14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు.
మాచర్ల, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి తదితర చోట్ల...
పలుచోట్ల స్వతంత్రులకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తు మార్చాం
సీఈవో ముకేశ్కుమార్ మీనా
ఈనాడు, అమరావతి: అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, పీలేరు, పుంగనూరు, పలమనేరు, రాయచోటి, తంబళ్లపల్లె, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో వెబ్కాస్టింగ్తో పాటు కేంద్ర భద్రతా బలగాల్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామన్నారు. శాసనసభకు పోటీచేస్తున్న 374 మంది అభ్యర్థులు, లోక్సభకు పోటీచేస్తున్న 64 మంది అభ్యర్థులకు వారికున్న ముప్పు ఆధారంగా శుక్రవారం నుంచి భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఉండగా... వాటిలో 12,438 సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, 29,897 పోలింగ్ కేంద్రాల్లో (64%) వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వ లోగోతో జారీచేసిన ప్రకటన నిలిపేయాలని వైకాపాను ఆదేశించామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 7 లోక్సభ, 8 శాసనసభ నియోజకవర్గాల స్వతంత్రులకు కేటాయించిన ‘గాజు గ్లాసు’ గుర్తును మార్చి వేరేది కేటాయించామన్నారు.
రాష్ట్ర సరిహద్దుల్లో ర్యాండమ్గానే తనిఖీలు
- ‘‘రాష్ట్ర సరిహద్దుల్లో ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయరు. ర్యాండమ్గా తనిఖీలు చేస్తారు. ఈ క్రమంలో గోవా తదితర రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం వచ్చి ఉండొచ్చు. చెక్పోస్టులు ఏర్పాటుచేయక ముందే తీసుకొచ్చి ఇక్కడ డంప్లు పెట్టుకుని ఉండొచ్చు’’ అని ఒక ప్రశ్నకు మీనా సమాధానమిచ్చారు.
- పోస్టల్ బ్యాలట్ సమర్పించే గడువు ముగిసేందుకు కొన్ని గంటల ముందు కొందరికి పోలింగ్ విధులు కేటాయించారని, వారికి పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని ప్రశ్నించగా.. అలాంటి వారందరికీ అవకాశం కల్పిస్తామన్నారు.
- రాష్ట్రవ్యాప్తంగా హోమ్ ఓటింగ్కు 7.28 లక్షల మంది అర్హులు ఉండగా.. 28,500 మంది మాత్రమే అందుకు సమ్మతి ఇచ్చారన్నారు.
- మార్చి 16 నుంచి ఇప్పటివరకూ రూ.203.80 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, విలువైన వస్తువులు, ప్రలోభపరిచే వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. అందులో రూ.47 కోట్ల నగదు. రూ.28.83 కోట్ల విలువైన మద్యం, రూ.3.65 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు ఉన్నాయి.
ఉద్యోగ సంఘాలు ప్రభావితం చేయకూడదు
‘‘ఉద్యోగ సంఘాలు... వారి సమావేశాల్లో ఏదైనా పార్టీకి, అభ్యర్థికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ప్రకటనలివ్వకూడదు. తద్వారా ఉద్యోగులు, ఇతరుల అభిప్రాయాల్ని ప్రభావితం చేయకూడదు. అలాంటి చర్యలకు పాల్పడితే అది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే. బాధ్యులపై ఐపీసీతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి’’ అని సీఈఓ ముకేశ్కుమార్ మీనా.. అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వ్యక్తిగత ప్రతిష్ఠ, నైతికత దెబ్బతీసేలా ఉద్యోగ సంఘాల వారు దురుద్దేశపూరిత, నిందాపూర్వక ప్రకటనలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధన ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దీని కోసం ఉద్యోగ సంఘాల కార్యక్రమాల్ని వీడియోగ్రఫీ చేయించి.. సునిశితంగా పర్యవేక్షించాలని పేర్కొన్నారు.‘‘సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నియమావళే అఖిలభారత సర్వీసు అధికారులకూ వర్తిస్తుంది. వీటి ప్రకారం రాజకీయ ఉద్యమంలో భాగస్వాములు కాకూడదు’’ అని తెలిపారు. వివిధ పార్టీలు, అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వివరించారు.
పులివెందుల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయరా?
అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల ఒకటి. సీఈఓ ప్రకటించిన 14 నియోజకవర్గాల జాబితాలో పులివెందుల పేరు లేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అక్కడ అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి.
పింఛన్ల వ్యవహారం ‘పరిష్కారమైపోయిన అంశం’!
దీని భావమేమి?
విలేకర్ల సమావేశంలో పింఛన్ల వ్యవహారం చర్చకు వచ్చినప్పుడు.. ‘ఎన్నికల సంఘం దృష్టిలో ఇది పరిష్కారమైపోయిన అంశమని’ సీఈఓ ముకేశ్కుమార్ మీనా అన్నారు. దీనిపై తాను ఎలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయదలచుకోలేదని ఆయన తెలిపారు. అయితే.. లక్షలమంది పింఛనుదారులు మండుటెండల్లో మలమల మాడిపోతుంటే... అది ఎన్నికల సంఘానికి కనిపించట్లేదనుకోవాలా? వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, అభాగ్యులు అత్యంత దయనీయ పరిస్థితుల మధ్య బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నరకయాతన అనుభవిస్తుంటే అది పట్టదా? పింఛను కోసం వెళ్లి గత రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం చూసి కూడా.. పింఛన్ల వ్యవహారం పరిష్కారమైపోయిన అంశమని ఎలా చెబుతారు? లబ్ధిదారుల్ని కష్టాలు పెట్టటమే పరిష్కారమైపోవడమా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపరన్న అభిప్రాయాన్ని ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తప్పని నిరూపించారు. -
నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం సందర్శించనున్నారు. -
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. -
అసలేం జరుగుతోంది?.. ఏఎన్యూ స్ట్రాంగ్రూం సమీపంలో నిఘా వర్గాల సమావేశం
పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్రూంల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. తిరుపతిలో స్ట్రాంగ్రూంను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే అధికారి అయిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. -
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
సుప్రీం చెప్పినా.. మేమెందుకు వింటాం!
‘‘ప్రతివాది సమర్పించిన ఫొటోల్లో తేదీలు, సమయం, అక్షాంశాలు, రేఖాంశాలు చూస్తే.. యంత్రాలతో ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించినప్పటికీ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయనేది ప్రాథమికంగా తెలుస్తోంది. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
జెన్కో థర్మల్ కేంద్రాలకు ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ బొగ్గు
పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) నుంచి హైగ్రేడ్ బొగ్గును జెన్కో తీసుకుంటోంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుకు ప్రత్యామ్నాయంగా కృష్ణపట్నం థర్మల్ యూనిట్లో వినియోగించనుంది. -
పర్యాటక సేవలు మరింత ఖరీదు!
పర్యాటకుల కోసం కొత్తగా అనేక అదనపు సౌకర్యాలు కల్పించి ఆకట్టుకోవాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. -
రాష్ట్ర పునర్విభజన అంశాలపై నివేదికలు రూపొందించండి
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. -
అసలైన ప్రజాసేవకుడు కాటన్
నాటి బ్రిటిష్ ప్రభుత్వం సహకరించకపోయినా.. పట్టుబట్టి గోదావరి డెల్టాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు అనువుగా ధవళేశ్వరం ఆనకట్ట, కాలువలు నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. -
పోలీసు వలయంలో పల్నాడు
రెండురోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న పల్నాడు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. -
ఆ నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక బలగాలు
పోలింగ్ తర్వాత హింస చెలరేగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
పోలింగ్ తర్వాత.. నిప్పు రాజేస్తోందెవరు?
పోలింగ్ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండను నియంత్రించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
సంక్షిప్త వార్తలు (8)
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ వెబ్ అప్లికేషన్ సామర్థ్యం పెంచడానికి ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) షెడ్యూల్ ప్రకటించిందని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
117 నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే పోస్టల్ బ్యాలట్లతో కలిపి 2.09% పెరిగింది. మొత్తం 3.33 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయింది. -
15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
రాష్ట్రంలో 15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఒంగోలు లోక్సభ పరిధిలో 87.06% మంది ఓటర్లు కదం తొక్కారు. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!