Digital Payments: చెల్లింపుల్లో వైఫల్యానికి బ్యాంకులదే లోపం
డిజిటల్ చెల్లింపుల సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు బ్యాంకులే కారణమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
ముంబయి: డిజిటల్ చెల్లింపుల సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు బ్యాంకులే కారణమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీనికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వ్యవస్థలకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ‘యూపీఐ చెల్లింపుల్లో అంతరాయాలకు కారణాలను విశ్లేషించడానికి ప్రతి ఒక్క సంఘటననూ ఆర్బీఐ అధికారులు అధ్యయనం చేస్తారు. ఇందులో యూపీఐ, ఎన్పీసీఐ వ్యవస్థల్లో ఎలాంటి సమస్యలూ కనిపించలేదు. సమస్య బ్యాంకు వైపు నుంచే వస్తోంది. దీనిపై మేమూ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. అంతరాయాలపై పరిశోధిస్తున్నప్పుడు ఆర్బీఐ బృందాలు ఎన్పీసీఐ వ్యవస్థనూ తనిఖీ చేస్తాయని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు తమ డిజిటల్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సిస్టమ్ డౌన్లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలనే విషయంలో ఆర్బీఐ చాలా కఠినంగా వ్యవహరిస్తోందని, కోటక్ మహీంద్రా బ్యాంక్లో బయటపడిన లోపాల్లాంటివి గుర్తిస్తే, బ్యాంకులపై ఆంక్షలు విధిస్తున్నామని వివరించారు. సాంకేతిక వ్యవస్థల పటిష్ఠత కోసం బ్యాంకులు తగిన స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయని, వ్యాపార వృద్ధికి అనుగుణంగా ఐటీ వ్యవస్థల్లో వేగం పెంచేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాంకేతికతపై ఎంత ఖర్చు చేసేదీ బ్యాంకుల ఇష్టమని, అదే సమయంలో విపత్తు వచ్చినప్పుడు రికవరీ వ్యవస్థలను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని బ్యాంకులకు సూచించారు.
వడ్డీ రేట్ల విషయంలో పారదర్శకత ఉండాలి: యూపీఐ లైట్ ద్వారా నెలకు కోటికి పైగా లావాదేవీలు జరుగుతున్నాయని, ఇవి పెరిగే కొద్దీ బ్యాంకు సర్వర్లపై ఒత్తిడి తగ్గుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబి శంకర్ తెలిపారు. కొన్ని సంస్థలు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయనే ప్రశ్నకు మరో డిప్యూటీ గవర్నర్ జెస్వామినాథన్ స్పందిస్తూ.. వడ్డీ వసూలు విషయంలో పారదర్శకత పాటించాలని, సహేతుకంగా ఉండాలని తమ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని సంస్థలు అధిక వడ్డీలను విధిస్తున్నాయని.. అందువల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ ఇలాగే ఉందని చెప్పలేమన్నారు. కొన్ని బ్యాంకులు కీలక ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు ఇవ్వడం లేదని, వీటిపై నియంత్రణ సంస్థ తనిఖీలు చేస్తోందని ఆర్బీఐ గవర్నర్ దాస్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి