Bitcoin: క్రిప్టోలో మళ్లీ ర్యాలీ.. 35,000 డాలర్ల మార్క్ను అందుకున్న బిట్కాయిన్!
Bitcoin: త్వరలో బిట్కాయిన్ ఆధారిత ఈటీఎఫ్ రానుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలో తాజాగా ర్యాలీ మొదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: బిట్కాయిన్ సహా ఇతర క్రిప్టోకరెన్సీల్లో సోమవారం భారీ ర్యాలీ కనిపించింది. బిట్కాయిన్ ఓ దశలో 35,000 డాలర్ల మార్క్ను దాటింది. 2022 మే తర్వాత ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. ఆదివారం నుంచి క్రమంగా పుంజుకుంటూ వచ్చిన బిట్కాయిన్ ఇప్పటి వరకు దాదాపు 12 శాతం పెరిగింది. 34 వేల డాలర్ల కీలక మైలురాయిని అందుకున్న రెండు గంటల్లోనే 35 వేల మార్క్నూ దాటేయడం గమనార్హం.
బిట్కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్కు అమెరికా నియంత్రణా సంస్థలు అమోదం తెలిపే అవకాశం ఉందనే అంచనాలే తాజా క్రిప్టో ర్యాలీకి కారణం. యూఎస్కు చెందిన బ్లాక్రాక్ అనే సంస్థ బిట్కాయిన్ ఈటీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతి లభించడం ఖాయమని ప్రముఖ విశ్లేషకుడు స్కాట్ జాన్సన్ ఎక్స్ (ట్విటర్) వేదికగా సంకేతాలిచ్చారు. అందుకు కావాల్సిన లైసెన్స్ లభించనట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. త్వరలోనే బిట్కాయిన్ ఆధారిత ఈటీఎఫ్ను ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో బిట్కాయిన్ సహా ఇథేరియం వంటి ఇతర క్రిప్టోకరెన్సీలన్నీ ర్యాలీ అయ్యాయి.
గత 24 గంటల్లో బిట్ కాయిన్ 12.46 శాతం పెరిగి 34,344 డాలర్లకు చేరింది. మరోవైపు ఇథేరియం 9 శాతం, ఎక్స్ఆర్పీ 4 శాతం, సొలానా 7 శాతం పెరిగాయి. క్రిప్టోలో నేరుగా ట్రేడ్ చేయడానికి వెనుకాడేవారికి ఈటీఎఫ్ ఓ మంచి మార్గమని నిపుణులు సూచించారు. స్టాక్ మార్కెట్ ద్వారా ఈ ఈటీఎఫ్ను కొనుగోలు చేసే వీలుంటుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!