India- China: చైనాతో వాణిజ్య యుద్ధం.. మనకే నష్టం: పనగరియా
భారత్- చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంపై వాణిజ్య ఆంక్షల్ని విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే, అది మనకే నష్టమని పనగరియా హెచ్చరించారు.
దిల్లీ: సరిహద్దుల్లో చైనా (China) చొరబాట్ల నేపథ్యంలో ఆ దేశంతో భారత్ వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలన్న వాదన కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే, దీని వల్ల మనకే నష్టమని నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా తెలిపారు. ఈ తరుణంలో అలాంటి నిర్ణయం తీసుకుంటే భారత ఆర్థిక వృద్ధి (economic growth)ని పణంగా పెట్టినట్లే అవుతుందని హెచ్చరించారు. దానికి బదులుగా భారత్ ఐరోపా సమాఖ్య, యూకేతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు (FTA) కుదుర్చోవాలని సూచించారు.
‘‘ఈ తరుణంలో చైనాతో వాణిజ్య యుద్ధం అంటే మనం మన ఆర్థిక వృద్ధిని త్యాగం చేసినట్లే. ఆర్థికపరంగా చూస్తే అలాంటి నిర్ణయం పూర్తిగా అవివేకమైన చర్య. సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రతీకారంగా చైనాను వాణిజ్యపరమైన ఆంక్షలతో శిక్షించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తే ఆ దేశం ఊరికే కూర్చోదు. అమెరికా వంటి అగ్రదేశాలు ఆంక్షలు విధించినప్పుడు దాని స్పందన ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటిచెప్పింది. రష్యాపై ఆంక్షలు విధించినందుకు ఐరోపా సమాఖ్య భారీ మూల్యమే చెల్లించుకుంటోంది’’ అని పనగరియా అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంట డిసెంబరు 9న భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భారత సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. గతంలో గల్వాన్ లోయలోనూ ఈ తరహా ఘటన జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో చైనాతో వాణిజ్య సంబంధాల్ని వదులుకోవాలని.. ఆ దేశ ఉత్పత్తుల్ని నిషేధించాలన్న డిమాండ్ పలు వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో పనగరియా వివరించారు.
ఇరు దేశాలు వాణిజ్య యుద్ధానికి దిగితే నష్టం భారత్కే అధికంగా ఉంటుందని పనగరియా అన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ 17 ట్రిలియన్ డాలర్లనీ.. అదే భారత ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్లని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో చైనాపై భారత్ విధించే ఆంక్షల కంటే.. భారత్పై చైనా విధించే ఆంక్షల ప్రభావమే తీవ్రంగా ఉంటుందని తెలిపారు. పైగా అమెరికా వంటి పెద్ద దేశమే.. చైనా, రష్యాపై విధించిన ఆంక్షల నుంచి పెద్దగా ఫలితం పొందలేదని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్- అక్టోబర్ మధ్య చైనాతో భారత వాణిజ్య లోటు 51.5 బిలియన్ డాలర్లు. ఎగుమతులు 60.27 బిలియన్ డాలర్లు. దీనిపై వివరణ ఇస్తూ.. భారత్ దిగుమతి చేసుకునే చాలా వస్తువుల్ని చైనాయే అత్యంత తక్కువ ధరకు ఇస్తోందని పనగరియా తెలిపారు. అదే భారత్ ఎగుమతులకు మాత్రం చైనా సరైన ధరను ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీంతో ఆయా వస్తువులను అమెరికా వంటి ఇతర వాణిజ్య భాగస్వామ్య దేశాలకు సరఫరా చేస్తున్నామన్నారు. అయితే, చైనాతో వాణిజ్య లోటు, అమెరికాతో మిగులు వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదన్నారు.
చైనాతో వాణిజ్య లోటును తగ్గించుకోవాలంటే.. ఇతర వాణిజ్య భాగస్వామ్య దేశాలతో వ్యాపారాన్ని వేగంగా విస్తరించాలని పనగరియా సూచించారు. చైనాపై ఆంక్షల కంటే అది మెరుగైన ఫలితాలిస్తుందన్నారు. ప్రస్తుతం గణనీయ వృద్ధిని సాధించేందుకు భారత్కు అపార అవకాశాలున్నాయని తెలిపారు. ఆ ఫలితాల్ని తర్వాత దశకానికి కూడా అందించాల్సిన అవసరం ఉందన్నారు. వీలైనంత వేగంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరించాలన్నారు. ఒకసారి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే.. అప్పుడు భారత్ విధించే ఆంక్షల ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM