SIM: తప్పుడు ధ్రువీకరణలతో 21లక్షల సిమ్కార్డులు.. రద్దుకు డీవోటీ చర్యలు..!
దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో తప్పుడు సిమ్కార్డులను ఏరివేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. 21 లక్షల సిమ్కార్డులు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించింది.
ఇంటర్నెట్డెస్క్: దేశ వ్యాప్తంగా తప్పుడు ప్రూఫ్ల ఆధారంగా సుమారు 21 లక్షల సిమ్కార్డులు జారీ అయినట్లు తమ విశ్లేషణలో తేలిందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలిపింది. ఈ మేరకు ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, జియో, వొడాఫోన్ సంస్థలకు అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది. కొన్ని అనుమానాస్పద నంబర్ల జాబితాను విడుదల చేసి చేసి వాటి పత్రాలను తక్షణమే రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశించినట్లు చెబుతోంది. ఒక వేళ అవి బోగస్ ప్రూఫ్లని తేలితే సిమ్లను రద్దు చేయాలని పేర్కొంది.
సంచార్ సాతీ కార్యక్రమం కింద దేశ వ్యాప్తంగా 114 కోట్ల మొబైల్ కనెక్షన్లను డీవోటీకి చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ విభాగం విశ్లేషించింది. వీటిల్లో 21 లక్షల సిమ్కార్డులను యాక్టివేట్ చేసుకోవడానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించినట్లు గుర్తించింది. వీటిలో చాలా సిమ్లను సైబర్ నేరాలకు వాడుతున్నట్లు అనుమానిస్తోంది. ఇవి నిరూపితమైతే ఆ సిమ్ కార్డును రద్దు చేయడంతోపాటు.. దానిని వినియోగించిన ఫోన్ను కూడా పనిచేయకుండా చేస్తామని ఏఐ అండ్ డీఐయూ డైరెక్టర్ జనరల్ ముఖేశ్ మంగళ్ వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా 1.92 కోట్ల మంది తొమ్మిది సిమ్కార్డుల పరిమితికి మించి కనెక్షన్లు తీసుకొన్నారు. వీరిలో చాలా మంది సర్వీసు ప్రొవైడర్లకు ఇచ్చిన డేటాలో చాలా తప్పులున్నాయి. ప్రజలకు తెలియకుండా వారిపేరిట తీసుకొనే సిమ్కార్డులను గుర్తించి వాటిని రద్దు చేయించడానికి సంచార్ సాతీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ నెంబర్లపై దర్యాప్తు సహా ఇతర చర్యలకు డీవోటీ ఇప్పటికే సర్వీసు ప్రొవైడర్లకు డెడ్లైన్ విధించింది. వీటిని పూర్తి చేసే క్రమంలో భారీ సంఖ్యలో సిమ్కార్డులు డిస్కనెక్ట్ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ మొత్తం ఆపరేషన్లో ఏఐ అండ్ డీఐయూ సంస్థ ఇతర చట్ట సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటి వరకు 1.8లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను పనిచేయకుండా చేశామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడు డీజీపీ శంకర్ జివాల్ మాట్లాడుతూ 90శాతం సైబర్ నేరాలకు తప్పుడు సిమ్కార్డులనే వాడుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు తమను ట్రాక్ చేయడానికి వీల్లేకుండా వారు వీటిని వినియోగిసున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంధన కంపెనీలకు లాభాలే లాభాలు!
ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)లు 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.81,000 కోట్ల భారీ లాభాలు ఆర్జించాయి. -
2024-25లో అదానీ ఎంటర్ప్రైజెస్
అదానీ ఎంటర్ప్రైజెస్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ డిప్యూటీ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్ఓ) సౌరభ్ షా వెల్లడించారు. -
లాభాలు రావొచ్చు కానీ..
గత వారంలో కొద్ది రోజుల పాటు నష్టపోయిన సూచీలు ఈ వారం తిరిగి పుంజుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు అప్రమత్తతతో పాటు విదేశీ మదుపర్లు స్థిరంగా విక్రయాలు జరుపుతుండడం వల్ల లాభాలు పరిమితంగానే కనిపించొచ్చని అంటున్నారు. -
పసుపు ప్రతికూలమే!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.73,460 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.74,193, రూ.75,499 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
71,816 దిగువన దిద్దుబాటు!
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ గత వారం మన మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అంచనాలపై అనిశ్చితి, కంపెనీలు ప్రకటించిన ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపర్చడం ఇందుకు కారణమయ్యాయి. -
నియామకాల్లో 85% ఇంజినీరింగ్ పట్టభద్రులకే
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశీయ అతి పెద్ద బ్యాంక్ ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో చేరబోయే 12,000 మంది తాజా ఉత్తీర్ణుల్లో 85 శాతం మంది ఇంజినీరింగ్ పట్టభద్రులే ఉంటారని బ్యాంక్ ఛైర్మన్ దినేశ్ ఖరా వెల్లడించారు. -
భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యంలో అమెరికాను వెనక్కినెట్టిన చైనా
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో భారత్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. తద్వారా ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కినెట్టింది. -
సీఎన్జీ కార్ల అమ్మకాలు 30 శాతానికి పైగా పెరగొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) తమ సీఎన్జీ కార్ల అమ్మకాలు 30 శాతానికి పైగా పెరిగి 6 లక్షల వాహనాలుగా నమోదయ్యే అవకాశం ఉందని మారుతీ సుజుకీ అంచనా వేస్తోంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమాన సేవల పునరుద్ధరణ
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తన విమాన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తోంది. రద్దయిన విమానాల సంఖ్య ఆదివారం నాటికి 20కి తగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల రక్షణశాఖ మంత్రి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
-
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
-
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్