Ramky infra: 75% పెరిగిన రాంకీ ఇన్ఫ్రా లాభం
మౌలిక సదుపాయాల కల్పన సంస్థ రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది.
గల్ఫ్ దేశాల్లో కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నాలు
ఈనాడు, హైదరాబాద్: మౌలిక సదుపాయాల కల్పన సంస్థ రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి స్టాండలోన్ ఖాతాల ప్రకారం ఈ సంస్థ రూ.548 కోట్ల ఆదాయం, రూ.84 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.12 ఉంది. 2022-23 ఇదే కాలంలో ఆదాయం రూ.441 కోట్లు, నికరలాభం రూ.48 కోట్లు, ఈపీఎస్ రూ.7 ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయం 24%, నికరలాభం 75% పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి రూ.2,033 కోట్ల ఆదాయం, రూ.360 కోట్ల నికరలాభం, రూ.52 ఈపీఎస్ను సంస్థ నమోదు చేసింది. 2022-23లో ఆదాయం రూ.1,474 కోట్లు, నికరలాభం రూ.214 కోట్లు, ఈపీఎస్ రూ.31 ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 38%, నికరలాభం 68% పెరిగాయి.
ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,161 కోట్ల ఆదాయం, రూ.321 కోట్ల నికర లాభం, రూ.44.48 ఈపీఎస్ నమోదు చేసింది.
రూ.9,300 కోట్ల ఆర్డర్ బుక్: కంపెనీ చేతిలో ప్రస్తుతం రూ.9,300 కోట్ల ఆర్డర్లు ఉన్నట్లు ఎండీ వై.ఆర్.నాగరాజ, సీఎఫ్ఓ ఎన్.ఎస్.రావు బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇటీవల వ్యాపార పరమైన అడ్డంకులు, నగదు లభ్యత సమస్యలు ఎదురైనా, వాటిని అధిగమించి మెరుగైన ఫలితాలు సాధించినట్లు వివరించారు. కంపెనీకి ఉన్న అప్పు చాలా వరకూ తీర్చినట్లు, ఇకపై స్థిరమైన వృద్ధి సాధించే దిశగా ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఔషధ పార్కుల ఏర్పాటుకు..: ప్రధానంగా పారిశ్రామిక, అర్బన్ ఇన్ఫ్రా ప్రాజెక్టులపై దృష్టి సారించినట్లు, ఈ విభాగంలో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వై.ఆర్.నాగరాజ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఔషధ పార్కులు ఏర్పాటు చేసే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు రూ.1,000 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల విలువైన పర్యావరణ ప్రాజెక్టులను సంయుక్త భాగస్వాములతో కలిసి చేపట్టేందుకు సన్నద్ధం అవుతున్నామన్నారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల కోసం వచ్చే ఆరు నెలల వ్యవధిలో రూ.280 కోట్ల రుణం సమీకరించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో ఉన్న ఆర్డర్లు, ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే మూడు నుంచి అయిదేళ్ల పాటు మెరుగైన ఆదాయాలు సాధించే అవకాశం ఉందని స్పష్టమవుతుందన్నారు.
65% తగ్గిన టాటా స్టీల్ లాభం
డివిడెండ్ 360%
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో టాటా స్టీల్ రూ.554.56 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.1,566.24 కోట్లతో పోలిస్తే ఇది 64.59% తక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం కూడా రూ.63,131.08 కోట్ల నుంచి రూ.58,863.22 కోట్లకు తగ్గింది. వ్యయాలూ రూ.59,918.15 కోట్ల నుంచి రూ.56,496.88 కోట్లకు పరిమితమయ్యాయి.
రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.3.60 (360%) డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.
రూ.3,000 కోట్ల నిధుల సమీకరణ: ప్రైవేటు ప్లేస్మెంట్ ప్రాతిపదికన మార్పిడి రహిత డిబెంచర్ల (ఎన్సీడీల)ను జారీ చేయడం ద్వారా రూ.3,000 కోట్ల వరకు నిధుల్ని సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. విదేశీ అనుబంధ సంస్థ టి స్టీల్ హోల్డింగ్స్ ప్రై.లి (టీఎస్హెచ్పీ)లోకి ఈక్విటీ షేర్ల సబ్స్క్రిప్షన్ ద్వారా 2.11 బిలియన్ డాలర్ల (సుమారు రూ.17,407.50 కోట్లు) నిధులను ఒకటి లేదా అనేక దశల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో చొప్పించేందుకు బోర్డు అనుమతి ఇచ్చింది.
హెరిటేజ్ ఫుడ్స్ డివిడెండ్ 50%
ఈనాడు, హైదరాబాద్: హెరిటేజ్ ఫుడ్స్, ఏకీకృత ఖాతాల ప్రకారం మార్చి త్రైమాసికానికి రూ.950 కోట్ల ఆదాయాన్ని, రూ.40 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదేకాలంతో పోల్చితే ఆదాయం 16.3%, నికరలాభం 126.3% పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి రూ.3,793 కోట్ల ఆదాయాన్ని, రూ.106 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23తో పోల్చితే ఆదాయం 17.1%, నికరలాభం 83.6% పెరిగాయి. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.2.50 చొప్పున (50%) డివిడెండ్ చెల్లించాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది. కంపెనీ వాటాదార్ల వార్షిక సమావేశాన్ని (ఏజీఎం) ఆగస్టు 21న నిర్వహించనున్నారు. పాల సేకరణ, అమ్మకాలు సమీక్షా త్రైమాసికంలో పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. విలువ జతచేర్చిన ఉత్పత్తుల అమ్మకాల్లో 21.82% వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. కొంతకాలంగా తాము అమలు చేసిన విధానాలు ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాహ్మణి నారా అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి