BCAS: బ్యాగేజీ డెలివరీ 30 నిమిషాల్లోపే
దిల్లీ, ముంబయి, హైదరాబాద్ వంటి 6 ప్రధాన విమానాశ్రయాల్లో గత 4 నెలల్లోనే బ్యాగేజీ డెలివరీ సమయం మెరుగైంది.
హైదరాబాద్ సహా 6 ప్రధాన విమానాశ్రాయాల్లో
పౌర విమానయాన శాఖ చర్యల వల్లే
దిల్లీ: దిల్లీ, ముంబయి, హైదరాబాద్ వంటి 6 ప్రధాన విమానాశ్రయాల్లో గత 4 నెలల్లోనే బ్యాగేజీ డెలివరీ సమయం మెరుగైంది. ఈ విమానాశ్రయాల్లో 90 శాతానికి పైగా ప్రయాణికులకు విమానం ల్యాండింగ్ అయిన 30 నిమిషాల్లోపే బ్యాగేజీని అందించారని పౌర విమానయాన శాఖ తెలిపింది. అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయ ఆపరేటర్లు, ఇతర విమానాశ్రయాలు బ్యాగేజీ డెలివరీ సమయాన్ని తగ్గించుకోవాలని సూచించింది.
ఇలా చేశారు..: దిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల్లో దేశీయ విమానయాన సంస్థల్లో బ్యాగేజీ డెలివరీ వ్యవస్థను మెరుగుపరిచే దిశగా జనవరిలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) చర్యలను ప్రారంభించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. విమానం ల్యాండ్ అయిన 30 నిమిషాల్లోపే బ్యాగేజీ డెలివరీ జరగాలి. అందుకనుగుణంగా విమానయాన సంస్థలు తమ సామగ్రి, సేవల మరమ్మతులు, మెరుగు పరచడంతో పాటు పర్యవేక్షణనూ పెంచుకున్నాయి.
ఈ స్థాయికి మెరుగైంది..: జనవరి 14న అంటే బీసీఏఎస్ చర్యలకు ముందు సరైన సమయంలో(అరగంటలోపే) బ్యాగేజీ అందుకునే ప్రయాణికుల సంఖ్య 62.2 శాతంగానే ఉండేది. బీసీఏఎస్ చర్యల అనంతరం, దేశీయ విమానయాన సంస్థలు తమ సేవలను మెరుగుపరచుకోవడంతో 2024 మార్చి నాటికి 90 శాతానికి పైగా ప్రయాణికులకు అరగంటలోపే బ్యాగేజీని అందించగలిగారు. 2024 మేలో ఇది 92.5 శాతానికి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొన్ని నెలల్లో ఐపీఓల సందడి.. రూ.50 వేల కోట్ల సమీకరణ!
IPOs: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అనేక కంపెనీలు ఐపీఓకి సిద్ధమవుతున్నాయి. దాదాపు రూ.50 వేల కోట్ల సమీకరణ జరగొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
హెచ్పీసీఎల్ సీఎండీ పదవికీ సరైన అభ్యర్థి దొరకలేదు
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పదవికి సరైన అభ్యర్థి దొరకలేదని తెలుస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పీఈఎస్బీ ఈ నెల 14న హెచ్పీసీఎల్ సీఎండీ కోసం 8 మందిని ఇంటర్య్వూ చేసింది. -
ఎస్బీఐ అనుబంధ సంస్థల నగదీకరణ!
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ పేమెంట్ సర్వీసెస్ వంటి అనుబంధ సంస్థల నగదీకరణ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖారా వెల్లడించారు. అయితే వీటిని నగదీకరించే ముందు వాటి కార్యకలాపాలు, వ్యాపారాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. -
కార్డు లావాదేవీలు తగ్గించేశారు
డెబిట్/క్రెడిట్ కార్డులను స్వైప్ చేయడం ద్వారా చెల్లింపునకు వీలున్న పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాలను కొత్తగా అమర్చుకునే వారి సంఖ్య బాగా నెమ్మదించింది. అన్ని రకాల చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తున్న వ్యవస్థీకృత, పెద్ద ఫార్మాట్ రిటైల్ సంస్థలే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. -
సూక్ష్మ రుణాలు 27% పెరిగాయ్
వివిధ ఆర్థిక సంస్థలు ఈ ఏడాది జనవరి-మార్చిలో మంజూరు చేసిన సూక్ష్మ రుణాల మొత్తం, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 27% అధికమైనట్లు క్రెడిట్ సమాచార కంపెనీ క్రిఫ్ హై మార్క్ వెల్లడించింది. ఇదే సమయంలో రుణ ఎగవేతలూ స్వల్పంగా పెరిగాయని తెలిపింది. -
కొత్త హోదాల జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియామక కార్యకలాపాల్లో కొత్త హోదాలపైనే ఎక్కువ దృష్టి కనిపించనుంది. వేర్వేరు రంగాల్లోని కంపెనీలు 27% మేర తాజా ఉద్యోగాలను ఇవ్వవచ్చని ఒక నివేదిక అంటోంది. -
ఎస్ఈజెడ్ల ఎగుమతులు రూ.13.5 లక్షల కోట్లు
ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్ఈజెడ్ల) నుంచి గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 163.39 బిలియన్ డాలర్ల (సుమారు రూ.13.5 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు నమోదయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. -
పసిడి దిద్దుబాటు!
పసిడి ఆగస్టు కాంట్రాక్టుకు ఈవారం రూ.71,080 దిగువన లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది. ఈ స్థాయికి దిగువన చలిస్తే రూ.70,205; రూ.69,659 వరకు దిద్దుబాటు కావచ్చు. -
తక్కువ స్లాబ్ ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలి: సీఐఐ
తక్కువ స్లాబ్లో ఉన్న వ్యక్తులకు ఆదాయపు పన్ను మినహాయింపును ఇవ్వాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)కు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ సంజీవ్ పురి కోరారు. అధిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని త్వరలో ప్రవేశపెట్టబోయే పూర్తి ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్లో వారికి ఉపశమనం కల్పించాలని సూచించారు. -
బ్యాటరీ సెల్స్ ఉత్పత్తికి అంతర్జాతీయ సంస్థలతో జట్టు
విద్యుత్ వాహనాలకు భవిష్యత్తులో గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, స్థానికంగా బ్యాటరీ సెల్స్ ఉత్పత్తి చేసేందుకు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తున్నామని మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈఓ అనిశ్ షా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
జనవరి- మార్చి త్రైమాసికానికి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఏకీకృత ప్రాతిపదికన రూ.431 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. 2022-23లో ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.458 కోట్లతో పోలిస్తే లాభం 6 శాతం తగ్గింది. పసిడి రుణ వ్యాపారాన్ని నిర్వహించకుండా కంపెనీపై ఆర్బీఐ ఆంక్షలు విధించడం ఇందుకు కారణమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
డిలీట్ చేసిన మెసేజ్లు భార్య కంటికి.. యాపిల్పై రూ.53 కోట్లకు దావా
-
జగన్పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయండి: ఏపీ హోంమంత్రి అనిత
-
‘తక్షణం రాజ్భవన్ నుంచి వెళ్లిపోండి..’.. పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
మదనపల్లెలో కిలో టమాటా@ రూ.80
-
హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్రావు
-
నేను, సమైరా.. అతడి నుంచే క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం: శుభ్మన్ గిల్