు: ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్... వైకాపాకు మద్దతు ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
తల్లితో కలిసి నేడు పిఠాపురానికి రామ్చరణ్
అగ్ర నటుడు చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. -
‘మూడు కోట్ల ఎకరాలకు’ బీమా ఎగ్గొట్టారు
పంట వేస్తే చాలు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని నమ్మిన రైతుల్ని జగన్ నిలువెల్లా మోసం చేశారు. -
ఆసుపత్రులు ఆగం.. తగ్గేదెలా రోగం?
పదే పదే ప్రచారం చేసి లేనిది ఉన్నట్లు నమ్మించే గోబెల్స్ ప్రచారంలో జగన్ ముందుంటారు. ఏమీ చేయకున్నా చేసినట్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట.