Electric Vehicles: ఈవీలతో సిద్ధమవుతున్న వాహన తయారీ సంస్థలు
Electric Vehicles: విద్యుత్తు వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వం నుంచీ ప్రోత్సాహం లభిస్తోంది. ఈ నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు వచ్చే కొన్నేళ్లలో ఈవీల విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Electric Vehicles | దిల్లీ: దేశీయ వాహన తయారీ సంస్థలు వివిధ రకాల విద్యుత్తు వాహనాలను (Electric Vehicles) మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. స్వచ్ఛ ఇంధన వాహనాలకు ప్రభుత్వం నుంచీ దన్ను లభిస్తోంది. ఇటీవలే కేంద్రం ఇ-మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024ను తీసుకొచ్చింది. 2024 ఏప్రిల్ నుంచి 4 నెలల కోసం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో డిమాండ్కు అనుగుణంగా మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వంటి సంస్థలు కొత్త మోడళ్లను సిద్ధం చేస్తున్నాయి.
మహీంద్రా నుంచి ఐదు..
2025 జనవరి నుంచి వచ్చే కొన్నేళ్లలో ఐదు కొత్త విద్యుత్తు వాహనాలను విడుదల చేయనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) సీఈఓ నలినీకాంత్ గొల్లగుంట తెలిపారు. ఈ ఎస్యూవీలను మహీంద్రా INGLO ప్లాట్ఫామ్పై రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈవీ రంగంలో అగ్రస్థానంలో ఉండాలనే దీర్ఘకాల లక్ష్యంలో భాగంగానే వీటిని తీసుకొస్తున్నామన్నారు. 2027 నాటికి తమ పోర్ట్ఫోలియోలో 20-30 శాతం విద్యుత్తు వాహనాలే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.
ఎనిమిదేళ్లలో ఆరు మారుతీ ఈవీలు..
ఈవీల్లో మారుతీ సుజుకీ (Maruti Suzuki) పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (కార్పొరేట్ వ్యవహారాలు) రాహుల్ భారతీ వెల్లడించారు. 2024-25లో 550 కిలోమీటర్ల రేంజ్తో ఓ కారును విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలా వచ్చే 7-8 ఏళ్లలో ఆరు రకాల ఈవీలను తీసుకొస్తామని చెప్పారు. అయితే, కర్బన రహిత రవాణా కోసం కేవలం ఈవీలే కాకుండా హైబ్రిడ్-ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో-సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యుయెల్.. వంటి సాంకేతికతలతోనూ వాహనాలు రావాల్సి ఉందన్నారు. వాటన్నింటిపై మారుతీ సుజుకీ పనిచేస్తోందని తెలిపారు.
ఈవీల్లో హ్యుందాయ్ భారీ పెట్టుబడులు..
తమ కంపెనీ వచ్చే పదేళ్లలో తమిళనాడులో రూ.26,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని హ్యుందాయ్ (Hyundai) వెల్లడించింది. అందులో భాగంగానే ఓ బ్యాటరీ తయారీ సంస్థను సైతం ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు నేపథ్యంలో దేశీయ రవాణాలో త్వరలో ఈవీల వాటా పెరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హ్యుందాయ్ ఇప్పటికే దేశంలో కోనా, అయోనిక్-5 ఈవీలను విక్రయిస్తోన్న విషయం తెలిసిందే.
2026కు 10 హ్యుందాయ్ ఈవీలు..
2026 నాటికి భారత్లో 10 విద్యుత్తు వాహనాలను విడుదల చేస్తామని టాటా మోటార్స్ (TATA Motors) అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది కర్వ్, హ్యారియర్ సహా నాలుగు మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
లగ్జరీ కార్లలోనూ..
లగ్జరీ కార్ల సంస్థలు సైతం ఈవీలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. మెర్సిడెస్ బెంజ్ 2024లో 12 కార్ల మోడల్స్ను విడుదల చేయనుంది. వీటిలో మూడు ఈవీలేనని కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు ఆడీ ఇండియా ఇప్పటికే దేశంలో నాలుగు రకాల ఈవీలను విక్రయిస్తోంది. 2030 నాటికి తమ విక్రయాల్లో 50 శాతం విద్యుత్తు వాహనాల వాటా ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
బ్యాంక్ ఆఫ్ బరోడాపై గతంలో విధించిన ఆంక్షలను ఆర్బీఐ ఎత్తివేసింది. బ్యాంక్ ఈవిషయాన్ని వెల్లడించింది. -
యాపిల్ నుంచి ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, పెన్సిల్.. ధర, విశేషాలు ఇవీ..
Apple Let Loose Event 2024: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ లెట్ లూజ్ ఈవెంట్లో కొత్త ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, యాపిల్ పెన్సిల్ ప్రోలను ఆవిష్కరించింది. -
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ పూర్తి ఫ్లాట్గా ముగిసింది. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
Google Wallet: టికెట్లు, పాసులు, ఐడీలను భద్రపర్చుకునేందుకు వీలుగా గూగుల్ డిజిటల్ వాలెట్ను భారత్లో విడుదల చేసింది. -
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు (Air India Express) చెందిన పలు విమానాలు రద్దుకావడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ 64ఎంపీ కెమెరా సహా అత్యాధునిక ఏఐ ఫీచర్లతో భారత్లో విడుదలైంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు
Air India Express: దాదాపు 300 మంది క్యాబిన్ క్రూ అనారోగ్య కారణంతో సెలవు పెట్టినట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. దీంతో దాదాపు 80కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 267 పాయింట్ల నష్టంతో 73,244 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు కుంగి 22,276 దగ్గర కొనసాగుతోంది. -
టాటా సెమీ కండక్టర్ చిప్ల ఎగుమతి!
మన దేశం నుంచి సెమీ కండక్టర్ చిప్సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. చిప్సెట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికి ఇది ఎంతో ప్రోత్సాహకర అంశమే. -
మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్!
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. -
డాక్టర్ రెడ్డీస్కు రూ.1,307 కోట్ల లాభం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
అయిదేళ్ల కనిష్ఠానికి పొదుపు
దేశంలో కుటుంబాల నికర పొదుపు గణనీయంగా తగ్గుతోంది. 2020-21తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు కుటుంబాల నికర పొదుపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. -
3 రోజులు.. రూ.11 లక్షల కోట్ల నష్టం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు లేనట్లే
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) సమర్పించిన ప్రతిపాదనను కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
వైద్య పరికరాల దిగుమతులు తగ్గాలి
వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ (ఔషధ) విభాగ కార్యదర్శి అరుణీష్ చావ్లా వెల్లడించారు. -
హ్యాపియెస్ట్ మైండ్స్ డివిడెండ్ 163%
ఐటీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.71.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.351 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లు, పెద్ద పెద్ద షాపింగ్మాల్స్కు మారడమే ఇందుకు కారణం.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి