Divgi TorqTransfer IPO: ప్రారంభమైన దివ్గీ టార్క్ట్రాన్స్ఫర్ ఐపీఓ.. పూర్తి వివరాలివిగో!
Divgi TorqTransfer IPO: ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ ఆటో పార్ట్స్ వంటి ప్రముఖ కంపెనీలు కస్టమర్లుగా ఉన్న దివ్గీ టార్క్ట్రాన్స్ఫర్ ఐపీఓ నేడు ప్రారంభమైంది.
దిల్లీ: వాహన పరికరాల తయారీ సంస్థ దివ్గీ టార్క్ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఆఫర్ (Divgi TorqTransfer IPO) నేడు ప్రారంభమైంది. మార్చి 3న ముగియనుంది. ఒక్కో షేరు ధరను రూ.560- 590గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.412 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 2023 ఫిబ్రవరి 28నే బిడ్డింగ్ ప్రారంభమైంది.
ఈ ఐపీఓ (Divgi TorqTransfer IPO)లో రూ.180 కోట్ల విలువ చేసే తాజా షేర్లను జారీ చేయనున్నారు. మరో 39.34 లక్షల ఈక్విటీ షేర్లను కొంత మంది ఇన్వెస్టర్లు ‘ఆఫర్ ఫర్ సేల్ (OFS)’ కింద విక్రయించనున్నారు. తయారీ కేంద్రాల్లోకి అవసరమయ్యే యంత్రాల కొనుగోలుతో పాటు ఇతర కార్పొరేట్ అవసరాలకు ఐపీఓ నిధులను వెచ్చించనున్నారు. ఇష్యూలో అందుబాటులో ఉన్న షేర్లలో 75 శాతం అర్హతగల సంస్థాగత మదుపర్లు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లు, 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. కనీసం 25 షేర్లకు బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఐపీఓ కీలక వివరాలు..
- ప్రారంభ తేదీ: 2023 మార్చి 1
- ముగింపు తేదీ: 2023 మార్చి 3
- ధరల శ్రేణి: రూ.560- 590
- ముఖ విలువ: ఒక్కో షేరు రూ.5
- కనీసం ఆర్డర్ చేయాల్సి షేర్ల సంఖ్య: 25 (ఒక లాట్)
- బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ : 2023 మార్చి 9
- రీఫండ్ల ప్రారంభం: 2023 మార్చి 10
- డీమ్యాట్ ఖాతాకు షేర్ల బదిలీ: 2023 మార్చి 13
- లిస్టింగ్ తేదీ: 2023 మార్చి 14
కంపెనీ వివరాలు..
సిస్టమ్ లెవెల్ ట్రాన్స్ఫర్ కేస్, టార్క్ కప్లర్, డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్స్ను అభివృద్ధి చేసి వాహన తయారీ సంస్థలకు దివ్గీ అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీకి మూడు తయారీ, అసెంబ్లింగ్ కేంద్రాలున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ ఆటో పార్ట్స్ ఈ కంపెనీకి కస్టమర్లుగా ఉన్నాయి. ఇన్గా వెంచర్స్, ఈక్విరస్ క్యాపిటల్ ఈ ఐపీఓకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో నమోదు కానున్నాయి.
ఆర్థిక వివరాలు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్