Adani Group: రూ.29,100 కోట్ల సమీకరణలో అదానీ గ్రూప్
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ భారీగా నిధుల వేటలో పడింది. గ్రూప్లో ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్లో వాటా విక్రయం ద్వారా రూ.16,600 కోట్లు (దాదాపు 2 బిలియన్ డాలర్లు) సమీకరించడానికి మంగళవారం బోర్డు ఆమోదం తెలిపింది.
అదానీ ఎంటర్ప్రైజెస్ వాటా అమ్మకంతోనే రూ.16,600 కోట్లు
దిల్లీ: గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ భారీగా నిధుల వేటలో పడింది. గ్రూప్లో ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్లో వాటా విక్రయం ద్వారా రూ.16,600 కోట్లు (దాదాపు 2 బిలియన్ డాలర్లు) సమీకరించడానికి మంగళవారం బోర్డు ఆమోదం తెలిపింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ బోర్డు కూడా క్యూఐపీ లేదా ఇతర పద్ధతుల ద్వారా రూ.12,500 కోట్ల మేర నిధులను సమీకరించడానికి సోమవారం అనుమతి తెలపడం గమనార్హం. ఈ రెండు కలిపి రూ.29,100 కోట్లు అవుతుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశల్లో నిధుల సమీకరణ జరుగుతుందని స్టాక్ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ఇందుకోసం ఇరు కంపెనీలు తమ వాటాదార్ల నుంచి ఆమోదం సహా ఇతర అనుమతులూ పొందాల్సి ఉంది. నిధుల సమీకరణకు ఆమోదం పొందేందుకు జూన్ 24న అదానీ ఎంటర్ప్రైజెస్ వాటాదార్ల సమావేశం ఏర్పాటు చేయనుంది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ తన వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్)ను ఆ తర్వాతి రోజు నిర్వహించనుంది.
గతంలోనే అనుమతులు
2023లోనే ఈ కంపెనీలు నిధుల సమీకరణకు అనుమతులు పొందినా.. జూన్లో వాటికి గడువు తీరనుండడంతో, మళ్లీ అనుమతుల అవసరం వచ్చింది. అర్హత గల సంస్థాగత మదుపర్ల(క్యూఐపీ)కు షేర్ల కేటాయింపు ద్వారా రూ.12500 కోట్ల సమీకరణకు 2023 మేలో అదానీ ఎంటర్ప్రైజెస్ బోర్డు అనుమతి తెలిపింది. క్యూఐపీ ద్వారా రూ.8500 కోట్ల సమీకరణకు అదే నెలలో అదానీ ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్స్ బోర్డు కూడా అనుమతి ఇచ్చింది. అదానీ కుటుంబానికి అదానీ ఎంటర్ప్రైజెస్లో 72.61% వాటా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్లో 73.22% వాటాలున్నాయి.
ఎట్టకేలకు..
గతేడాది హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికతో వచ్చిన ఇబ్బందుల నుంచి బయటపడిన నేపథ్యంలో అదానీ గ్రూప్ నిధుల సమీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఆ సమయంలో అదానీ గ్రూప్ షేర్లు డీలా పడడంతో 150 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ విలువను కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు గ్రూప్నకు చెందిన 10 నమోదిత కంపెనీల్లో నాలుగు, హిండెన్బర్గ్ నివేదికకు ముందు స్థాయిలకు చేరాయి. గౌతమ్ అదానీ నికర విలువ ఈ ఏడాదిలో 25 బిలియన్ డాలర్ల మేర పెరిగి 109 బి. డాలర్లకు చేరడం విశేషమే. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో అదానీ 13వ స్థానంలో ఉన్నారు. ముకేశ్ అంబానీ(114 బి. డాలర్లు) కంటే ఒక స్థానం దిగువన ఉన్నారు. హిండెన్బర్గ్ నివేదికకు ముందు ఎఫ్పీఓ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల మేర సమీకరించడానికి ప్రణాళికలు రచించుకున్నా.. నివేదిక ప్రభావంతో వాటిని విరమించుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ