‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే.
జగన్ కాపులకు చేసిన దగా అంతా ఇంతా కాదు
రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తానని మ్యానిఫెస్టోలో హామీ
ఇచ్చింది రూ.2 వేల కోట్లు మాత్రమే
తెదేపా అమలు చేసిన పలు పథకాలూ ఎత్తివేత
ఈనాడు, అమరావతి
మాటల గారడీలోనే కాదు.. అంకెల గారడీలోనూ..
జగన్ను మించిన వారుండరు.
అందుకు ప్రత్యక్ష నిదర్శనం.. కాపులకు ఆయన ఇచ్చిన హామీ..
దాన్ని అమలు చేసిన తీరు!
కాపు కాస్తానని చెప్పి.. కాటు వేసిన ఘనుడు జగన్...
కాపు కార్పొరేషన్కు రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం
- గత ఎన్నికల మ్యానిఫెస్టోలో కాపులకు జగన్ ఇచ్చిన హామీ ఇదొక్కటే. నిజంగా కాపుల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఈ ఒక్కటైనా సక్రమంగా అమలు చేయాలి కదా? కానీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యాన్నే మార్చేశారు. గత ప్రభుత్వాలు అందించిన స్వయం ఉపాధి రుణాలను ఎత్తేశారు. అందరికీ ఇచ్చే పింఛన్లు, ఉపకారవేతనాలు, ఇతర పథకాల లెక్కల్ని కాపుల ఖాతాలో వేసి ఇదిగో గొప్పగా సాయం అందించామని అంకెల గారడీ చేస్తున్నారు.
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. కాపుల విషయంలో అయితే మరీ ఘోరం. ఐదేళ్లలో ఎదిగేందుకు ఏ చిన్న అవకాశమూ ఇవ్వలేదు. అంతటితోనే ఆగలేదు. కాపు కాసేందుకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు పాతరేశారు. చివరికి నిరుపేదలకు ఉపయోగపడే కాపు భవనాలపైనా కక్షకట్టారు. తెదేపా ప్రభుత్వం కట్టిందనే అక్కసుతో నిర్మాణాల పూర్తికి నిధులు కేటాయించకుండా ఎక్కడికక్కడ వదిలేశారు. నైపుణ్య శిక్షణ అందితే కాపు యువత ఎక్కడ బాగుపడిపోతారోనని దానికీ తిలోదకాలిచ్చారు. ఇదేకాదు ఈడబ్ల్యూఎస్ కోటాలో తెదేపా ప్రభుత్వం కాపులకు అమలు చేసిన 5 శాతం రిజర్వేషన్లనూ రద్దు చేశారు. ఇన్ని దుర్మార్గాలకు ఒడిగట్టిన ఆయనపై కాపుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ఓట్లాటకు తెరతీసి ‘కాపు నేస్తం’ ప్రకటించారు. అంటే, ఇది కూడా మనస్ఫూర్తిగా అమలు చేసింది కాదు. అందులోనూ నిబంధనల కొర్రీలు వేశారు. ఐదేళ్లలో ఆ పథకం కింద ఖర్చు చేసింది రూ.2 వేల కోట్లే. అధికారంలోకి వస్తే ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేవలం కాపుల అభివృద్ధికే ఖర్చు చేస్తానని చెప్పి ఆయన చేసిన దగా ఇది.
గత ప్రభుత్వంలో రూ.1,441 కోట్ల రుణాలు...
ఏ వర్గమైనా పేదరికం నుంచి బయటపడటానికి ఉపాధి కల్పనే కీలకం. ఉపాధి అవకాశాలు కల్పించడం లేదంటే.. వారి ఎదుగుదలకు అడ్డుతగులుతున్నట్టే. జగన్ సీఎం అయ్యాక కాపులకు ఇదే చేశారు. తెదేపా ప్రభుత్వం అన్ని వర్గాలతోపాటు కాపుల్లోని నిరుపేదలూ ముందుకు వెళ్లాలని వారికోసం కార్పొరేషన్ పెట్టింది. అందరికీ వర్తించే పథకాలను కాపులకు అమలు చేస్తూనే.. 2014-19 మధ్య కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకంగా రూ.4 వేల కోట్లు ఖర్చు చేసింది. తెదేపా హయాంలో కాపులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రాయితీతో రుణాలు మంజూరు చేసింది. అదనంగా బ్యాంకులతో మాట్లాడించి రుణాలు అందించింది. ఇలా 2.11 లక్షల మందికి రూ.1,441.75 కోట్ల మేర రాయితీ రుణాలను అందించారు. వైకాపా హయాంలోనూ ఈ పథకం కొనసాగి ఉంటే మరెందరికో మేలు జరిగేది. కానీ రాయితీ రుణాల్ని ఎత్తేశారు జగన్. పైకి మాత్రం కాపులకు గొప్ప మేలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆయన ఇచ్చిందేంటో తెలుసా? అందరికీ వర్తించే పింఛన్లు, ఉపకారవేతనాలు, ఇతర పథకాలు. వాటిలో ఉండే కాపుల సంఖ్యను పక్కకు తీసి.. పెద్ద సంఖ్యగా చూపించారు. జగన్కు మాత్రమే చేతనయ్యే అంకెల గారడీ ఇది.
‘విదేశీ విద్య’ అమలుకు మనసొప్పలేదు...
తమ బిడ్డల్ని రూ.లక్షలు పెట్టి గొప్ప చదువులు చదివించలేక ఇబ్బందిపడే తల్లిదండ్రులకు తెదేపా అమలు చేసిన ‘విదేశీ విద్య’ పథకం గొప్ప ఊరటగా నిలిచింది. కాపులకు దీన్ని అమలు చేసేందుకూ జగన్కు మనసొప్పలేదు. అధికారం చేపట్టిన తర్వాత మూడేళ్లపాటు ఈ పథకం అమలు ఊసే ఎత్తలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని వారిని మళ్లీ మభ్యపెట్టేందుకు ఎత్తుగడ వేశారు. సాయాన్ని పెంచి అమలు చేసినట్టు పైకి చూపిస్తూ.. అమల్లోకి వచ్చేసరికి కుయుక్తులు పన్నారు. తెదేపా ప్రభుత్వం ఈ పథకం కింద 1,892 మంది విద్యార్థులను విదేశాలకు పంపింది. అందుకు రూ.207 కోట్లు ఖర్చు చేసింది. అదే వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిన విధానాన్ని పరిశీలిస్తే... తొలుత 200 క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదిస్తేనే ఆర్థిక సాయాన్ని అందిస్తామని మోకాలొడ్డింది. ఆ తర్వాత నిబంధనల్ని మరింత కఠినతరం చేసి సబ్జెక్ట్ల అంశాన్ని తెరమీదకు తెచ్చి.. వాటిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాయాల్లో సీటు సంపాదిస్తేనే సాయాన్ని అందిస్తామనేలా అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వుల్లో మళ్లీ సవరణలు చేశారు. జగన్ ఏలుబడిలో ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులు 250 మంది కూడా లేరు. ఇంతకంటే వంచన ఎక్కడైనా ఉంటుందా?
నైపుణ్య శిక్షణనీ ఆపేశారు..
ప్రతిభ ఉన్నా సరైన నైపుణ్యం లేక వెనుకబడే యువత ఎంతో మంది ఉన్నారు. నైపుణ్య శిక్షణ అందిస్తే అలాంటివారి కెరీర్కు తిరుగుండదు. తెదేపా ప్రభుత్వం కాపుల పట్ల ఇదే ఆలోచన చేసింది. వారికి ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంది. ఎక్కడికక్కడ ప్రత్యేక నోటిఫికేషన్లు ఇచ్చి వారిని ప్రోత్సాహించింది. ఇలా 2014-19 మధ్య 40వేల మంది కాపు యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చింది. ఇందుకుగాను రూ.28.73 కోట్లు ఖర్చు చేసింది.
సూక్ష్మ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాదు.. ‘విద్యోన్నతి’ పథకం కింద సివిల్స్ పరీక్ష రాసేవారికి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని తెచ్చింది. దిల్లీ, ముంబయి, పుణె, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్.. ఇలా అభ్యర్థులు కోరుకున్న చోట శిక్షణ ఇప్పించింది. ఆ ఖర్చు మొత్తాన్ని అప్పటి ప్రభుత్వమే భరించింది. ఒక్కొక్క విద్యార్థిపై రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేసింది.
తెదేపా హయాంలో కాపులకు రిజర్వేషన్
దశాబ్దాలుగా నలిగిన కాపుల రిజర్వేషన్ కలకు తెదేపా ప్రభుత్వం దారి చూపింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇచ్చే 10 శాతంలో 5 శాతం రిజర్వేషన్లను వారికే కల్పించింది. దీన్ని కూడా జగన్ అధికారంలోకి రాగానే రద్దు చేశారు. ఆయన మంత్రివర్గంలో ఉండే కాపు వర్గానికి చెందిన సహచరులుగానీ, ఇతర వైకాపా నేతలుగానీ ఇప్పటివరకు దీనిపై జగన్ను ప్రశ్నించిన దాఖలాలే లేవు.
కాపు భవన నిర్మాణాలపైనా కన్నుకుట్టిన జగన్!
పేద, మధ్య తరగతికి చెందినవారు ఏదైనా శుభకార్యాన్ని చేసుకోవాలంటే చిన్న ఫంక్షన్ హాలైనా రోజుకు రూ.20 వేలకుపైనే చెల్లించాల్సిన దుస్థితి. అదే కాపు భవనాల్లో అయితే ఆ సామాజిక వర్గానికి పూర్తి ఉచితం. అందుకే భవనాల ఏర్పాటుకు తెదేపా ప్రభుత్వం అడుగులు వేసింది. ఇక్కడ శుభకార్యాలే కాకుండా సామాజిక వర్గ సమావేశాలు, సదస్సులు, ఇతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో రూ.145.15 కోట్లతో 500 మినీ కాపు భవనాల నిర్మాణం చేపట్టింది. వీటిని చూసి జగన్కు కన్నుకుట్టినట్టుంది. అందుకే చాలా చోట్ల వాటి నిర్మాణాలను మధ్యలోనే వదిలేశారు. వాటికి తెదేపా ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని వెనక్కి తీసుకున్నారు. దీనిపై కాపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో వైకాపా నేతల సిఫార్సుల మేరకు ఎన్నికల వేళ కొన్ని చోట్ల పనులు కొనసాగిస్తున్నారు.
తెదేపా ప్రభుత్వం కాపు యువతకు రుణాలివ్వడం వరకే ఆగిపోకుండా.. ఏ ఆదరువు లేని వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఆసక్తి ఉన్న వారికి డ్రైవింగ్ శిక్షణ ఇప్పించింది. ఖరీదైన ఎస్యూవీల కొనుగోళ్లనూ ప్రోత్సాహించింది. మొత్తంగా 284 మందికి రూ.21.30 కోట్ల మేర ఆర్థిక సాయం అందించింది. వీటితో లబ్ధిదారులు నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదించేవారు. పేదరికం నుంచి కుటుంబాన్ని బయటపడేసేందుకు ఇంతకంటే ఏం కావాలి? కానీ జగన్ ప్రభుత్వం ఇలాంటి ఆలోచనే చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపరన్న అభిప్రాయాన్ని ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తప్పని నిరూపించారు. -
నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం సందర్శించనున్నారు. -
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. -
అసలేం జరుగుతోంది?.. ఏఎన్యూ స్ట్రాంగ్రూం సమీపంలో నిఘా వర్గాల సమావేశం
పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్రూంల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. తిరుపతిలో స్ట్రాంగ్రూంను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే అధికారి అయిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. -
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
సుప్రీం చెప్పినా.. మేమెందుకు వింటాం!
‘‘ప్రతివాది సమర్పించిన ఫొటోల్లో తేదీలు, సమయం, అక్షాంశాలు, రేఖాంశాలు చూస్తే.. యంత్రాలతో ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించినప్పటికీ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయనేది ప్రాథమికంగా తెలుస్తోంది. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
జెన్కో థర్మల్ కేంద్రాలకు ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ బొగ్గు
పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) నుంచి హైగ్రేడ్ బొగ్గును జెన్కో తీసుకుంటోంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుకు ప్రత్యామ్నాయంగా కృష్ణపట్నం థర్మల్ యూనిట్లో వినియోగించనుంది. -
పర్యాటక సేవలు మరింత ఖరీదు!
పర్యాటకుల కోసం కొత్తగా అనేక అదనపు సౌకర్యాలు కల్పించి ఆకట్టుకోవాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. -
రాష్ట్ర పునర్విభజన అంశాలపై నివేదికలు రూపొందించండి
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. -
అసలైన ప్రజాసేవకుడు కాటన్
నాటి బ్రిటిష్ ప్రభుత్వం సహకరించకపోయినా.. పట్టుబట్టి గోదావరి డెల్టాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు అనువుగా ధవళేశ్వరం ఆనకట్ట, కాలువలు నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. -
పోలీసు వలయంలో పల్నాడు
రెండురోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న పల్నాడు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. -
ఆ నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక బలగాలు
పోలింగ్ తర్వాత హింస చెలరేగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
పోలింగ్ తర్వాత.. నిప్పు రాజేస్తోందెవరు?
పోలింగ్ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండను నియంత్రించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
సంక్షిప్త వార్తలు (8)
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ వెబ్ అప్లికేషన్ సామర్థ్యం పెంచడానికి ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) షెడ్యూల్ ప్రకటించిందని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
117 నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే పోస్టల్ బ్యాలట్లతో కలిపి 2.09% పెరిగింది. మొత్తం 3.33 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయింది. -
15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
రాష్ట్రంలో 15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఒంగోలు లోక్సభ పరిధిలో 87.06% మంది ఓటర్లు కదం తొక్కారు. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు