Apple: భారత్ నుంచి యాపిల్కు రికార్డు స్థాయిలో ఆదాయం.. త్వరలోనే మరో నాలుగు స్టోర్లు

Apple | ఇంటర్నెట్ డెస్క్: భారత్లో యాపిల్ ఐఫోన్ల (iPhone) విక్రయాలు జోరందుకున్నాయి. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఐఫోన్ విక్రయాల ద్వారా యాపిల్కు భారత్ నుంచి వస్తోన్న ఆదాయం ఆల్ టైమ్ గరిష్ఠాలకు చేరింది. ఐప్యాడ్ విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని యాపిల్ సీనియర్ అధికారులు తెలిపారు. దీంతో కంపెనీ మొత్తం నికర అమ్మకాల్లో 6 శాతం వృద్ధి నమోదై 94.93 బిలియన్ డాలర్లకు (7.98లక్షల కోట్లు) చేరిందని యాపిల్ తెలిపింది. గతేడాది ఇదే సమయంలో నికర అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం 89.49 బిలియన్ డాలర్లుగా (7.524 లక్షల కోట్లు) ఉంది.
సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను యాపిల్ తాజాగా ప్రకటించింది. ‘‘అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్తో పాటు యూఎస్, బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, బ్రిటన్, కొరియా, మలేషియా, థాయ్లాండ్తో సహా పలు దేశాల్లో సెప్టెంబర్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో ఆదాయాలు ఆర్జించాం. భారత్ నుంచి వచ్చే ఆదాయంలో సరికొత్త రికార్డును నెలకొల్పాం’’ అని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) త్రైమాసిక ఫలితాల సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుత త్రైమాసికంలో రెండు స్టోర్లను ప్రారంభించిందని తెలిపిన ఆయన త్వరలోనే మరో నాలుగు కొత్త స్టోర్లను తీసుకురానున్నట్లు ప్రకటించారు.
నేడే మూరత్ ట్రేడింగ్.. టైమింగ్స్, ఏ స్టాక్స్ కొనుగోలు చేయాలి?
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ నివేదిక ప్రకారం.. భారత్లో సెప్టెంబర్ త్రైమాసికంలో యాపిల్ ఐఫోన్ విక్రయాల ద్వారా వచ్చే విలువ పరంగా మార్కెట్ వాటాలో 21.6శాతంగా ఉన్నాయి. అంటే శాంసంగ్ కంటే కాస్త వెనకబడి ఉంది. యాపిల్ మొత్తం ఉత్పత్తుల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 4.12శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో ఐఫోన్ అమ్మకాలు 5.5శాతం పెరగ్గా, ఐప్యాడ్ అమ్మకాలు 8శాతం పెరిగాయి. ఇక వార్షికంగా చూస్తే ఉత్పత్తి విక్రయాల విలువ 2శాతం పడిపోయింది. 189.28 బిలియన్ డాలర్ల నుంచి 185.23 బిలియన్ డాలర్లకు చేరింది. అనేక ప్రాంతాల్లో యాపిల్ అమ్మకాల్లో వృద్ధి నమోదైనప్పటికీ, చైనాలో మాత్రం విక్రయాలు మందగించాయి. ఇక వార్షిక ప్రాతిపదికన చూస్తే విక్రయాలు 8శాతం తగ్గుముఖం పట్టాయి. ఐప్యాడ్ విక్రయాలు 6శాతం పడిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
SBI Q2 Results: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ2 ఫలితాల్లో రూ.20,160 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. - 
                                    
                                        

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
Free ChatGPT Go Plan: ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ తాజాగా భారత్లో ‘చాట్జీపీటీ గో’ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. - 
                                    
                                        

భారత్లోని కుబేరుల సంపద 23 ఏళ్లలో 62% వృద్ధి: జీ20 నివేదిక
Billionaires: ఆర్థిక అసమానతల వల్ల దేశాలు ప్రజాస్వామ్య తిరోగమాన్ని చవిచూస్తాయని జీ20 నివేదిక వెల్లడించింది. - 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. - 
                                    
                                        

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి.. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

రైతులను కలిసే అర్హత జగన్కు లేదు: మంత్రి నిమ్మల
 - 
                        
                            

టికెట్లకు డబ్బుల్లేవు.. మహిళా క్రికెట్ జట్టుకు మొత్తం పారితోషికం ఇచ్చేసిన మందిరా బేడీ
 - 
                        
                            

కలలు కనడం ఎప్పుడూ ఆపొద్దు: హర్మన్ ప్రీత్ కౌర్
 - 
                        
                            

పెట్టుబడుల విషయంలో పూర్తిగా సహకరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
 - 
                        
                            

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
 - 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 


