Amazon-Flipkart: మరో బిగ్ సేల్కు సిద్ధమైన అమెజాన్, ఫ్లిప్కార్ట్.. డిస్కౌంట్స్ వీటిపైనే!
రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు భారీ ఆఫర్లతో సేల్ను ప్రారంభించనున్నాయి. మరి, ఏ సంస్థ వేటిపై ఎంతెంత ఆఫర్లు ప్రకటించాయి? సేల్స్ ఎప్పటి నుంచి ప్రారంభంకానున్నాయనే వివరాలివే.
ఇంటర్నెట్ డెస్క్: ఈ-కామర్స్ (e-commerce) దిగ్గజాలు అమెజాన్ (Amazon), ఫ్లిప్కార్ట్ (Flipkart) మరోసారి భారీ ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రెండు సంస్థలూ పోటాపోటీగా సేల్స్ ఆపర్లు ప్రకటించాయి. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ (Great Republic Day Sale) పేరిట అమెజాన్ సేల్ నిర్వహించనుండగా, ‘బిగ్ సేవింగ్ డేస్’ (Big Saving Days)పేరుతో ఫ్లిప్కార్ట్ సేల్ను ప్రారంభించనుంది. ఈ మేరకు రెండు సంస్థలు సేల్స్ వివరాలను వెల్లడించాయి.
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్
అమెజాన్ సేల్ జనవరి 17 నుంచి జనవరి 20 వరకు కొనసాగనుంది. ఇందులో అమెజాన్ మొబైల్ఫోన్లు, ఫోన్ యాక్ససరీలు, స్మార్ట్వాచ్, ల్యాప్టాప్ వంటి వాటితోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందివ్వనుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 10 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్లో బడ్జెట్ బజార్, బ్లాక్బస్టర్ డీల్స్, ప్రీ-బుకింగ్, 8PM డీల్స్ కూడా ఉంటాయని అమెజాన్ తెలిపింది. ప్రైమ్ సబ్స్క్రైబర్లు ఒకరోజు ముందుగానే, అంటే జనవరి 16 నుంచి ఈ సేల్లో పాల్గొనవచ్చు. వీటితోపాటు ఒప్పో, షావోమి, వన్ప్లస్, శాంసంగ్, యాపిల్, వివోతోపాటు మరికొన్ని మొబైల్ బ్రాండ్లపై భారీగా డిస్కౌంట్ అందివ్వనుంది.
బిగ్ సేవింగ్ డేస్
ఇక ఫ్లిప్కార్ట్ సేల్ జనవరి 15 నుంచి జనవరి 20 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్, హోమ్ అప్లయెన్సెస్, కిచెన్ యాక్ససరీస్, లైఫ్స్టైల్ ఉత్పత్తులపై ఆఫర్లు ఇస్తోంది. ఇందుకోసం ఫ్లిప్కార్ట్ ప్రత్యేకంగా మైక్రోసైట్ను ప్రారంభించింది. ఫ్లిప్కార్ట్ ప్లస్ సబ్స్క్రైబర్లు ఒక రోజు ముందుగా జనవరి 14 నుంచి సేల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఈ సేల్లో ఐసీఐసీఐ, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 10 శాతం, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఐదు శాతం, ఫ్లిప్కార్ట్ పే ద్వారా చెల్లింపులు చేసిన వారికి ₹ 1,000 విలువైన రిటర్న్ గిఫ్ట్ కార్డ్ను ఇస్తోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం, గృహోపకరణాలపై 75 శాతం, దుస్తులపై 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ మైక్రోసైట్లో పేర్కొంది. మొబైల్ఫోన్లపై ఎంత డిస్కౌంట్ ఇస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?