Bitcoin: 40,000 డాలర్ల మార్క్ దాటిన బిట్కాయిన్
Bitcoin: గత 24 గంటల వ్యవధిలో బిట్కాయిన్ (Bitcoin) విలువ నాలుగు శాతం పెరిగి 40,950 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Bitcoin | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ (Bitcoin) విలువ మరోసారి 40 వేల డాలర్ల మార్క్ను దాటింది. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు ఇకపై ఉండకపోవచ్చుననే సంకేతాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ద్రవ్యోల్బణం కూడా దిగొచ్చిన నేపథ్యంలో రేట్ల కోత వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవ్వొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే బిట్కాయిన్ (Bitcoin) ర్యాలీకి దోహదం చేస్తోంది.
భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 10:37 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో బిట్కాయిన్ (Bitcoin) విలువ నాలుగు శాతం పెరిగి 40,950 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత ఏడు రోజుల్లో ఈ కాయిన్ (Bitcoin) దాదాపు 10 శాతం పెరగడం గమనార్హం. మరో కీలక కాయిన్ అయిన ఇథేరియం గత 24 గంటల్లో 3.3 శాతం, 7 రోజుల్లో 8.5 శాతం పుంజుకుంది. 2023లో ఇప్పటి వరకు బిట్కాయిన్ (Bitcoin) 146 శాతం పుంజుకుంది. చివరిసారి 2022 ఏప్రిల్లో 40 వేల డాలర్ల మార్క్ వద్ద ట్రేడైంది. ఆ సమయంలో టెర్రాయూఎస్డీ స్టేబుల్ కాయిన్ పతనంతో క్రిప్టో మార్కెట్లో రెండు లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైన విషయం తెలిసిందే.
మరోవైపు బ్లాక్రాక్ కంపెనీ తొలి అమెరికా స్పాట్ బిట్కాయిన్ (Bitcoin) ఈటీఎఫ్ను ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి జనవరిలో అనుమతి లభించే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది కూడా క్రిప్టో కరెన్సీ పుంజుకోవడానికి దోహదం చేస్తోంది. దివాలా తీసిన క్రిప్టోఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ దోషిగా తేలిన విషయం తెలిసిందే. మరోవైపు బైనాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్పెంగ్ ఝావో అనేక ఆరోపణలతో క్రిప్టో పరిశ్రమ నుంచి వైదొలగారు. ఈ రెండు పరిణామాలు.. 2022 నాటి పతనం నుంచి కోలుకోవడానికి క్రిప్టో కరెన్సీలకు అవాంతరాలుగా నిలిచాయి. లేదంటే ఇప్పటికే బిట్కాయిన్ విలువ 50 వేల మార్క్ను అందుకుని ఉండేదని నిపుణుల అంచనా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు