McKinsey: కంపెనీని వీడితే 9 నెలల వేతనం.. ఉచిత కెరీర్ కోచింగ్: మెకిన్సీ
McKinsey: ఉద్యోగులను వదిలించుకునేందుకు సిద్ధమైన ప్రముఖ కన్సల్టెన్సీ సేవల సంస్థ మెకిన్సీ అండ్ కంపెనీ వినూత్న ఆఫర్ను ప్రకటించింది. కంపెనీని వీడే వారికి 9 నెలల వేతనంతో పాటు కెరీర్ కోచింగ్ అందిస్తామని ప్రకటించింది.
లండన్: ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్నాలజీ పరంగా వస్తున్న అత్యాధునిక మార్పులతో పాటు ఆర్థిక అనిశ్చితులే దీనికి కారణం. వడ్డీరేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు కంపెనీల కార్యకలాపాలను దెబ్బతీశాయి. దీంతో ఖర్చుల నియంత్రణలో భాగంగా సిబ్బంది సంఖ్యలో కోత పెడుతున్నాయి. తాజాగా ప్రముఖ కన్సల్టెన్సీ సేవల సంస్థ ‘మెకిన్సీ అండ్ కంపెనీ’ (McKinsey & Company) సైతం బ్రిటన్లోని తమ కంపెనీ ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. అయితే, వారికి అందించే పరిహార ప్యాకేజీ, అనంతర మద్దతు విషయంలో ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతినటంతో కన్సల్టెన్సీ సేవలకు గిరాకీ తగ్గింది. దీంతో మెకిన్సీ అండ్ కంపెనీకి (McKinsey & Company) ఆర్డర్లు సన్నగిల్లాయి. వ్యయ నియంత్రణ కోసం అన్ని కంపెనీల తరహాలోనే ఇది కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది. గత ఏడాది 1,400 మందిని తొలగించింది. మరింతమందిని వదిలించుకోవాలనుకుంటున్న సంస్థ ఉద్యోగులకు ఆఫర్ ప్రకటించింది. వేరే కంపెనీల్లో అవకాశాలు వెతుక్కునే వారికి తొమ్మిది నెలల గడువు ఇచ్చింది. ఈ సమయంలో వారు ఆఫీసుకు వచ్చి పని చేయకుండానే పూర్తిస్థాయి వేతనం తీసుకోవచ్చని తెలిపింది. కంపెనీలోని కెరీర్ కోచింగ్ కోర్సులు సహా ఇతర వనరులను ఉచితంగా వాడుకోవచ్చని పేర్కొంది. వాటి ఆధారంగా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చని తెలిపింది. అయితే, గడువు ముగిసిన తర్వాత ఉద్యోగం రాకపోయినా కంపెనీని వీడాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.
గత ఏడాది 1,400 మందిని తొలగించిన మెకిన్సీ (McKinsey & Company) ఫిబ్రవరిలో దాదాపు 3,000 మందికి పనితీరును మెరుగుపర్చుకోవాలని నోటీసులు జారీ చేసింది. లేదంటే కంపెనీని వీడాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశీ మదుపర్లలో ఎన్నికల గుబులు
దశాబ్దకాలంలోనే తొలిసారిగా భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ మదుపర్లు నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు కనిపిస్తోంది. -
బీసీజీ షేర్ల ట్రేడింగ్పై జూన్ 14 నుంచి సస్పెన్షన్
బీసీజీ (బ్రైట్కామ్ గ్రూపు) సంస్థకు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్పై బీఎస్ఈ, ఎన్ఎన్సీ సస్పెన్షన్ విధించాయి. -
విదేశీ ఖనిజాలపై కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ దృష్టి
ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్యూ)లైన కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్).. విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు వెళుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొంది. -
టెక్ ఉద్యోగాల్లో మహిళల వాటా తక్కువే
దేశంలోని టెక్ ఉద్యోగాల్లో లింగ అసమానత కనిపిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డు డైరెక్టర్, ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ బుధవారం వెల్లడించారు. -
ఒడుదొడుకుల్లో స్వల్ప నష్టాలు
రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. -
కేవైసీ ధ్రువీకరణ మరింత సులభం
కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్ఏ)ల ద్వారా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకో) వివరాల ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని సెబీ నిర్ణయం తీసుకుంది. -
4 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
మనదేశం నుంచి వస్తు ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్లో 34.99 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.90 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
ఎల్ఐసీకి మరో మూడేళ్ల సమయం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రజల కనీస వాటా 10 శాతానికి చేరేందుకు మరో మూడేళ్ల గడువు లభించింది. 2022 మే 17న ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో నమోదయ్యింది. -
సోరియాసిస్ వ్యాధికి ఔషధం
జర్మనీకి చెందిన బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనే ఔషధ సంస్థ మనదేశంలో సొరియాసిస్ (జనరలైజ్డ్ పస్టులర్ సోరియాసిస్-జీపీపీ) అనే వ్యాధి చికిత్సలో వినియోగించే స్పెవిగో (స్పెసోలిమాబ్) ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఫోన్ ఛార్జీలు పెంచాల్సిందే
ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో టెలికాం ఛార్జీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విత్తల్ పేర్కొన్నారు. -
డిపాజిట్ రేట్లు పెంచిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. -
సంక్షిప్త వార్తలు
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో బెర్జర్ పెయింట్స్ రూ.222.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి
-
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు