Anant-Radhika: అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్.. ఈ విశేషాలు తెలుసా..!
మొదటిసారి స్టార్ గాయని రిహన్నా భారత్కు రానున్నారు. వంతారా స్పెషల్ అట్రాక్షన్గా మారనుంది. ఇలా అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో విశేషాలెన్నో..!
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచమంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి.. ! అన్నట్టుగా భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో వివాహ వేడుకల హడావుడి మొదలైంది. దేశ, విదేశీ ప్రముఖులు దీనికి హాజరవుతుండటంతో మూడు రోజుల పాటు జరగనున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలు టాక్ ఆఫ్ ది ఇంటర్నేషనల్గా మారిపోయాయి. అంబరాన్నంటనున్న ఈ సంబరాల్లోని ప్రత్యేకతలేంటో చూద్దామా..?
- ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani) జులైలో రాధికా మర్చంట్(Radhika Merchant)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి మూడు రోజులపాటు జరగనున్న ప్రీవెడ్డింగ్ వేడుకలకు గుజరాత్లోని జామ్నగర్(Jamnagar) వేదికైంది. ఇందుకోసం అతిథులకు 9 పేజీల ఈవెంట్ గైడ్ను నిర్వాహకులు పంపించారట. వారిని తీసుకువెళ్లేందుకు మార్చి ఒకటి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ముంబయి, దిల్లీ నుంచి జామ్నగర్కు ఛార్టర్డ్ ఫ్లైట్స్ నడపనున్నారు. లగేజ్, డ్రెస్కోడ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. అలాగే వైద్యసేవలు, డైట్కు తగ్గ ఫుడ్ అందుబాటులో ఉండనుంది. జామ్నగర్లో 5 స్టార్ హోటళ్లు లేకపోవడంతో.. అల్ట్రా- లగ్జరీ టెంట్లను ఏర్పాటుచేస్తున్నారు. అతిధుల కోసం ఏర్పాటుచేసే ఈ టెంట్ల్లో టైల్డ్ బాత్రూమ్లు సహా సర్వసదుపాయాలు ఉంటాయి.
- ఈ మూడు రోజులు పాటలు, నృత్యాలతో ఆ వేదిక హోరెత్తనుంది. గ్లోబల్ పాప్ స్టార్ రిహన్నాతో పాటు దిల్జీత్ దోసాన్జ్, ఇతర గాయకులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇందుకోసం రిహన్నా మొదటిసారి భారత్కు రానున్నారు.
- జామ్నగర్ టౌన్షిప్ కాంప్లెక్స్లో హస్తాక్షర్ (సంతకాలు) పేరిట ఒక సంప్రదాయ కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత వారసత్వ సంప్రదాయాన్ని ప్రతిబింబించే దుస్తుల్లో ఇది జరగనుంది. ఆ నగరంలో దేశ సంస్కృతీసంప్రదాయాలకు అనుగుణంగా పలు ఆలయాల నిర్మాణానికి అంబానీ కుటుంబం సహకరించింది. గతంలో ముకేశ్ సతీమణి నీతూ అంబానీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఆమె ఈ ప్రాంతాన్ని సందర్శించారు.
- కొన్ని దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న చర్యల ఫలితాన్ని అతిథులు ఆస్వాదించనున్నారు. అలాగే అనంత్ అంబానీ ప్రారంభించిన వంతారా ప్రోగ్రామ్ కింద జంతు సంరక్షణ, పునరావాసం కోసం చేపడుతున్న పనులను వీక్షించనున్నారు. మూగజీవుల్లో దైవాన్ని చూసే అనంత్ హృదయమే వంతారాకు పునాది వేసింది. అక్కడ రెండు వేలకు పైగా జంతువులు ఉన్నాయి.
- అనంత్.. రిలయన్స్ గ్రూప్లోని న్యూఎనర్జీ విభాగం బాధ్యతలు చూస్తున్నారు. ఇందులోభాగంగా ఎక్కువ సమయం ఆయన అక్కడే ఉంటున్నారని గతంలో ఓసారి ముకేశ్ అన్నారు. ఆ వేదికే ఇప్పుడు ప్రపంచస్థాయి అతిథులకు ఆతిథ్యం ఇవ్వనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం