గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు.
చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్టుడే: జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయలో బండి జేమ్స్ చిత్రలేఖనం ఉపాధ్యాయుడు. గతంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి నవోదయ, నెల్లూరు జిల్లా నవోదయలో బోధించి, 2016 నుంచి మద్దిరాల నవోదయలో పనిచేస్తున్నారు. ఏప్రిల్ 30తో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిని సత్కరించి గురుదక్షిణ ఇవ్వాలని లేపాక్షి నవోదయ పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ఆదివారం మద్దిరాల నవోదయలో సన్మానోత్సవం ఏర్పాటు చేసి... కార్యక్రమం మధ్యలో ఓ కారు తెచ్చి జేమ్స్ దంపతులకు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు, అధ్యాపకులు బి.ఆదినారాయణ, లేపాక్షి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వేమనారాయణ, సంయుక్త కార్యదర్శి రాజారెడ్డి, సభ్యులు జేమ్స్ దంపతులను సత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముందుగానే ‘నైరుతి’ జల్లు
ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా కక్ష సాధించిన వైకాపా ప్రభుత్వం.. చివరికి ఆయన, ఆయన సతీమణి ఓటు హక్కు లేకుండా చేసింది. -
ఓట్ల పండుగకు 42 బస్సుల్లో వచ్చిన యువత
మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న దృఢ సంకల్పంతో ఐటీ ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన యువత పెద్ద సంఖ్యలో హైదరాబాద్లో ఉద్యోగాల నిమిత్తం ఉంటోంది. -
ఓటెత్తిన ‘ప్రజా’స్వామ్యం
రాష్ట్ర ప్రజలు ఓటెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటిచెప్పారు. గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి మరీ వజ్రాయుధం లాంటి ఓటుహక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలవారు చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ వైకాపా విధ్వంసకాండ
ఏజెంట్లను భయపెట్టారు.. కూర్చుంటే తలకాయలే ఉండవని హూంకరించారు.. సాయంత్రం తిరిగి ఇళ్లకూ వెళ్లరని హెచ్చరించారు.. రేపటి నుంచి ఊళ్లలో తిరగలేరని బెదిరించారు. పోలీసులు ఉన్నా బెదరకుండా కిరాతకంగా వ్యవహరించారు. -
ప్రజా చైతన్యంపై పిడిగుద్దులు
ఎమ్మెల్యే అయినా, ఇంకెవరైనా కూడా పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే. అంతే తప్ప, ఇష్టారాజ్యంగా లోపలకు వెళ్తామంటే కుదరదు. అలా పౌరస్పృహతో.. నిబంధనలు పాటించాలని తెనాలి వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను అడగడమే ఆ ఓటరు తప్పయిపోయింది. -
మాచర్లలో రక్తం పారాల్సిందే..!
ఆటవిక పాలనను మించిన అరాచకాలకు మాచర్ల నియోజకవర్గ ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధమైన వేళ.. అరాచకశక్తులు మరింతగా పేట్రేగిపోయాయి. ఐదేళ్లుగా నమ్ముకున్న దాడులు, బెదిరింపులు, హెచ్చరికలు, హింసనే ఎన్నికల రోజున ఆఖరి అస్త్రంగా ప్రయోగించారు. -
ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు
రాష్ట్రంలో చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉండబోదన్నారు. -
పోలింగ్ కేంద్రం వద్ద అంగన్వాడీల ఆట సాయం
చిత్తూరు నగరంలోని బాలాజీ నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేసేందుకు అనేక మంది మహిళలు తమ చిన్నారులతో పోలింగ్ కేంద్రాలకు సోమవారం చేరుకున్నారు. -
ఓటేశాం.. వెళ్లొస్తాం!.. తెలంగాణ బాటపట్టిన ప్రజలు
సొంత ఊరిలో ఓట్లేసిన ప్రజలు సాయంత్రానికి తిరిగి తెలంగాణ బాటపట్టారు. కార్లు, బస్సులు.. ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్కు బయల్దేరారు. హైదరాబాద్ వైపు వచ్చే రహదారుల్లో సోమవారం సాయంత్రం 5 గంటల దాటాక ఒక్కసారిగా రద్దీ పెరిగింది. -
భర్త మరణించినా.. ఓటు విలువ చాటిన భార్య
ఓ వైపు భర్త మృతిచెందినా.. తనలోని బాధను దిగమింగుకుని ఓటుపై అవగాహన కలిగిన చిరుద్యోగిగా ఓ మహిళ తన ప్రాథమిక హక్కు వినియోగించుకున్నారు. -
జనచైతన్య సంస్థల డైరెక్టర్ శకుంతల కన్నుమూత
జనచైతన్య గ్రూప్ సంస్థల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ మాదల శకుంతల(86) గుంటూరు రాజేంద్రనగర్లోని స్వగృహంలో సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. -
సంకల్పం ముందు వైకల్యం ఎంత!
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని బీవీనగర్ ప్రాంతానికి చెందిన సురేశ్.. తన 12 ఏళ్ల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయారు. -
నది దాటారు.. ఓటేశారు..
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని చోళపదం పంచాయతీకి చెందిన రెబ్బ, వనదార గిరిజన గ్రామాల ప్రజలు నదిలో నుంచి కాలినడకన వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పుట్టెడు దుఃఖంలోనూ ఓటేసిన వృద్ధురాలు
ఓటు విలువ తెలియక కొందరు ఇళ్లకే పరిమితమవుతుంటే.. పుట్టెడు దుఃఖాన్ని భరించి 80 ఏళ్ల వృద్ధురాలు తన కర్తవ్యాన్ని చాటారు. -
రెండు రౌండ్ల కాల్పులు.. ముగ్గురికి గాయాలు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ భూమిలోకి రెండురౌండ్లు కాల్పులు జరపడంతో.. ఆ ధాటికి రాళ్లు ఎగిరి తగలడంతో ముగ్గురు గాయపడ్డారు. -
సీబీఎస్ఈ ఫలితాల విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అబ్బాయిలపై అమ్మాయిలు పైచేయి సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ
-
టీ20 ప్రపంచకప్ 2024.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఇవే...
-
హోర్డింగ్ కుప్పకూలిన ఘటన.. వెలుగులోకి పలు కీలక విషయాలు
-
వెజ్ థాలీ ధర పెరిగింది.. నాన్ వెజ్ తగ్గింది.. ఎందుకిలా?