Budget 2024: ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే బడ్జెట్: పరిశ్రమ వర్గాలు
Union Budget 2024 బడ్జెట్ను పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితంగా బడ్జెట్ను రూపొందించారని ప్రశంసించాయి.
ముంబయి: ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు ప్రకటించడానికి ప్రతిసారి బడ్జెట్ సందర్భం కాదని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ (Union Budget 2024)పై ఆయనతో పాటు వ్యాపార రంగ ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాత్కాలిక బడ్జెట్ దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందని తెలిపారు.
శుభపరిణామం
‘‘చాలా ఏళ్లుగా గమనిస్తున్నా.. బడ్జెట్ అనగానే డ్రామా ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించే పాలసీ పరమైన నిర్ణయాలపై అంచనాలు పెంచేస్తాం. ఇంటి ఖర్చుల కోసం మనం లెక్కలు వేసుకున్నట్లే దేశానికి బడ్జెట్. మనకున్న ఆదాయవనరులతో ఎలా జీవించాలి? భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి? అనే అంశాలపై దృష్టిసారిస్తాం. ఎన్నికల ముందు ప్రకటించే ప్రజాకర్షక పథకాలేవీ ఈ బడ్జెట్లో లేవు. పన్ను విధానాల్లో ఎలాంటి మార్పులు లేవు. జీడీపీలో పన్నుల వాటా పెరగడం శుభపరిణామం’’ అని మహీంద్రా ట్వీట్ చేశారు.
ఆర్థికాభివృద్ధికి రోడ్ మ్యాప్
‘‘తాత్కాలిక బడ్జెట్తో ఆర్థిక మంత్రి స్థిరమైన ఆర్థికాభివృద్ధికి సమగ్ర రోడ్ మ్యాప్ను అందించారు. 2047 నాటికి ఇది భారత్ను ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుంది. పరిశోధన, ఆవిష్కరణలు, గ్రీన్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక ఆధారిత డిజిటల్ పరివర్తనలకు కేంద్రం పెద్దపీట వేసింది’’ అని బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా (Kiran Mazumdar Shaw) తెలిపారు.
మౌలిక వసతుల కల్పన
‘‘అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తూ కేంద్రం తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. సాధారణ ప్రయాణికులు, వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా రోడ్డు, రైలు, విమాన మార్గాలను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించింది. భారత దేశ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.11.11 లక్షల కోట్లు కేటాయించింది. దేశ ఆర్థికాభివృద్ధిని పెంచడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది’’ అని అల్స్టోమ్ ఇండియా ఎండీ ఓలీవర్ లోయిసన్ తెలిపారు.
కీలక ముందడుగు
‘‘ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు విస్తరిస్తామని కేంద్రం ప్రకటన చేయడం కీలక ముందడుగు. ప్రతి జిల్లాలో ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని చెప్పడం.. మారుమూల ప్రాంతాలకూ ఆరోగ్య సేవలను విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనం’’ అని జీయిస్ గ్రూప్ ఇండియా సీఎఫ్వో ధావల్ రాడియా తెలిపారు.
స్వాగతిస్తున్నాం..
‘‘దేశీయంగా పర్యటక రంగాన్ని ప్రోత్సహించాలనే దూరదృష్టితో ఐకానిక్ టూరిజం కేంద్రాలను అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించాలనే ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం. దాంతోపాటు ఆధ్యాత్మిక పర్యటకానికి ప్రభుత్వం మద్దతుగా నిలవడం శుభపరిణామం’’ అని హోటల్ అండ్ రెస్టారెంట్ ఫెడరేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రదీప్ శెట్టి తెలిపారు.
సినిమా పేర్లతో ప్రశంసలు
ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష గోయెంకా (Harsh Goenka) కేంద్ర బడ్జెట్పై వినూత్నంగా స్పందించారు. ‘‘బడ్జెట్ 2024.. మాంద్యం అనే ‘యానిమల్’ను మచ్చిక చేసుకునే ‘ఫైటర్’. పేదరికానికి వ్యతిరేకంగా పోరాడే ‘గదర్’. ఎవరూ ‘12త్ ఫెయిల్' (12Th Fail)’ కాకుండా చూసుకునే స్వేహపూర్వక భారతీయ ‘జవాన్’. యువతకు ఉపాధి, విద్య, సంక్షేమం వంటి వాటికి ప్రాధాన్యమిస్తూ ‘బహుదూర్’ పని చేశారు మన ‘సలార్’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్’’ అని ట్వీట్ చేశారు.
ఫార్మా రంగానికి నిరాశ
ఫార్మా రంగానికి ఈ బడ్జెట్ నిరాశ కలిగించిందని అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మా ఎండీ సందీప్ జైన్ అన్నారు. మేకిన్ ఇండియా, గ్రీన్ ఎనర్జీ, యువతకు ఉపాధి వంటి ఎన్నో అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఇచ్చారని, ఫార్మా రంగానికి ఎలాంటి మద్దతు లభించలేదని తెలిపారు. పూర్తిస్థాయి బడ్జెట్లో అయినా ఫార్మా రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా