Tata Motors: నేపాల్‌లో మేడిన్‌ ఇండియా టాటా ఏస్‌ ఈవీ లాంచ్

టాటా మోటార్స్‌ నేపాల్‌లో ‘ఏస్‌’ ఎలక్ట్రికల్‌ వాహనాన్ని విడుదల చేసింది.

Published : 22 Sep 2023 17:40 IST

ప్రముఖ వాణిజ్య వాహన తయారీదారు టాటా మోటార్స్‌ కొత్త ‘ఏస్‌’ ఈవీని నేపాల్‌లో విడుదల చేసింది. ‘ఏస్‌’ ఈవీ మొదట భారత మార్కెట్‌లో 2022 మేలో లాంచ్‌ చేసింది. తాజాగా నేపాల్‌లో ఏస్‌ ఈవీని ప్రారంభించడం ద్వారా ప్రపంచ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చినట్లయ్యిందని కంపెనీ పేర్కొంది. ఏస్‌ ఈవీ పరిచయం ద్వారా నేపాల్‌లో జీరో-ఎమిషన్‌ కార్గో మొబిలిటీని అందించే ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందని టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వెహికల్‌ బిజినెస్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ హెడ్‌ అనురాగ్‌ మెహత్రా తెలిపారు. ఒకసారి పూర్తి ఛార్జింగ్‌తో 154 కి.మీ. ప్రయాణిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని