చేబ్రోలులో పవన్‌కల్యాణ్‌ నివాసం

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Published : 06 Apr 2024 04:35 IST

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆయన నివసించే భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో దీన్ని ఎంపిక చేశారు.


7 నుంచి పవన్‌ ఎన్నికల ప్రచారం పునఃప్రారంభం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఈనెల 7న అనకాపల్లి, 8న ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటించనున్నట్లు పార్టీ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉగాది పర్వదినం సందర్భంగా 9న పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న వేడుకల్లో పవన్‌ పాల్గొననున్నారు. జ్వరం కారణంగా రెండ్రోజుల క్రితం ప్రచారానికి తాత్కాలిక విరామం ప్రకటించిన ఆయన.. ఆదివారం నుంచి యథావిధిగా తదుపరి పర్యటనకు సిద్ధమవుతున్నారు. నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్‌ను త్వరలోనే ఖరారు చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని