India- China: చైనాతో వాణిజ్య యుద్ధం.. మనకే నష్టం: పనగరియా
భారత్- చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంపై వాణిజ్య ఆంక్షల్ని విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే, అది మనకే నష్టమని పనగరియా హెచ్చరించారు.
దిల్లీ: సరిహద్దుల్లో చైనా (China) చొరబాట్ల నేపథ్యంలో ఆ దేశంతో భారత్ వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలన్న వాదన కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే, దీని వల్ల మనకే నష్టమని నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా తెలిపారు. ఈ తరుణంలో అలాంటి నిర్ణయం తీసుకుంటే భారత ఆర్థిక వృద్ధి (economic growth)ని పణంగా పెట్టినట్లే అవుతుందని హెచ్చరించారు. దానికి బదులుగా భారత్ ఐరోపా సమాఖ్య, యూకేతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు (FTA) కుదుర్చోవాలని సూచించారు.
‘‘ఈ తరుణంలో చైనాతో వాణిజ్య యుద్ధం అంటే మనం మన ఆర్థిక వృద్ధిని త్యాగం చేసినట్లే. ఆర్థికపరంగా చూస్తే అలాంటి నిర్ణయం పూర్తిగా అవివేకమైన చర్య. సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రతీకారంగా చైనాను వాణిజ్యపరమైన ఆంక్షలతో శిక్షించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తే ఆ దేశం ఊరికే కూర్చోదు. అమెరికా వంటి అగ్రదేశాలు ఆంక్షలు విధించినప్పుడు దాని స్పందన ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటిచెప్పింది. రష్యాపై ఆంక్షలు విధించినందుకు ఐరోపా సమాఖ్య భారీ మూల్యమే చెల్లించుకుంటోంది’’ అని పనగరియా అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంట డిసెంబరు 9న భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భారత సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. గతంలో గల్వాన్ లోయలోనూ ఈ తరహా ఘటన జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో చైనాతో వాణిజ్య సంబంధాల్ని వదులుకోవాలని.. ఆ దేశ ఉత్పత్తుల్ని నిషేధించాలన్న డిమాండ్ పలు వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో పనగరియా వివరించారు.
ఇరు దేశాలు వాణిజ్య యుద్ధానికి దిగితే నష్టం భారత్కే అధికంగా ఉంటుందని పనగరియా అన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ 17 ట్రిలియన్ డాలర్లనీ.. అదే భారత ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్లని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో చైనాపై భారత్ విధించే ఆంక్షల కంటే.. భారత్పై చైనా విధించే ఆంక్షల ప్రభావమే తీవ్రంగా ఉంటుందని తెలిపారు. పైగా అమెరికా వంటి పెద్ద దేశమే.. చైనా, రష్యాపై విధించిన ఆంక్షల నుంచి పెద్దగా ఫలితం పొందలేదని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్- అక్టోబర్ మధ్య చైనాతో భారత వాణిజ్య లోటు 51.5 బిలియన్ డాలర్లు. ఎగుమతులు 60.27 బిలియన్ డాలర్లు. దీనిపై వివరణ ఇస్తూ.. భారత్ దిగుమతి చేసుకునే చాలా వస్తువుల్ని చైనాయే అత్యంత తక్కువ ధరకు ఇస్తోందని పనగరియా తెలిపారు. అదే భారత్ ఎగుమతులకు మాత్రం చైనా సరైన ధరను ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీంతో ఆయా వస్తువులను అమెరికా వంటి ఇతర వాణిజ్య భాగస్వామ్య దేశాలకు సరఫరా చేస్తున్నామన్నారు. అయితే, చైనాతో వాణిజ్య లోటు, అమెరికాతో మిగులు వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదన్నారు.
చైనాతో వాణిజ్య లోటును తగ్గించుకోవాలంటే.. ఇతర వాణిజ్య భాగస్వామ్య దేశాలతో వ్యాపారాన్ని వేగంగా విస్తరించాలని పనగరియా సూచించారు. చైనాపై ఆంక్షల కంటే అది మెరుగైన ఫలితాలిస్తుందన్నారు. ప్రస్తుతం గణనీయ వృద్ధిని సాధించేందుకు భారత్కు అపార అవకాశాలున్నాయని తెలిపారు. ఆ ఫలితాల్ని తర్వాత దశకానికి కూడా అందించాల్సిన అవసరం ఉందన్నారు. వీలైనంత వేగంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరించాలన్నారు. ఒకసారి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే.. అప్పుడు భారత్ విధించే ఆంక్షల ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం