Bharti Airtel: ఎయిర్టెల్ లాభం 1,612 కోట్లు.. 56 లక్షల కొత్త కస్టమర్లు
Bharti Airtel Q1 results: ఎయిర్టెల్ తొలి త్రైమాసికంలో రూ.1612 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆర్పు రూ.200కు చేరుకుంది.
దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో (Q1 results) కంపెనీ రూ.1612 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాదితో ఇదే త్రైమాసికంలోనూ ఇదే స్థాయిలో లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. ఆదాయంలో మాత్రం 14 శాతం వృద్ధితో రూ.37,440 కోట్లుగా నమోదు చేసింది.
ఈ త్రైమాసికంలో అన్ని వ్యాపారాల్లో మరోసారి మెరుగైన వృద్ధిని నమోదు చేసినట్లు ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విఠల్ తెలిపారు. సమీక్షా త్రైమాసికంలో 56 లక్షల మంది కొత్త కస్టమర్లు నెట్వర్క్లో చేరినట్లు చెప్పారు. అలాగే ఎన్నడూ లేనంతగా పోస్ట్పెయిడ్ కస్టమర్లూ భారీగా పెరిగినట్లు పేర్కొన్నారు. టెలికాం కంపెనీలు కీలక కొలమానంగా భావించే.. ఆర్పు (వ్యక్తి నుంచి వచ్చే సగటు ఆదాయం) రూ.200కు చేరినట్లు కంపెనీ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్