వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
2023-24 దివాలా ప్రక్రియల్లో రుణ సంస్థల పరిస్థితి ఇది: ఇక్రా
దిల్లీ: నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బ్యాంకులు-ఇతర ఆర్థిక సంస్థలు ఇస్తున్న రుణ మొత్తంతో పోలిస్తే, దివాలా పరిష్కార ప్రక్రియ కింద వసూలవుతున్న మొత్తం నాలుగో వంతుకు పరిమితం కావడం ఇందుకు కారణం. 2022-23లో ప్రతి రూ.100 బకాయిల్లో, ఆర్థిక సంస్థలు దివాలా ప్రక్రియ కింద రూ.64 వదులుకోగా, 2023-24లో ఈమొత్తం మరింత అధికమై రూ.73 పోగొట్టుకున్నట్లు రేటింగ్ సంస్థ ఇక్రా తెలిపింది.
- 2022-23లో రుణ సంస్థలకు రావాల్సిన బకాయిల్లో సగటున 36 శాతం రాగా, 2023-24లో ఇది 27 శాతానికి పరిమితమైనట్లు సంస్థ నివేదిక వెల్లడించింది.
- 2023-24లో మొత్తంగా 269 దివాలా పరిష్కార ప్రక్రియలకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునళ్లు ఆమోదం తెలిపాయి. 2022-23లో ఈ సంఖ్య 189గా ఉంది.
- కొత్తగా దాఖలైన దివాలా పరిష్కార దరఖాస్తుల సంఖ్య 2022-23లోని 1,263తో పోలిస్తే 2023-24లో 987కు తగ్గింది.
- కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో, పలు కారణాల రీత్యా రుణ సంస్థలు తమకు రావాల్సిన మొత్తం బకాయిల నుంచి కొంత మొత్తాన్ని వదులుకోవడం లేదా త్యాగం చేయక (హెయిర్కట్) తప్పట్లేదు. ఈ మొత్తం మరీ ఎక్కువగా ఉంటుండటంపైనే ఆందోళన వ్యక్తమవుతోందని ఇక్రా హెడ్ (స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ రేటింగ్స్) అభిషేక్ డాఫ్రియా తెలిపారు.
జాప్యం వల్లే: దివాలా స్మృతి ప్రకారం.. దివాలా పరిష్కార ప్రక్రియను 330 రోజుల్లో పూర్తి చేయాలి. అయితే దివాలా పరిష్కార ప్రక్రియ పూర్తికి పడుతున్న సమయం 2023-24లో సగటున 843 రోజులకు పెరిగింది. న్యాయ వివాదాలు ఇందుకు కారణమవుతున్నాయి. ఆర్థిక సంస్థలు తమకు రావాల్సిన బకాయిల్లో, భారీమొత్తాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటానికి ఈ పరిణామమూ ఓ కారణమని ఇక్రా తెలిపింది. 2024-25లోనూ రుణ సంస్థలకు వసూళ్ల సగటు 30-35 శాతంగానే కొనసాగొచ్చని అభిప్రాయపడింది. 2023-24లో మొత్తంగా ఎన్సీఎల్టీ 446 కేసుల్లో లిక్విడేషన్ (ఆస్తుల విక్రయానికి) ఆదేశాలు జారీచేసింది. 2022-23లో ఈ సంఖ్య 400గా ఉంది. దివాలా స్మృతి అమల్లోకి వచ్చినప్పటి నుంచి మొత్తం 5,467 దివాలా పరిష్కార ప్రక్రియలు పూర్తి కాగా.. ఇందులో 45% శాతం కేసులు లిక్విడేషన్కు దారి తీశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..