Domestic Airports: దేశీయ విమానాశ్రయాలకు రూ.11,000 కోట్ల లాభం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) దేశీయ విమానాశ్రయాలు 1.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11000 కోట్ల) పన్ను ముందు లాభాన్ని నమోదు చేసే అవకాశం ఉందని సీఏపీఏ (కాపా) ఇండియా అంచనా వేసింది.
2024-25పై కాపా ఇండియా అంచనా
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) దేశీయ విమానాశ్రయాలు 1.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11000 కోట్ల) పన్ను ముందు లాభాన్ని నమోదు చేసే అవకాశం ఉందని సీఏపీఏ (కాపా) ఇండియా అంచనా వేసింది. ఆయా సంస్థలు ఒక్కో ప్రయాణికుడిపై రూ.256.10 (3.1 డాలర్లు) మేర లాభం పొందచ్చని ఇక్కడ జరిగిన విమానయాన సదస్సులో కాపా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ 40.49 కోట్లకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వీరిలో 81.1% మంది దేశీయ ప్రయాణికులు కాగా.. 18.9% మంది అంతర్జాతీయ ప్రయాణికులని వెల్లడించింది. 2024-25లో దేశీయ విమానాశ్రయ సంస్థల మొత్తం ఆదాయం రూ.35,980 కోట్లుగా నమోదయ్యే అవకాశం ఉందని, 2024-24తో పోలిస్తే ఇది 14.8% ఎక్కువ అని పేర్కొంది. మెట్రో, నాన్ మెట్రో నగరాల్లో విమానయాన మౌలిక వసతులకు డిమాండు పెరుగుతోందని, ఇందుకోసం ప్రస్తుతం 11 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని కాపా ఇండియా తెలిపింది.
2023-24, 2024-25్చలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) లాభదాయకత కూడా మెరుగ్గానే నమోదు కావొచ్చని తెలిపింది. ప్రయాణికుల రద్దీ పెరగడం, ఇటీవల ప్రైవేటీకరించిన 6 విమానాశ్రయాల ద్వారా లభించే ఆదాయ వాటా వల్ల ఏఏఐ ఆదాయం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
బెంగళూరు- లండన్ గాట్విక్కు ఎయిరిండియా నాన్స్టాప్ సర్వీసు
బెంగళూరు: బెంగళూరు- లండన్ గాట్విక్ మధ్య ఆగస్టు 18 నుంచి నాన్ స్టాప్ విమాన సర్వీసులను ఎయిరిండియా ప్రారంభించనుందని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్) తెలిపింది. ఈ మార్గంలో వారంలో 5 విమాన సర్వీసులు ఉంటాయని, తద్వారా వ్యాపార, పర్యాటక ప్రయాణికులకు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని పేర్కొంది. లండన్లోని రెండు పెద్ద విమానాశ్రయాలు- హీత్రో, గాట్విక్కు నేరుగా విమాన సౌకర్యం అందుబాటులోకి వస్తున్న ఏకైక భారతీయ నగరంగా బెంగళూరు నిలుస్తుందని తెలిపింది. భారత్, బ్రిటన్ మధ్య ఆర్థిక, సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ పరిణామం ఉపయోగపడుతుందని పేర్కొంది. బెంగళూరు- లండన్ గాట్విక్ మార్గంలో విమాన సర్వీసు కోసం బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలను ఎయిరిండియా వాడనుంది. ఈ విమానంలో బిజినెస్ క్లాస్లో 18 ఫ్లాట్ బెడ్స్, ఎకనామీ క్లాస్లో 238 విశాల సీట్లు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?