boAt IPO: రూ.1500 కోట్ల ఐపీఓకు boAt మాతృసంస్థ రెడీ

Eenadu icon
By Business News Team Published : 29 Oct 2025 18:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

boAt IPO | దిల్లీ: ప్రముఖ వేరెబుల్‌ బ్రాండ్‌ బోట్‌ (Boat) మాతృసంస్థ ఇమాజిన్‌ మార్కెటింగ్‌ లిమిటెడ్ పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమవుతోంది. ఐపీఓ ద్వారా రూ.1500 కోట్లు మార్కెట్‌ నుంచి సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి అప్‌డేట్ చేసిన ముసాయిదా పత్రాలను సమర్పించింది.

కంపెనీ ఐపీఓలో రూ.500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ, రూ.1000 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్ పద్ధతిలో విక్రయించనుంది. ఈ ఓఎఫ్ఎస్‌లో ప్రమోటర్లు, పెట్టుబడిదారులు తమ వాటాను విక్రయించనున్నారు. ఈ ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా సౌత్ లేక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రూ.500 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. అమన్‌ గుప్తా రూ.225 కోట్ల, సమీర్‌ అశోక్‌ మెహతా రూ.75 కోట్ల విలువైన షేర్లు విక్రయించనున్నారు. అదే విధంగా ఫైర్‌సైడ్‌ వెంచర్స్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌-I రూ.150 కోట్ల, క్వాల్‌కామ్‌ వెంచర్స్‌ ఎల్‌ఎల్‌సీ రూ.50 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నాయి.

బోట్‌ సంస్థ గత ఏప్రిల్‌లో సెబీకి కాన్ఫిడెన్షియల్ ముసాయిదా పత్రాలను సమర్పించగా ఆగస్టు చివర్లో ఐపీఓకి అనుమతి లభించింది. సాధారణంగా ఐపీఓ వివరాలు బహిర్గతం కాకూడదన్న ఉద్దేశంతో ఈ మార్గాన్ని కంపెనీలు ఎంచుకుంటూ ఉంటాయి. వాస్తవానికి 2022 జనవరిలో సంస్థ రూ.2 వేల కోట్ల ఐపీఓ కోసం ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఆ సమయానికి రూ.900 కోట్ల తాజా షేర్ల ఇష్యూ, రూ.1,100 కోట్ల ఓఎఫ్ఎస్‌ ప్రణాళికలో ఉన్నాయి. అంటే ఇది రెండో ప్రయత్నం. త్వరలో కంపెనీ ఐపీఓకు వచ్చే అవకాశం ఉంది. ఈ పబ్లిక్‌ ఇష్యూకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ (ఇండియా) సెక్యూరిటీస్‌, జేఎం ఫైనాన్షియల్‌, నొమురా ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు