ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
సామాజికవేత్త గుంటుపల్లి శ్రీనివాస్
ఈనాడు, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘ఇటీవల విడుదల చేసిన పదోతరగతి పరీక్షల ఫలితాల్లో వచ్చిన మార్కులు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 2023లో 590 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు 839 మందిఉండగా.. ఈ ఏడాది 2,060 మంది ఉన్నారు. గత ఏడాది 550.. అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు 43,782 మంది కాగా.. ఈసారి 63,985మంది ఉన్నారు. 2023లో మొదటి శ్రేణి మార్కులు వచ్చిన వారి కంటే ఈసారి 94,945 మంది అధికంగా ఉన్నారు. ఈ మార్కులు పరీక్షలు నిర్వహించిన తీరు, అధికారుల ఉద్దేశాలను తెలియజేస్తోంది. పిల్లలు కలిసి కట్టుగా ఒకరి దాంట్లో మరొకరు చూసుకొని పరస్పరం సహకరించుకుంటూ పరీక్షలు రాసినట్లు తెలుస్తోంది. ఇదంతా విద్యాశాఖ ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో జరిగింది’ అని విమర్శించారు.
‘కొంతమంది విద్యార్థులు పక్కనున్న వాళ్ల పేపర్లో చూసి రాస్తూ వారి పక్క విద్యార్థులు ఏ మాధ్యమంలో సమాధానాలు రాస్తే వారు అదే మాధ్యమంలో సమాధానాలు రాశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలో పక్కనున్న వారి పేపర్లో చూసి తాము చదవని మాధ్యమంలో సమాధానాలు రాస్తే.. ద్విభాష పాఠ్యపుస్తకాలలోని ఆంగ్లంలో ఉన్న పాఠాలు చదివి.. పరీక్షల్లో సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం, గణితం సమాధానాలు ఆంగ్లంలో రాశారని అధికారులు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. వాస్తవంగా పదో తరగతి విద్యార్థులకు ద్విభాష పాఠ్యపుస్తకాలనే ఇవ్వలేదు. అయినా ప్రభుత్వం ద్విభాష పుస్తకాలు ఇచ్చినట్లు.. పిల్లలు వాటిని చదివినట్లు ప్రచారం చేయడం అత్యంత బాధాకరం. ఎన్నికల ముందు పార్టీలు ఓటర్లపై డబ్బులు వెదజుల్లుతాయి. మద్యం పారిస్తాయి. ఇప్పుడు వ్యూహాలు మార్చి.. ఎన్నికల కోసం పరీక్షల్లో చూచిరాతలను ప్రోత్సహించి, ప్రశ్నపత్రం స్థాయి తగ్గించి అత్యంత సులువైన ప్రశ్నలు ఇచ్చి, మార్కుల వరద పారించడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఓట్లు వేస్తారని విద్యాశాఖ అధికారులు భావించారా? ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం వారిని గెలిపించేందుకు విద్యాశాఖ అధికారులు ఇదంతా చేశారా’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయాలని తపన.. బస్సుల్లేక నరకయాతన
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కీలకమైన ఎన్నికల్లో ఓట్లు వేయడం కోసం మైళ్ల దూరం దాటి మరీ సొంతూళ్లకు చేరడానికి సిద్ధమైన ఓటర్లకు ఆర్టీసీ నరకం చూపిస్తోంది. -
వైకాపా వీరవిధేయ పోలీసులపై క్రమశిక్షణ చర్యలు
ఎన్నికలు ముంచుకొచ్చినా తరుణంలోనూ వైకాపాకు కొమ్ముకాస్తూ, ఆ పార్టీ ప్రయోజనాల కోసం పరితపించిన నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్రెడ్డి, నంద్యాల డీఎస్పీ ఎన్.రవీంద్రనాథరెడ్డి, నంద్యాల రెండో పట్టణ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ కె.రాజారెడ్డిలపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. -
ఏ వ్యవస్థనూ ‘వదల్లేదు!’
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రతి రాజ్యాంగబద్ధ వ్యవస్థపైనా జగన్ దాడికి దిగారు. తన అనుయాయుల్ని, అనుచరగణాన్ని ఉసిగొల్పారు. న్యాయవ్యవస్థపైనా దాడి చేయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై దాడికి దిగారు. కార్యనిర్వాహక వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, అధికారుల్ని భయభ్రాంతుల్ని చేసి చెప్పినట్టల్లా ఆడించారు. -
ఇతర సిరాలను వేళ్లకు పూస్తే చర్యలు తీసుకుంటాం
ఇతర సిరాలను వేళ్లకు పూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా హెచ్చరించారు. ఈ సిరా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దగ్గర మాత్రమే ఉంటుందని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. -
ఎన్నికల సిబ్బందికి అరకొర ఏర్పాట్లు
రాష్ట్రంలో ఆదివారం ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. చాలా చోట్ల అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతల మధ్యన భోజనం కోసం క్యూ లైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. -
‘వివేకం’ సినిమాకు 2.15 కోట్లకు పైగా వీక్షణలు
సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఉదంతం ఆధారంగా తెరకెక్కించిన ‘వివేకం’ సినిమాకు ఆదివారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.15 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి. -
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అపోలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునీత నర్రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ఫెలోషిప్నకు ఎన్నికయ్యారు. -
బోటు వెళ్తేనే ఓటు..
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరింగ పంచాయతీ పరిధిలోని హోప్ఐలాండ్.. కాకినాడ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉంటుంది. అక్కడ వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులు ఉంటారు. -
ఎన్నికల కోసం ప్రత్యేక పోలీసు అధికారులు
పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు తావివ్వకుండా ఉండేందుకు.. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించినట్లు డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఓ ప్రకటనలో వెల్లడించారు. -
వైకాపా వీరభక్త ఇన్స్పెక్టర్లపై వేటు
అధికార పార్టీకి కొమ్ముకాస్తూ పేట్రేగిపోయిన వైకాపా వీరభక్త ఇన్స్పెక్టర్లు పలువురిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరొందిన తిరుపతి డీటీసీ ఇన్స్పెక్టర్ జగన్మోహన్రెడ్డి, డీటీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజూ యాదవ్, -
దేవుడిచ్చిన అనిర్వచనీయమైన కానుక అమ్మ
‘దేవుడు నాకిచ్చిన అనిర్వచనీయమైన కానుక అమ్మ’ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘అమ్మ....చీకటిలో వెలుగు రేఖై...బాధల్లో బలానివై...అలసటలో ఆలనవై.. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడుగా మారింది
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రైతులకు ఉరితాడుగా మారిందని.. దీనిని రద్దు చేయాలని బాధిత రైతాంగ పోరాట వేదిక కన్వీనర్ తన్నీరు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. -
ఇలా అయితే ఇండియా అభివృద్ధి చెందదు
ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారానే భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ రాజనీతి మానవీయ శాస్త్ర ప్రొఫెసర్ వార్ బైరన్ స్కాట్ అన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ మన్మథరావు, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. -
రాష్ట్రంలో భిన్న వాతావరణం.. పలు జిల్లాల్లో వర్షాలకు అవకాశం
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. -
ఓటేసేందుకు వైఎస్ భాస్కరరెడ్డికి అనుమతి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏడో నిందితుడైన వై.ఎస్.భాస్కరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. 13న వెళ్లి అదే రోజు తిరిగి హైదరాబాద్ రావాలని స్పష్టం చేసింది. -
ఆరు పోలింగ్ కేంద్రాల్లో నిలిచిన విద్యుత్తు సరఫరా
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి వరకు పునరుద్ధరించలేదు. -
రూ.4 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐ తలుపు తట్టిన ఏపీ సర్కార్
పదవీ కాలం ముగుస్తున్న దశలోనూ సొంతవారికి బిల్లుల చెల్లింపు కోసం వైకాపా ప్రభుత్వం ఎడాపెడా రుణాలు తీసుకుంటోంది. ఏప్రిల్ 1 నుంచి మే 14 వరకు ఈ 44 రోజుల్లో రూ. 17 వేల కోట్ల రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. -
ఇదీ సంగతి!
-
కార్టూన్లు
కార్టూన్లు -
పెద్దల మాట
పెద్దల మాట
తాజా వార్తలు (Latest News)
-
జొమాటో లాభం రూ.175 కోట్లు.. త్వరలో వెయ్యి బ్లింకిట్ స్టోర్లు
-
భాజపా సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత
-
గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. కోల్కతాతో మ్యాచ్ రద్దు
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
-
మహిళ కిడ్నాప్ కేసు.. హెచ్డీ రేవణ్ణకు బెయిల్
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ