ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు.
అమ్మో.. ఇక ఈయన్ను సూసేది లేదు!
వోటేత్తే బూములు, గట్రా లాగీసుకుంతరు
రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు.. వెయ్యి రూపాయల బిల్లొచ్చింది
జగన్ సర్కార్పై ఉత్తరాంధ్ర జనాగ్రహం
ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న అసంతృప్తి
60 శాతం మంది మార్పు కోరుతున్నారు
ధరలు, విద్యుత్తు బిల్లులు, మద్యం ధరలు ప్రధానాంశం
ధాన్యం అమ్ముకోలేకపోతున్నామంటున్న రైతులు
భూకబ్జాలపైనా, ఎమ్మెల్యేల దందాలపైనా ఆగ్రహావేశాలు
పేదలు, మహిళలు, వ్యాపారులు, చిరుద్యోగులు అన్ని వర్గాలదీ ఇదే మాట
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు.. ఎక్కడో మారుమూల గ్రామాల్లో, ఒడిశా రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న చిన్న పల్లెల్లోనూ ప్రజాగ్రహం కనిపించింది. శ్రీకాకుళం జిల్లా మారుమూలకు వెళ్లినా, విజయనగరం జిల్లా సరిహద్దుల్లో అడిగినా, మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాలకు వెళ్లినా ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి నాలుగు రోజులపాటు ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో వెయ్యికి పైగా కిలోమీటర్లు నగరం, పట్టణం, పల్లె, మారుమూల పల్లె అని కాకుండా ప్రతిచోటా సామాన్య, మధ్య తరగతి, పేద, వ్యాపార వర్గాలను చిన్న పట్టణాల్లో చిన్నచిన్న పనులు చేసుకుంటున్న వారిని పలకరించారు. విలేకరుల్లా కాకుండా సాధారణ ప్రయాణికుల్లా.. ఏదో రాజకీయాలంటే ఆసక్తి ఉన్నవాళ్లలా.. రైతులు, రైతు కూలీలు, చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, మహిళలు, వృద్ధులు, యువకులు, అక్కడక్కడ ఒకరిద్దరు ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు.
పట్టా పుస్తకం మీద ఆయన బొమ్మ ఏసేసుకుంటాడేటి? నా బొమ్మో, నాయన బొమ్మో, మావోడి బొమ్మో ఉండాలి గానీ, ఆయనది ఏసేసుకోడమేటి? మా పీక నొక్కేత్తన్నడు. మళ్లీ వోటేత్తే మా బూములుగట్రా లాగీసుకోడని నమ్మకమేటి?
శ్రీకాకుళం జిల్లా మందస మండలం కిల్లోయి గ్రామ రైతు
ఏటి సెప్పమంటరు, పథకాలు, పథకాలు అనేసుకుంటన్నారు. పని ఎక్కడుంది? కుర్రకుంకలు సైౖకిలే తొక్కడం లేదు. బళ్లు అట్టుకొచ్చీసేరు. సైకిళ్లు బాగు సేసుకునే కొట్టు ఎట్టుకున్న. పని లేదు. మా సిక్కొచ్చిపడింది. పెబుత్వం ఇలా ఉంటే కట్టమే. ఈసారి మార్చేయాల్సిందే.
విజయనగరం జిల్లా గరివిడి గ్రామ చివర్లో సైకిళ్లు బాగు చేసుకునే వ్యక్తి మాటలివి.
నేను ఈ మందు సీసా రూ.3 వేలు పెట్టి కొన్నా. జగనన్న బ్రాండ్లు తాగలేం. సరైన బ్రాండ్ కావాలంటే సంపాదించిన మొత్తం కన్నా ఎక్కువ పెట్టాల్సి వస్తోంది.
గరివిడిలోనే ఓ మందుబాబు అంతరంగమిది.
ఓసారి సూతుమనుకున్నాం. ఏటిసేసిండు. అబ్బో కరెంటు బిల్లులు మండిపోతనాయి. రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు. ఎయ్యి రూపాయల బిల్లొచ్చేసినాది. మళ్లోటిసారా.. అమ్మో!
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి సమీపంలో తాటిముంజులు అమ్ముకుంటున్న పేద గీత కార్మిక మహిళ ఆందోళన.
కూలి సేసుకుంటే రోజుకు 600. ఏటికీ సరిపోతలేదు. మందు కొంటే ఇంకేటి ఉంటలేదు. కరెంటు బిల్లులు బారెడు. పిచ్చెక్కిపోనాది. మళ్లీ ఈయన్ను సూసేది లేదు.
విజయనగరం జిల్లా గజపతినగరం సెంటర్లో పక్క పల్లెటూరు నుంచి వచ్చిన ఒక కూలీ.
విశాఖ రాజధాని అన్నారు. ఇక్కడ భూములన్నీ కబ్జాలు చేసేశారు. రుషికొండను బోడిగుండు చేసేశాడు. ప్యాలస్ కట్టాడు. అసెంబ్లీ కూడా చూడటానికి అనుమతిస్తారు. ఈ ప్యాలస్ చూడటానికి కూడా అంగీకరించడం లేదు. ఉద్యోగాల్లేక ఉత్తరాంధ్ర యువకులం ఇబ్బందులు పడుతున్నాం. ఈసారి ప్రభుత్వం మారిపోతుంది.
విశాఖ నగరం నడిబొడ్డున ఒక యువకుడు.
ఈసారి శంకరే (టీడీపీ అభ్యర్థి). డౌట్ లేదన్నా. మళ్లీ జగన్ వచ్చాడంటే మందు కొనలేం. తాగలేం. ఎంతకైనా అమ్మేస్తాడు.
శ్రీకాకుళం నడిబొడ్డున పూలు అమ్ముతున్న ఓ చిరువ్యాపారి.
ఆ వర్గం, ఈ వర్గం అని లేదు. ఆ ఊరు, ఈ పల్లె అని లేదు. ఎక్కడికి వెళ్లినా జగన్ సర్కార్పై తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. పథకాల పేరుతో డబ్బులిస్తే జీవితాలు సాగిపోవని, పని కావాలని పల్లె ఘోషిస్తోంది. మహిళల్లో విద్యుత్తు ధరలపై చాలా కోపం కనిపిస్తోంది. ధరలు పెరిగిపోయి బతకడం కష్టమైపోయిందన్న ఆవేదనా వినిపిస్తోంది. పథకాలు సైతం అందరికీ అందడం లేదన్న అసంతృప్తి కనిపించింది. రైతులూ కోపంగా ఉన్నారు. ఉపాధి కూలీలు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు మద్యం ధరలు పెరిగిపోవడంతో మండిపోతున్నారు. ఈ ఎన్నికల్లో ‘మద్యం’ చాలా కీలకాంశంగా మారింది. ప్రభుత్వం మారితే మళ్లీ పాత మద్యం బ్రాండ్లు వస్తాయనే నమ్మకంతో సామాన్య పేద పురుషులు కనిపించారు. రోడ్లు బాగాలేవని చాలాచోట్ల జనం మండిపడుతున్నారు. విస్తృత పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తే నూటికి 60 మంది ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఈ సర్కారు రాదని స్పష్టంగా అభిప్రాయపడుతున్నారు.
రైతుల్లోనూ కోపం
అనేక చోట్ల రైతులు.. ధాన్యం అమ్ముకోవడం చాలా కష్టంగా ఉందన్నారు. గతంలో వ్యాపారుల దగ్గర అప్పులు చేసి వాళ్లకు ధాన్యం ఇచ్చేసేవాళ్లమని, ఇప్పుడు రైతుభరోసా కేంద్రాలతో తిప్పలు పడుతున్నామని చెప్పారు. పైరవీ చేసుకునేవాళ్లే ధాన్యం అమ్ముకోగలుగుతున్నారని.. ఇలా అయితే కౌలు రైతుల జీవనం కష్టమేనని కొందరు వాపోయారు. మళ్లీ జగన్ వస్తే బతకలేమంటున్నారు. కాలువల్లో నీళ్లు రావడం లేదని, తోటపల్లి కాలువలు తవ్వలేదని, బాగు చేయలేదని విజయనగరం జిల్లా మారుమూల ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్లలో నిశ్శబ్దంగా వ్యతిరేకత ఉందని, ఎన్నికల్లో అది పూర్తిగా బయటపడుతుందని కొందరు అన్నదాతలు చెప్పారు. మారుమూల పల్లెల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి మాట్లాడుతున్నారు. పలాస నియోజకవర్గంలో మారుమూల గ్రామంలో ఉపాధి కూలీ, ఆమదాలవలస సమీపంలో బూర్జ మండలం తిమిగాంలో ఓ సామాన్య రైతు కూడా రాష్ట్ర అప్పులపై ఆందోళన వ్యక్తం చేయడం.. జనానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎంత అవగాహన ఉందో చెప్పింది.
ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహావేశాలు
అనేక ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహావేశాలు కనిపించాయి. ఈసారి ఎన్నికల్లో శ్రీకాకుళం ఆమదాలవలస రోడ్డు ముగ్గురు ప్రజాప్రతినిధుల భవితవ్యాన్ని రాయబోతోంది. ఈ రోడ్డు నిర్మించకపోవడంతో ఐదేళ్లలో ఏకంగా 24 మంది చనిపోయారు. వందల మంది గాయపడి, వారి కుటుంబాలు నరకయాతన పడ్డాయి. ఇది శ్రీకాకుళం, ఆమదాలవలస వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు, శ్రీకాకుళం లోక్సభ వైకాపా అభ్యర్థికి ప్రతికూలంగా మారబోతోంది. పలాస-కాశీబుగ్గ వద్ద రైల్వే గేటు సమస్య ఆ నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. అక్కడ రైల్వే పైవంతెన నిర్మించకపోవడం ప్రధానాంశమవుతోంది.
నేతల దందాలపై జనం ఆగ్రహం
ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మంత్రులందరికీ కష్టకాలమే. కొందరు ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు చేసే దందాలు, వసూళ్లు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. మంత్రి సీదిరి అప్పలరాజు తమ ఊళ్లకు రాలేదని, సమస్యలు పట్టించుకోలేదని పలాస మండలంలోనే పలు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి ఎప్పుడో ఓట్లు అడిగేందుకు వచ్చారని.. మళ్లీ ఇప్పుడు కూడా ఓట్ల కోసమే వస్తున్నారని గిరిజనులు మాట్లాడుతున్నారు. ఈసారి ఓటేసేది లేదని తేల్చిచెప్పేస్తున్నారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిపైనా తీవ్ర వ్యతిరేకత ఉంది. స్పీకర్ తమ్మినేని సీతారాం నియోజకవర్గంలో అయితే ప్రజాగ్రహం అంతా ఇంతా కాదు.
ఫలితాలను మార్చేయబోతున్న భూకబ్జాలు
ఉత్తరాంధ్రలో ఈసారి ఎన్నికల్లో భూకబ్జాలు కీలకాంశం. విశాఖ నగరంలో వైకాపా నాయకులు ఆక్రమించుకున్న భూములు, కబ్జా చేసిన స్థలాలు అక్కడ అధికార పార్టీ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేయబోతున్నాయి. గజపతినగరంలో ఒక పెద్ద ప్రజాప్రతినిధి ఊళ్లలో భూములన్నీ సొంతం చేసుకోవడం, శ్రీకాకుళం నడిబొడ్డున వైకాపా పెద్ద స్థలాల ఆక్రమణ, పలాస నియోజకవర్గంలో పట్టా భూములు దౌర్జన్యంగా లాక్కోవడం, దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర అవినీతి ఆరోపణలు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి.
ఆసక్తికర సన్నివేశాలు
ఈ పర్యటనలో చాలాచోట్ల ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు సెంటర్లో మూటలు మోసే వ్యక్తులు ఇద్దరు, ఆటోడ్రైవర్లు మరో ఇద్దరు, మరో ఇద్దరు పేదలు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక వృద్ధుడు వచ్చి జగన్ ఇస్తున్న పెన్షన్ గురించి మాట్లాడటం ప్రారంభించాడు. మూటలు మోసుకునే వ్యక్తి స్పందిస్తూ.. అసలు పెన్షన్ ఎన్టీఆర్ హయాంలో ఎలా ప్రారంభమైంది, చంద్రబాబు రూ.2,000 ఎలా చేశాడు, ఆ తర్వాత జగన్ రూ.3,000 చేస్తానని, ఐదేళ్లలో విడతలవారీగా వెయ్యి రూపాయలు పెంచడం, ఇప్పుడు చంద్రబాబు రూ.4వేలు ఇస్తాననడం వంటి అంశాలతో వాదనకు దిగాడు. అక్కడున్న ఆరుగురిలో ఇద్దరు నిశ్శబ్దంగా చూస్తుంటే.. మరో నలుగురు ఆ మూటలు మోసే వ్యక్తికి జత కలిశారు. పేదల మద్దతు ఎటు వైపు ఉంటుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఆమదాలవలస పట్టణంలో ఒక వ్యాపారి అభివృద్ధి కావాలంటుంటే.. పథకాల వల్ల ప్రజలు బాగుపడతారని ఓ పేదోడు ఆయనతో వాదనకు దిగాడు. పథకాలు వద్దనడం లేదని, అభివృద్ధి కావాలని వ్యాపారి వాదించారు.
కొసమెరుపులు
మళ్లీ జగన్ వస్తే ఇక ఇక్కడ ఉండలేం.. ఎక్కడికైనా వెళ్లిపోవాలి పెద్ద పెద్ద పట్టణాల్లో చాలామంది నుంచి వస్తున్న మాట ఇది. మారుమూల గిరిజన నియోజకవర్గమైన పాలకొండలో సీతంపేట వెళ్లే దారిలో వెలగవాడ వద్ద మధ్యాహ్నం పూట రావిచెట్లు కింద పడుకుని ఉన్న వృద్ధులను కదిలించినా ఇదే మాట వినిపించడం గమనార్హం. ‘పథకాలు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ లాక్కుంటున్నారు. మళ్లీ జగన్ వస్తే ఊరు వదిలేసి వెళ్లిపోవాలి. పేదలు ఇక్కడ బతకలేం. ఎక్కడికో వెళ్లి ఏదో ఒక పని చూసుకోవాలి’ అని వారు చెప్పడం గమనార్హం.
ఉత్తరాంధ్రలో అనేక నియోజకవర్గాల్లో వైకాపా అభిమానులు సైతం అక్కడ స్థానికంగా తెదేపా గెలుస్తుందని అంగీకరిస్తున్నారు. లేకపోతే హోరాహోరీగా ఉందని, తమ వాడు గెలుస్తాడని చెప్పలేమని అభిప్రాయపడుతున్నారు. పైన ఎలా ఉంటుందో తెలియదు కానీ.. అని దీర్ఘం తీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం సీఎం జగన్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడి అవసరాల కోసం రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
ఈసీ అనుమతి లేదు
ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఆ దేవతే లేకపోతే..
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు, అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రుకాల్చి వాతపెట్టిన సందర్భాలు అనేకం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి. -
బీరాలు పలికి.. బేరానికొచ్చి!
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా’పై జగన్ చెలరేగిపోయారు. కేంద్రంపై రంకెలు వేశారు. ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఊగిపోయారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి బంద్లు చేయించారు. -
ఆ‘పైవాడూ’ కాపాడలేడు!
..కానీ ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022’ దేవుళ్ల భూములకే ఎసరు పెట్టనుంది! వైకాపా సర్కారు రూపొందించిన అనాలోచిత చట్టంతో దేవాదాయ, వక్ఫ్, క్రైస్తవ మిషనరీలకు చెందిన భూములు ప్రమాదంలో పడుతున్నాయి. -
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
గతంలో ఏ ఎన్నికల్లోనూ కనిపించనంత కసి, ఉత్సాహం రాష్ట్ర ఓటర్లలో కనిపిస్తోంది. విదేశాలు, ఇతర నగరాల్లో ఉండే ఓటర్లు భారీ సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. -
‘భూ’చాళ్ల చట్టానికి బలయ్యేది బడుగులే
జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బారిన పడేవారిలో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. బడుగు బలహీనవర్గాలే. కొత్త చట్టంతో బలయ్యేది సెంటు, అరసెంటు స్థలాలు.. అరెకరా, ఎకరా భూమినే నమ్ముకున్నవారే. వారికి పలుకుబడి ఉండదు. -
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైకాపా ప్రభుత్వం రూపొందించిందని హైకోర్టు న్యాయవాది పదిరి రవితేజ విమర్శించారు. -
పన్నుల భారం రూ.1.38 లక్షల కోట్లు
‘అల్లమంటే నాకు తెలీదా! బెల్లంలా పుల్లగా ఉంటుంది’ అన్నాడంట వెనకటికొకడు! మంచి పాలన అంటే దౌర్జాన్యాలు, దోపీడీలు, అక్రమాలు, దమనకాండలు అనుకునే ముఖ్యమంత్రి జగన్ తీరు ఇప్పుడు అలానే ఉంది. -
భయాలను పెంచేలా.. ‘నోరు నొక్కేసేలా..!’
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై సీఎం జగన్, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలే రైతులు, వివిధ వర్గాల ప్రజల్లో భయాలను మరింత పెంచేలా ఉంటున్నాయి. -
విచారణ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయి
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ప్రకియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా వింటామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. -
ఈసీ తీరును నిరసిస్తున్నాం: బొత్స సత్యనారాయణ
కేంద్ర ఎన్నికల సంఘం తీరును వైకాపా నిరసిస్తోందని, ఆక్షేపిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో ఆర్యవైశ్యులకు అన్యాయం
జగన్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఎటువంటి న్యాయమూ జరగలేదని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
మేం వైకాపాకు మద్దతు ఇవ్వలేదు
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్... వైకాపాకు మద్దతు ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
తల్లితో కలిసి నేడు పిఠాపురానికి రామ్చరణ్
అగ్ర నటుడు చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. -
‘మూడు కోట్ల ఎకరాలకు’ బీమా ఎగ్గొట్టారు
పంట వేస్తే చాలు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని నమ్మిన రైతుల్ని జగన్ నిలువెల్లా మోసం చేశారు. -
ఆసుపత్రులు ఆగం.. తగ్గేదెలా రోగం?
పదే పదే ప్రచారం చేసి లేనిది ఉన్నట్లు నమ్మించే గోబెల్స్ ప్రచారంలో జగన్ ముందుంటారు. ఏమీ చేయకున్నా చేసినట్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట.
తాజా వార్తలు (Latest News)
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
-
కడపలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు