నాలుగేళ్లుగా మోత.. వెళ్లిపోతూ వాత!
నగరాలు, పట్టణాల్లో 2020-21 వరకు అమలులో ఉన్న అద్దె ఆధారిత ఆస్తిపన్ను విధానాన్ని రద్దు చేసిన జగన్ ప్రభుత్వం... 2021-22 నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానాన్ని తీసుకొచ్చింది.
తాజాగా 15% ఆస్తిపన్ను పెంపుతో కొత్త బిల్లులు సిద్ధం
ఐదేళ్లలో జగన్ అదనంగా పిండుకున్నది రూ.995 కోట్లు
2020-21లో మొత్తం పన్ను రూ.1,157.54 కోట్లు
2024-25కి రూ.2,109.88 కోట్లకు పెరిగిన వైనం
ఈనా డు-అమరావతి
నాడు... ఇదేం పాలన అన్నారు... పౌరులపై పన్నుల భారమంటూ మొసలి కన్నీరు కార్చారు! తనను గెలిపిస్తే చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తానన్నారు.. గెలిచాక ప్రజల చర్మాన్నే ఒలిపించి... పన్నులు కట్టించుకుంటున్నారు! ఆస్తి పన్నులో మరీ బీభత్సం... నాలుగేళ్లుగా మోత మోగించిన జగన్... దిగిపోయే సమయంలోనూ... అయిదో ఏడాదికి 15% పెంపుతో బిల్లులు సిద్ధం చేయించారు!
నగరాలు, పట్టణాల్లో 2020-21 వరకు అమలులో ఉన్న అద్దె ఆధారిత ఆస్తిపన్ను విధానాన్ని రద్దు చేసిన జగన్ ప్రభుత్వం... 2021-22 నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానాన్ని తీసుకొచ్చింది. ఫలితంగా ఆస్తిపన్ను విపరీతంగా పెరిగింది. ఆ మొత్తాన్ని ఒకేసారి విధిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో దాన్ని... చేరుకునేంత వరకు ఏటా 15% చొప్పున భారం మోపడం మొదలు పెట్టింది.
- విశాఖపట్నం సీతమ్మధారలోని ఒక అపార్ట్మెంట్లో 900 చ.అడుగుల ఫ్లాట్ కలిగిన ఒక సాధారణ వ్యక్తి 2020-21లో చెల్లించిన ఆస్తిపన్ను రూ.3,834. జగన్ ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశపెట్టాక 2021-22లో ఆ ఫ్లాట్కి పన్ను రూ.4,410కి పెరిగింది. 2022-23లో అది రూ.5,072కి చేరింది. 2023-24లో రూ.5,534కి చేరింది. 2024-25లో ఆ ఫ్లాట్ యజమాని రూ.6,364 చెల్లించాలి. అంటే నాలుగేళ్లలో ఆస్తిపన్ను 65.99% పెరిగింది. ఇంతకంటే బాదుడు ఇంకేముంటుంది?
- గుంటూరులోని పాత పట్టాభిపురానికి చెందిన పేద కుటుంబం పాత విధానంలో తమ ఇంటికి ఏడాదికి రూ.780 పన్ను చెల్లించేది. కొత్త విధానంతో 2021-22లో పన్ను రూ.990కి పెరిగింది. 2022-23లో రూ.1,032, 2023-24లో రూ.1,186 చెల్లించాల్సి వచ్చింది. 2024-25లో అది రూ.1,363.9కి చేరుతుంది. అంటే నాలుగేళ్లలో ఆ కుటుంబంపై పన్నుభారం 74.86% పెరిగిందన్నమాట.
- విజయవాడ గవర్నర్పేటలోని ఓ మూడంతస్తుల వాణిజ్య భవనం యజమాని పాత విధానంలో ఏడాదికి రూ.55,608 పన్ను చెల్లించేవారు. కొత్త విధానం వచ్చాక 2021-22లో ఆస్తిపన్ను రూ.63,950కి పెరిగింది. 2022-23లో రూ.69,836, 2023-24లో రూ.78,190 చెల్లించారు. 2024-25లో అది రూ.89,918.5కి చేరుతుంది. ఆ భవన యజమాని చెల్లించాల్సిన పన్ను నాలుగేళ్లలో 61.70% పెరిగింది.
ధరలు పెంచేసి.. పన్నులతో బాదేసి.. జనం రక్తం పీల్చేయడమే ఎజెండాగా ఐదేళ్లపాటు పాలించిన జగన్ ప్రభుత్వం మరోసారి ఆస్తిపన్ను పెంపుతో పట్టణాల్లోని ప్రజలకు వాతలు పెట్టేందుకు సిద్ధమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను మరో 15% పెంచేసి ప్రజల నడ్డి విరవబోతోంది. పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను పెంపుతో నాలుగేళ్లలో ప్రజలపై రూ.952 కోట్లకుపైగా అదనపు భారం (2024-25తో కలిపి) మోపింది. జేబులు గుల్ల చేయడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆస్తి మూలధన విలువ ఆధారిత పన్ను విధానం ప్రజల్ని శాపంలా వెంటాడుతోంది. నగరాలు, పట్టణాల్లో 2020-21లో రూ.1157.54 కోట్లుగా ఉన్న ఆస్తిపన్ను డిమాండ్... 2023-24 నాటికి రూ.2109.88 కోట్లకు చేరింది. అంటే నాలుగేళ్లలో 82.27% పెరిగినట్టు. ఆస్తిపన్ను పెంపు ఇలా ఎడతెగని వ్యవహారంలా ఏటా సాగుతుంటే... ఇళ్లు, భవనాల యజమానులకే కాదు, అద్దెకున్న వారికీ ఇది భారంగానే పరిణమిస్తోంది. పెరిగిన పన్నుకు అనుగుణంగా యజమానులు అద్దెలనూ పెంచుతారు. తాజాగా 15% పెంపుతో 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను డిమాండ్ నోటీసుల్ని పట్టణ స్థానిక సంస్థలు సిద్ధం చేస్తున్నాయి.
అడ్డగోలు పన్నుల్లో ఔరంగజేబుని మించిపోయిన జగన్!
ప్రజలను అడ్డమైన పన్నులతో పీడించిన పాలకుడి ప్రస్తావన వస్తే ఔరంగజేబు గుర్తుకొస్తారు. తన ఐదేళ్ల పాలనలో చెత్త పన్నులన్నీ వేసిన జగన్... ఔరంగజేబునే మించిపోయారు. సీఎం నిర్వాకాలకు కొత్త ఆస్తిపన్ను విధానం ఓ మచ్చుతునక. రాష్ట్రంలో దశాబ్దాలుగా అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానం అమలులో ఉంది. ఐదేళ్లకు ఒకసారి పన్ను సవరించేవారు. ప్రజలపై భారం వేయకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు పన్ను పెంపును నిక్కచ్చిగా అమలు చేసేవికాదు. చివరిగా ఉమ్మడి ఏపీలో 2002లో నివాస భవనాలకు, 2007లో వాణిజ్య భవనాలకు ఆస్తిపన్ను సవరించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెదేపా... ఆర్థికలోటు వేధిస్తున్నప్పటికీ ఆస్తిపన్ను పెంచలేదు. పైగా నగరాల్లో ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటుకు, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు కృషిచేసింది. జగన్ వచ్చాక నగరాలు, పట్టణాల అభివృద్ధికి చేసిందేమీ లేకపోగా... అప్పటి వరకున్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని తీసేసి, 2021-22 నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధిస్తున్నారు. దాని ప్రకారం నివాస భవనాలకు రిజిస్ట్రేషన్ విలువలో 0.15%, వాణిజ్య భవనాలకు 0.30% చొప్పున పన్నుగా నిర్ణయించారు. ఫలితంగా పన్ను కొన్ని రెట్లు పెరిగిపోయింది. ఒకేసారి అంత భారీగా పన్ను పెంచేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని... ఏటా 15% చొప్పున పెంచుతూ వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కొత్త విధానంలో పెరిగిన పన్ను మొత్తంతో సమానమయ్యేంత వరకు ఏటా... 15% చొప్పున పెరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆస్తుల విలువల్ని సవరిస్తుంది కాబట్టి... పన్ను మొత్తమూ పెరుగుతుంటుంది. అంటే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే... మరో ఐదేళ్లు ఏటా 15% చొప్పున పన్ను వాత తప్పదన్నమాట.
ఏటా ఆస్తి పన్ను పెంపు రాజ్యాంగ విరుద్ధం
-సీహెచ్ బాబూరావు, పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్
పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వకపోగా... ఆస్తి పన్ను రూపంలో నిరంతరంగా, శాశ్వతంగా భారం వేయడం రాజ్యాంగ విరుద్ధం. అనైతికం. అసంబద్ధం. కొత్త విధానంలో అద్దెకు ఉంటున్న వారిపైనా భారం పడుతుందని మొదటి నుంచీ హెచ్చరిస్తున్నాం. పాత విధానం కొనసాగించాలన్న డిమాండ్ను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పాత విధానం పునరుద్ధరించే వారికే ఓట్లు వేస్తామని ఈ ఎన్నికల్లో స్పష్టంగా చెబుతాం.
అశాస్త్రీయ విధానాన్ని రద్దు చేయాల్సిందే
- ఇ.పుల్లారెడ్డి, పట్టణ పౌర సమాఖ్య కర్నూలు నగర కన్వీనర్
ఏటా ఆస్తిపన్ను పెంచే అశాస్త్రీయ విధానాన్ని తక్షణం రద్దు చేయాలి. ప్రజలు నివసిస్తున్న ఇళ్లకు విలువ కట్టి, ఏటా ఆస్తిపన్ను పెంచడమేంటి..? ప్రభుత్వమే ప్రజల్ని పీడించడం ఎంత వరకు సబబు? ప్రజల్ని కొల్లగొట్టే ఆస్తిపన్ను విధానం రద్దు చేయాలి. కొత్తగా నిర్మించుకున్న ఇళ్లకు ఆస్తి పన్ను భారీగా పడుతోంది. పేద, మధ్య తరగతికి ఎంతో భారంగా ఉన్న ఈ విధానాన్ని తక్షణం రద్దు చేయాల్సిందే.
పాత విధానాన్ని తక్షణమే పునరుద్ధరించాలి
- బి.గణేశ్, ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం అపార్ట్మెంట్ల నివాసితుల సంక్షేమ సంఘం
ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను నిర్ణయించే కొత్త విధానంతో ప్రజలపై తీవ్రమైన భారం పడుతోంది. ఏటా 15% చొప్పున పన్ను పెంచడం సరైన విధానం కాదు. దీన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. గత మూడేళ్లుగా పెంచిన ఆస్తి పన్నుతో ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలి. దానికి హామీ ఇచ్చిన పార్టీలకే ఎన్నికల్లో మేం మద్దతిస్తాం.
మంత్రి బొత్స చిలక పలుకులు
‘‘కొత్త పన్ను విధానంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వారు చెల్లిస్తున్న పన్ను 15 శాతానికి మించి పెరగదు. కొత్త పన్ను విధానంలో స్థానిక సంస్థలకు అదనంగా వచ్చే ఆదాయం రూ.186 కోట్లే’’ అని అప్పట్లో పురపాలకశాఖ మంత్రిగా ఉన్న బొత్స చిలకపలుకులు పలికారు. పాత విధానం దళారులకు, అవినీతిపరులకు అవకాశమిచ్చేలా ఉందని, కొత్త విధానంలో అది ఉండబోదని సమర్థించుకున్నారు. 15% పన్ను ఏటా పెరుగుతుందని, అది సాధారణ ప్రజలు భరించలేని స్థాయికి చేరుతుందన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.
సిద్ధమవుతున్న కొత్త బిల్లులు
నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు... ఏప్రిల్ ఒకటి నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను నోటీసులను సిద్ధం చేస్తున్నాయి. 2023-24 డిమాండ్పై 15% పన్ను పెరుగుతుందనుకుంటే... 2024-25లో పట్టణ ప్రజలు రూ.2,109.88 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయాలని తపన.. బస్సుల్లేక నరకయాతన
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కీలకమైన ఎన్నికల్లో ఓట్లు వేయడం కోసం మైళ్ల దూరం దాటి మరీ సొంతూళ్లకు చేరడానికి సిద్ధమైన ఓటర్లకు ఆర్టీసీ నరకం చూపిస్తోంది. -
వైకాపా వీరవిధేయ పోలీసులపై క్రమశిక్షణ చర్యలు
ఎన్నికలు ముంచుకొచ్చినా తరుణంలోనూ వైకాపాకు కొమ్ముకాస్తూ, ఆ పార్టీ ప్రయోజనాల కోసం పరితపించిన నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్రెడ్డి, నంద్యాల డీఎస్పీ ఎన్.రవీంద్రనాథరెడ్డి, నంద్యాల రెండో పట్టణ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ కె.రాజారెడ్డిలపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. -
ఏ వ్యవస్థనూ ‘వదల్లేదు!’
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రతి రాజ్యాంగబద్ధ వ్యవస్థపైనా జగన్ దాడికి దిగారు. తన అనుయాయుల్ని, అనుచరగణాన్ని ఉసిగొల్పారు. న్యాయవ్యవస్థపైనా దాడి చేయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై దాడికి దిగారు. కార్యనిర్వాహక వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, అధికారుల్ని భయభ్రాంతుల్ని చేసి చెప్పినట్టల్లా ఆడించారు. -
ఇతర సిరాలను వేళ్లకు పూస్తే చర్యలు తీసుకుంటాం
ఇతర సిరాలను వేళ్లకు పూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా హెచ్చరించారు. ఈ సిరా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దగ్గర మాత్రమే ఉంటుందని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. -
ఎన్నికల సిబ్బందికి అరకొర ఏర్పాట్లు
రాష్ట్రంలో ఆదివారం ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. చాలా చోట్ల అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతల మధ్యన భోజనం కోసం క్యూ లైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. -
‘వివేకం’ సినిమాకు 2.15 కోట్లకు పైగా వీక్షణలు
సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఉదంతం ఆధారంగా తెరకెక్కించిన ‘వివేకం’ సినిమాకు ఆదివారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.15 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి. -
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అపోలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునీత నర్రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ఫెలోషిప్నకు ఎన్నికయ్యారు. -
బోటు వెళ్తేనే ఓటు..
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరింగ పంచాయతీ పరిధిలోని హోప్ఐలాండ్.. కాకినాడ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉంటుంది. అక్కడ వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులు ఉంటారు. -
ఎన్నికల కోసం ప్రత్యేక పోలీసు అధికారులు
పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు తావివ్వకుండా ఉండేందుకు.. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించినట్లు డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఓ ప్రకటనలో వెల్లడించారు. -
వైకాపా వీరభక్త ఇన్స్పెక్టర్లపై వేటు
అధికార పార్టీకి కొమ్ముకాస్తూ పేట్రేగిపోయిన వైకాపా వీరభక్త ఇన్స్పెక్టర్లు పలువురిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరొందిన తిరుపతి డీటీసీ ఇన్స్పెక్టర్ జగన్మోహన్రెడ్డి, డీటీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజూ యాదవ్, -
దేవుడిచ్చిన అనిర్వచనీయమైన కానుక అమ్మ
‘దేవుడు నాకిచ్చిన అనిర్వచనీయమైన కానుక అమ్మ’ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘అమ్మ....చీకటిలో వెలుగు రేఖై...బాధల్లో బలానివై...అలసటలో ఆలనవై.. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడుగా మారింది
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రైతులకు ఉరితాడుగా మారిందని.. దీనిని రద్దు చేయాలని బాధిత రైతాంగ పోరాట వేదిక కన్వీనర్ తన్నీరు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. -
ఇలా అయితే ఇండియా అభివృద్ధి చెందదు
ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారానే భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ రాజనీతి మానవీయ శాస్త్ర ప్రొఫెసర్ వార్ బైరన్ స్కాట్ అన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ మన్మథరావు, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. -
రాష్ట్రంలో భిన్న వాతావరణం.. పలు జిల్లాల్లో వర్షాలకు అవకాశం
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. -
ఓటేసేందుకు వైఎస్ భాస్కరరెడ్డికి అనుమతి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏడో నిందితుడైన వై.ఎస్.భాస్కరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. 13న వెళ్లి అదే రోజు తిరిగి హైదరాబాద్ రావాలని స్పష్టం చేసింది. -
ఆరు పోలింగ్ కేంద్రాల్లో నిలిచిన విద్యుత్తు సరఫరా
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి వరకు పునరుద్ధరించలేదు. -
రూ.4 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐ తలుపు తట్టిన ఏపీ సర్కార్
పదవీ కాలం ముగుస్తున్న దశలోనూ సొంతవారికి బిల్లుల చెల్లింపు కోసం వైకాపా ప్రభుత్వం ఎడాపెడా రుణాలు తీసుకుంటోంది. ఏప్రిల్ 1 నుంచి మే 14 వరకు ఈ 44 రోజుల్లో రూ. 17 వేల కోట్ల రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. -
ఇదీ సంగతి!
-
కార్టూన్లు
కార్టూన్లు -
పెద్దల మాట
పెద్దల మాట
తాజా వార్తలు (Latest News)
-
భాజపా సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత
-
గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. కోల్కతాతో మ్యాచ్ రద్దు
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
-
మహిళ కిడ్నాప్ కేసు.. హెచ్డీ రేవణ్ణకు బెయిల్
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
కుప్పకూలిన భారీ హోర్డింగ్.. ఎనిమిది మంది మృతి