McDonalds: మెక్డొనాల్డ్స్లో అన్లిమిటెడ్ ఫుడ్.. ఈ గోల్డ్ కార్డ్ గురించి తెలుసా?
మెక్డొనాల్ట్స్లో అన్లిమిటెడ్ ఫుడ్ తినాలనుకునేవారికి ఆ సంస్థ అందించే గోల్డ్ కార్డ్ గురించి తెలుసా? అసలు గోల్డ్ కార్డ్ అంటే ఏమిటి.. దానితో లాభాలేంటి?
ఇంటర్నెట్ డెస్క్: మెక్డొనాల్డ్స్ (McDonalds)లో రకరకాల ఆహార పదార్థాలు తినాలనే ఆశ అందరికీ ఉంటుంది. కొన్ని రెస్టారంట్లలోలా మెక్డొనాల్డ్స్లో కూడా అన్ లిమిటెడ్ ఆహారం అందిస్తే బాగుంటుందని చాలా మంది ఫుడ్డీస్ అనుకుంటుంటారు. అలాంటి ఒక అవకాశం ఉందని దానికోసం ‘గోల్డ్ కార్డ్’ (Gold Card) ఉంటుందని మీకు తెలుసా? బిల్ గేట్స్(Bill Gates), వారెన్ బఫెట్ (Warren Buffett) వంటి బిలియనీర్ల వద్ద ఈ కార్డు ఉంది. ఈ విషయాన్ని వారెన్ బఫెట్ స్వయంగా వెల్లడించారు. గతంలో ఓ ఇంటర్వూలో మాట్లాడిన ఆయన ‘గోల్డ్ కార్డ్’ చూపిస్తూ తనకు మెక్డొనాల్డ్ గోల్డ్ కార్డ్ ఉందని, దీనిద్వారా తాను, తన కుటుంబసభ్యులు జీవితాంతం వారి నగరంలోని ఏదైనా మెక్డొనాల్డ్స్లో ఉచితంగా అన్లిమిటెడ్ ఫుడ్ తినడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. తన స్నేహితుడు, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు కూడా ఈ కార్డు ఉందని, అయితే గేట్స్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ మెక్డొనాల్డ్స్లో అయినా దానిని ఉపయోగించుకునే అవకాశం ఉందని వారెన్ బఫెట్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది గోల్డ్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు, దానిని ఎలా పొందాలనే విషయాలను మెక్డొనాల్డ్స్ ఎప్పుడూ బహిరంగంగా తెలపలేదు. ఇది కేవలం బిలియనీర్లకు మాత్రమే ఇచ్చే ప్రత్యేక ఆఫర్ అయ్యుండవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తంచేశారు. అనంతరం దీనిపై మెక్డొనాల్డ్స్ స్పందించింది. ప్రముఖులు, కోటీశ్వరులతో పాటు సామాన్యులకు కూడా ఈ అవకాశం ఇస్తామని పేర్కొంది. దీనికోసం కంపెనీ నిర్వహించే “SZN ఆఫ్ షేరింగ్” పోటీలో పాల్గొనాల్సి ఉంటుందని వివరించింది. ప్రజలు మెక్డొనాల్డ్ యాప్ ద్వారా ఏదైనా కొనుగోలు చేసి ఈ పోటీలో పాల్గోవచ్చని తెలిపింది. ఇందులో గెలుపొందిన వారికి గోల్డ్ కార్డ్ అందజేస్తామంది. దీనిద్వారా కార్డ్ హోల్డర్లు 50 సంవత్సరాల పాటు వారానికి రెండుసార్లు తమ నగరాలలోని మెక్డొనాల్డ్స్లో ఉచితంగా అన్లిమిటెడ్ ఫుడ్ తినొచ్చు. కార్డు హోల్డర్తో పాటు మరో ముగ్గురికి కూడా ఈ అవకాశం ఉంటుందని కంపెనీ యాజమాన్యం వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?