Disney-Tata Play Deal: ‘టాటా ప్లే’ ఇక పూర్తిగా టాటాలదే.. డిస్నీతో డీల్!
Disney-Tata Play Deal: టాటా ప్లేలోని తమ పూర్తి వాటాలను వదులుకునేందుకు వాల్ట్ డిస్నీ సిద్ధమైంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.
ఇంటర్నెట్ డెస్క్: టాటా ప్లేలో తమ పూర్తి వాటాలను విక్రయించేందుకు వాల్ట్ డిస్నీ సిద్ధమైంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు బ్లూమ్బెర్గ్ వెల్లడించింది. అమెరికా మీడియా కంపెనీ వాల్ట్ డిస్నీ (Walt Disney) తమ భారత కార్యకలాపాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా వ్యాపారాల్లో విలీనం చేస్తున్న విషయం తెలిసిందే. వాటిపై దృష్టి సారించటం కోసమే డిస్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గత నెల టాటా ప్లే (Tata Play)లో టాటా సన్స్ తమ వాటాను 70 శాతానికి పెంచుకుంది. సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడుల సంస్థ టెమాసెక్ నుంచి 100 మిలియన్ డాలర్లకు 10 శాతం వాటాలను సొంతం చేసుకుంది. ఈ పరిణామం తర్వాత టాటా ప్లే.. టాటా గ్రూప్, డిస్నీ మధ్య 70:30 జాయింట్ వెంచర్గా మారింది. తాజా ఒప్పందంలో భాగంగా డిస్నీ తమ ఆధీనంలోని 30 శాతం వాటాను టాటా గ్రూప్నకు విక్రయించినట్లు సమాచారం. దీంతో ‘టాటా ప్లే’ పూర్తి స్థాయి టాటా కంపెనీగా మారనుంది.
టాటా ప్లేను (Tata Play) 2001లో టీఎఫ్సీఎఫ్తో కలిసి జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేశారు. సెటాప్ బాక్స్ ద్వారా టీవీ ప్రసారాలు, యాప్ ద్వారా ఓటీటీ సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 2.3 కోట్ల కనెక్షన్లు ఉన్నట్లు టాటా సన్స్ వెల్లడించింది. కరోనా మునుపటితో పోలిస్తే టాటా ప్లే విలువ 3 బిలియన్ డాలర్ల నుంచి బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయినప్పటికీ.. ఆ గ్రూప్ కంపెనీల్లో కీలక వ్యాపారంగా కొనసాగుతోంది. 2022లో ఇది ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. కానీ, అది మొదలు కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి
ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్ రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి సారించింది. దీనికి తగ్గట్లుగా పెట్టుబడులు సిద్ధం చేస్తోంది. -
కొత్త వ్యాపారాల్లో అయిదింతల వృద్ధి లక్ష్యం
వ్యాపారాల విలువను గణనీయంగా పెంచుకోవడంపై మహీంద్రా గ్రూపు దృష్టి సారిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ అనిశ్ షా తెలిపారు. -
నియంత్రణ పటిష్ఠమైనా మోసాలు తగ్గట్లేదు: కేపీఎంజీ సర్వే
నియంత్రణ చర్యల్లో పలు మార్పులు చేసినా, మోసాల సంఖ్య తగ్గడం లేదని తమ సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది వెల్లడించినట్లు కేపీఎంజీ వెల్లడించింది. -
తాజా ఉత్తీర్ణులకు హుషారే
గత ఆరు నెలల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్) నియామకాలు 5% పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగ పరిస్థితి క్రమంగా మెరుగవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. -
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్ యాంపీర్ నెక్సస్
గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్కు చెందిన ఇ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రై.లి. తన ఫ్యామిలీ విద్యుత్ స్కూటర్ యాంపీర్ నెక్సస్ను ఆవిష్కరించింది. -
అవిన్యా బ్రాండ్పై టాటా ప్రీమియం విద్యుత్తు కార్లు
టాటా మోటార్స్, ప్రీమియం విద్యుత్తు కార్లను అవిన్యా బ్రాండ్పై ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం. -
సంక్షిప్త వార్తలు(7)
ఈ ఏడాది, వచ్చే సంవత్సరానికి అంతర్జాతీయంగా ముడిచమురు వినియోగ అంచనాల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా వెల్లడించింది. 2024లో రోజుకు 2.25 మిలియన్ బ్యారెళ్లు, వచ్చే ఏడాదిలో రోజుకు 1.85 మిలియన్ బ్యారెళ్ల చొప్పున చమురుకు గిరాకీ పెరుగుతుందన్నది ఒపెక్ అంచనా. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
ఇంటిపై రుణం ఇచ్చే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి?
తాజా వార్తలు (Latest News)
-
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
-
నీతి ఆయోగ్ చెప్పిందదే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు
-
తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!
-
స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలుపు.. సూపర్-8కు ఇంగ్లాండ్