Divgi TorqTransfer IPO: ప్రారంభమైన దివ్గీ టార్క్ట్రాన్స్ఫర్ ఐపీఓ.. పూర్తి వివరాలివిగో!
Divgi TorqTransfer IPO: ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ ఆటో పార్ట్స్ వంటి ప్రముఖ కంపెనీలు కస్టమర్లుగా ఉన్న దివ్గీ టార్క్ట్రాన్స్ఫర్ ఐపీఓ నేడు ప్రారంభమైంది.
దిల్లీ: వాహన పరికరాల తయారీ సంస్థ దివ్గీ టార్క్ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఆఫర్ (Divgi TorqTransfer IPO) నేడు ప్రారంభమైంది. మార్చి 3న ముగియనుంది. ఒక్కో షేరు ధరను రూ.560- 590గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.412 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 2023 ఫిబ్రవరి 28నే బిడ్డింగ్ ప్రారంభమైంది.
ఈ ఐపీఓ (Divgi TorqTransfer IPO)లో రూ.180 కోట్ల విలువ చేసే తాజా షేర్లను జారీ చేయనున్నారు. మరో 39.34 లక్షల ఈక్విటీ షేర్లను కొంత మంది ఇన్వెస్టర్లు ‘ఆఫర్ ఫర్ సేల్ (OFS)’ కింద విక్రయించనున్నారు. తయారీ కేంద్రాల్లోకి అవసరమయ్యే యంత్రాల కొనుగోలుతో పాటు ఇతర కార్పొరేట్ అవసరాలకు ఐపీఓ నిధులను వెచ్చించనున్నారు. ఇష్యూలో అందుబాటులో ఉన్న షేర్లలో 75 శాతం అర్హతగల సంస్థాగత మదుపర్లు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లు, 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. కనీసం 25 షేర్లకు బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఐపీఓ కీలక వివరాలు..
- ప్రారంభ తేదీ: 2023 మార్చి 1
- ముగింపు తేదీ: 2023 మార్చి 3
- ధరల శ్రేణి: రూ.560- 590
- ముఖ విలువ: ఒక్కో షేరు రూ.5
- కనీసం ఆర్డర్ చేయాల్సి షేర్ల సంఖ్య: 25 (ఒక లాట్)
- బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ : 2023 మార్చి 9
- రీఫండ్ల ప్రారంభం: 2023 మార్చి 10
- డీమ్యాట్ ఖాతాకు షేర్ల బదిలీ: 2023 మార్చి 13
- లిస్టింగ్ తేదీ: 2023 మార్చి 14
కంపెనీ వివరాలు..
సిస్టమ్ లెవెల్ ట్రాన్స్ఫర్ కేస్, టార్క్ కప్లర్, డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్స్ను అభివృద్ధి చేసి వాహన తయారీ సంస్థలకు దివ్గీ అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీకి మూడు తయారీ, అసెంబ్లింగ్ కేంద్రాలున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ ఆటో పార్ట్స్ ఈ కంపెనీకి కస్టమర్లుగా ఉన్నాయి. ఇన్గా వెంచర్స్, ఈక్విరస్ క్యాపిటల్ ఈ ఐపీఓకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో నమోదు కానున్నాయి.
ఆర్థిక వివరాలు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు