Apple: భారత్లో రెండో యాపిల్ స్టోర్ను ప్రారంభించిన టిమ్ కుక్
Apple: స్టోర్ల ప్రారంభం నిమిత్తం ఏప్రిల్ 17నే భారత్కు చేరుకున్న టిమ్ కుక్ మంగళవారం యాపిల్ బీకేసీని ప్రారంభించారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. నేడు దిల్లీలో రెండో స్టోర్ను తెరిచి వినియోగదారులకు స్వాగతం పలికారు.
దిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం యాపిల్ (Apple) భారత్లో రెండో అధీకృత విక్రయశాలను గురువారం ప్రారంభించింది. సీఈఓ టిమ్ కుక్ (Tim Cook), సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేడ్రే బ్రియాన్తో కలిసి వినియోగదార్లకు స్వాగతం తెలిపారు. కుక్తో సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్లు తీసుకునేందుకు కస్టమర్లు పోటీ పడ్డారు. ముంబయిలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో యాపిల్ బీకేసీ (Apple BKC) పేరిట తొలి స్టోర్ను ఏప్రిల్ 18న ప్రారంభించిన విషయం తెలిసిందే.
దిల్లీ స్టోర్ను యాపిల్ సాకేత్ (Apple Saket)గా వ్యవహరిస్తున్నారు. దీన్ని ‘సెలెక్ట్ సిటీవాక్’ మాల్లో ఏర్పాటు చేశారు. యాపిల్ బీకేసీ (Apple BKC)తో పోలిస్తే దిల్లీలోని స్టోర్ విస్తీర్ణంలో సగం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ సాకేత్లో 70 మంది నిపుణులైన యాపిల్ ప్రతినిధులు కస్టమర్లకు సేవలు అందించనున్నారు. వీరు 18 రాష్ట్రాలకు చెందినవారు. అందరూ కలిసి మొత్తం 15 భాషల్లో మాట్లాడగలరు.
స్టోర్ల ప్రారంభం నిమిత్తం ఏప్రిల్ 17నే భారత్కు చేరుకున్న టిమ్ కుక్ (Tim Cook) మంగళవారం యాపిల్ బీకేసీని ప్రారంభించారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ విపణి అయిన భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు కుక్ తెలిపారు. దేశంలోని తమ కాంట్రాక్టు తయారీదార్ల వద్ద ఉద్యోగుల సంఖ్యను పెంచి 2 లక్షలకు చేర్చాలని యాపిల్ నిర్ణయించినట్లు సమాచారం. తమ విడిభాగాల తయారీ సంస్థలను భారత్లో విస్తరించేందుకు ప్రభుత్వ మద్దతును టిమ్ కుక్ కోరినట్లు సమాచారం.
గత 15 ఏళ్లలో తమ వ్యాపారానికి చైనా ఎంత సహాయపడిందో.. అదే తరహాలో భారత్ మార్కెట్ తమకు కలిసి వస్తుందని యాపిల్ భావిస్తోంది. మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్నందన, ఇక్కడి అవసరాలు తీర్చడంతో పాటు ఎగుమతులకూ తయారీ కేంద్రంగా భారత్ను మార్చుకోవాలని అనుకుంటోంది. మార్చి 31తో ముగిసిన ఏడాదికి 6 బిలియన్ డాలర్ల విక్రయాలతో కంపెనీ కొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..